పాపం పరిహారం .?

ఆది నుంచి సంక్రమించిన పాపం (ORIGINAL SIN) దానికి పరిహారం (ATONEMENT) అన్న సిద్ధాంతం 
_________________________
క్రైస్తవుడు : నువ్వనేది పాపానికి విమోచనమన్నది, యేసు శిలువ వేయబడడం అన్నది యేసు బోధన కాదన్న మాట? 

ముస్లిం : ఈ పాపపరిహారం కోసం యేసు శిలువ వేయబడడం అన్న సిద్ధాంతం, యేసు వారు ఈ భూమిని వదిలివెళ్ళిపోయిన మూడు వందల సంవత్సరాల తర్వాత చర్చీలచే అంగీకరించబడ్డ సిద్ధాంతం. నేనిప్పుడు నీకు తెలిపే వాక్యాల ద్వారా అది బైబిల్ గ్రంధానికి విరుద్ధమై వ్యతిరేకిస్తుంది

"కుమారుల దోషములనుబట్టి తండ్రులకు శిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు . ఎవరి పాపము నిమిత్తము వాడే శిక్షనొందును."                     (ద్వితియోపదేశకాండం 24:16)

"ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ప్రతీవాడు తన దోషము చేతినే మృతినొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును."       (ఇర్మియా 31:30)

"పాపము చేయువాడే మరణమునొందును. తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయుతలేదని, కుమారుని శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును."
                                                                                                                             (యేహెజ్కేలు 18:20)
కాబట్టి, ఆదం హవ్వాలు తమ పాపముంటే దానికి వారే బాధ్యులు, ఇస్లామీయ దృక్పధం ప్రకారం దానిని అల్లాహ్ క్షమించివేశాడు. 

క్రైస్తవుడు : ఇవన్నీ పాత నిబంధనల్లోనున్నవి కదా?

ముస్లిం : సరే యేసు స్వయంగా తానే ఏమన్నాడో (మత్తయి 7:1,2) చదువు. 

క్రైస్తవుడు : "మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీరును కొలువబడుదురు." 

ముస్లిం : 1 కొరింధీయులు 3:8 కూడా చదువు. 

క్రైస్తవుడు : "నాటు వాడును, నీళ్ళు పోయువాడును ఒక్కటే, ప్రతి వాడు తానూ చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకోనును." 
కాని మనం ఆది నుంచి అంటుకొస్తున్న పాపాన్ని నమ్ముతున్నాం!

ముస్లిం : పిల్లలు అసలెలాంటి పాపమూ లేకుండానే పుడుతారని నన్ను ఋజువు చెయ్యమంటావా? మత్తయి 19:14 చదువు. 
క్రైస్తవుడు : "యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి పరలోక రాజ్యము ఈలాంటి వారిదని వారితో చెప్పి.... "

ముస్లిం : కాబట్టి ప్రతి ఒక్కరు పాపం లేకుండానే పుడుతారు. మరి చిన్న పిల్లలైతే పరలోక రాజ్యమే వారిది. అసలు మోషే ధర్మశాస్త్రాన్ని తుడిచిపారవేసింది పౌలు అన్న సంగతి నీకు తెలుసా? అపోస్తుల కార్యములు 13:39 చదువు

క్రైస్తవుడు : "మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియుగాక."

ముస్లిం :  నేనో ప్రశ్న అడుగుతా! నీవు పునరుత్ధానాన్ని ఎందుకు నమ్ముతున్నావు? అది పౌలు తన సువార్త విషయమని ఒప్పుకున్నాడు కదా? పైగా యావజ్జీవనం ఆటను యేసును చూడలేదు.

క్రైస్తవుడు : అదెక్కడ రాసి ఉంది?

ముస్లిం :  11 తిమోతి 2:8 చూడు. 

క్రైస్తవుడు : "నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మ్రుతులలో నుండి లేచిన ఏసుక్రీస్తును జ్ఞాపకము చేసికొనుము." మరైతే ఆయన శిలువ వేయబడి, మరణించి మృతుల్లోనుంచి లేచాడని మేమెందుకు నమ్ముతున్నామంటావు?

ముస్లిం : ఏమో నాకు తెలియదు. అసలు ఇస్లామన్నది హేతుబద్ధంగా ఆలోచించే ధర్మం. అల్లాహ్ పంపిన యావత్ ప్రవక్తల నిష్కల్మషమైన బోధన. అది విగ్రహారాధనతోగాని, అన్యజనుల విదానాలతోగాని, మూఢ నమ్మకాలతోగాని కలుషితం కాలేదు.

(పాపాలకు బలై మృతుల్లోనుంచి లేచి వచ్చే నమ్మకం అన్య జనుల నమ్మకాల లోనిది. ముఖ్యంగా రోమన్లది. పౌలు దానిని తన సువార్తల్లో పెట్టి యేసుకలా తగిలించాడు - అ. క)

క్రైస్తవుడు : నేనిలాంటి దానికే వేచిఉన్నాను

ముస్లిం :  అందుచేతనే నీవెందుకు సాక్ష్యం పలుకవు? నీకు నేను ఉచ్చరించుటకు సహాయపడతాను.

క్రైస్తవుడు : నేను సాక్ష్యం పలుకుతున్నాను. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరని నేను సాక్ష్యం పలుకుతున్నాను. ముహమ్మద్ (స. అ.సం) అల్లాహ్ దాసుడు, మరియు ఆయన చిట్ట చివరి దైవ ప్రవక్త అని.
"ఆష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ ఆష్ హదు అన్న ముహమ్మదన్ అబ్డుహు వ రసూలుహు" 
సరే ప్రవక్త ముహమ్మద్  (స. అ.సం) గురించి బైబిల్ ప్రవచించి ఉందా? 

ముస్లిం : ఉంది. కాని ఓ ముస్లిం కు బైబిల్ ద్వారా ఆ విషయం తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆ విషయం గురించి వేరుగా చర్చిస్తాను మరోసారి.

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ 


బైబిల్ పరిచయం 

"స్పష్టంగా చెప్పు 'గ్రంధ ప్రజలారా! మీరు తౌరాత్ నూ, ఇంజీలునూ మీ ప్రభువు తరపు నుండి మీవైపునకు అవతరింపబడిన ఇతర గ్రంధాలను ప్రతిష్టించనంతవరకు, అసలు మీరు ఏ పునాది పైనా లేనట్లే" (ఖుర్'ఆన్ 5:68) 

"వారు తౌరాతునూ, ఇంజీలునూ వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంధాలను అనుష్టించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది! ఆ విధంగా చేసి ఉంటె, వారి కొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది, క్రిందినుండి పొంగి ఉండేది. వారిలో కొందరు రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే. కాని వారిలో అధిక సంఖ్యాకులు బహుదుర్మార్గులే. ప్రవక్తా! నీ ప్రభువు తరపునుండి నీ పై అవతరించిన దానిని ప్రజలకు అందజెయ్యి. ఒకవేళ నీవు ఆవిధంగా చెయ్యకపోతే, ఆయన ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వహించానట్లే." (ఖుర్'ఆన్ 5:66,67)

బైబిల్ అని దేనిని అంటారు? బైబిల్ ఎన్ని రకాలు? 

'బైబిల్ అంటే కొన్ని పుస్తకాల కలయిక అని అర్ధము. The Bunch of Books 

బైబిల్ 4 రకాలు: 

  1. 86 పుస్తకాలు  (Orthodox version) O.V. 
  2. 76 పుస్తకాలు  (Charismatic version) C. V.
  3. 73 పుస్తకాలు  (Roman Catholic version) R.C.V. 
  4. 66 పుస్తకాలు  (Protestant version) P.V.                               
1. R. C. V. - Revised Translated Version (R. T. V) నుండి తెలుగులో అనువదించారు. 
2. Protestant - King James Version (K. J. V.) తెలుగు బైబిల్ ఉంది. 

ప్రజలలో సర్వసామాన్యంగా వాడుకలో నున్న బైబిల్ 66 పుస్తకాలున్న Protestant బైబిల్. మరియు రోమన్ కేధలిక్ బైబిలు (73 పుస్తకాలు) కూడా అందుబాటులో ఉన్నాయి. 

Protestant Bible 

పాత నిబంధన (39 పుస్తకాలు) - తౌరాత్ (ధర్మ శాస్త్రం) : యేసుకు పూర్వం ప్రవక్తల ప్రవచనాలు. 

కొత్త నిబంధన (27 పుస్తకాలు) - యేసు పుట్టుక నుండి ఆయన యొక్క సందేశం మరియు ఆయన అనుచరుల యొక్క సందేశము 1. యేసు  2. 12 మంది శిష్యులు. 3. పౌలు మరియు అతని అనుచరులు. 

12 మంది శిష్యులలో కొదరి ద్వారా మనకు అందిన సువార్తలు: 

  1. మత్తయి     - సువార్త - 1 
  2. యోహాను   - సువార్త - 3 పత్రికలు, 1ప్రకటన గ్రంధం 
  3. పేతురు      - పత్రికలు - 2 
  4. యాకోబు   - పత్రిక - 1 
  5. యూదా     - పత్రిక - 1    
మిగతా 7 శిష్యుల పేర్లు మాత్రమే కనిపిస్తాయి. వారి సువార్త మనదాక చేరలేదు. యేసు ప్రత్యక్ష శిష్యులు కానివారి ద్వారా అందిన సువార్తలు


  1. లూకా    -  1సువార్త, అపోస్తల కార్యం 
  2. మార్కు -  1సువార్త 
  3. పౌలు     - 14 పత్రికలు 
యేసు శిష్యుల పేర్లు వివరాలు ఈ క్రింది రేఫరెన్సులొ దొరుకుతాయి.


  1. మార్కు సువార్త      3  : 13-19
  2. లూకా సువార్త        6  : 13-16
  3. మత్తయి సువార్త   10  :   2-4
  4. అపోస్తుల కార్యం     1  :   13
మత్తయి సువార్త ప్రకారం- తద్దయి అని మారు పేరుగల లబ్బయి అని ఉంది. మార్కు సువార్తలో కేవలం తద్దయి అని వున్నది. కాని లూకా సువార్తలో అతని పేరుకు బదులు యోకోబు సహోదరుడైన యూదా అని ఉంది. మత్తయి - మార్కు - సువార్తల ప్రకారం కనానేయుడైన సీమోను అని వుండగా లుకాలో, అపోస్తుల కార్యములలో ను జేలోతే అనబడిన సీమోను అని వుంది. Acts 1:13 ఇంగ్లీషులో Son of James (యాకోబు కుమారుడైన యూదా) అని వుంది.

గమనిక: - ఇంగ్లీషులో James అని వున్నా చోట్ల తెలుగులో యోకోబు అని వుంటుంది.

"వారు పట్టణములోనికి ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారేవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తోలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జేలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు." (అపోస్తుల కార్యములు 1:13)

బైబిల్ చదవడం చదివించడం ఎలా?

"మేము గ్రంధాన్ని ప్రసాదించినవారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. దీనిని వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. (ఖుర్ 'ఆన్ 1:21)

క్రైస్తవులు బైబిల్ ను ఎలా చదువుతున్నారు?

బైబిల్ అంతా దేవుని వాక్యమే అన్న భావంతో చదువుతున్నారు. బాబిల్ లో ఉన్న ప్రతి వాక్యాన్నీ లేఖనమనే భావిస్తారు. ఇంకా ఎన్నో మార్పులకు చేర్పులకు గురైనప్పటికీ పొల్లుగాని సున్నగాని తప్పిపోలేదని బలమైన (అంధ) విశ్వాసంతో ఉన్నారు. 

బైబిల్ ను ఎలా పరిశీలించాలి:

పూర్తి బైబిల్ ను 3 భాగాలుగా విభజించవచ్చు.

1. లేఖనాలు 2. ధర్మశాస్త్రం 3.  చరిత్ర.

1. లేఖనాలు అనగా

ఉదాహరణకు :-  "కాబట్టి ప్రభువు తానె యొక సూచన మీకు చూపును. ఆలాకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును." (యెషయా 7 : 14)

"బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును." (మీకా 5:2) 

నోట్ : యెషయా, మీకా ప్రవక్తల ద్వారా ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పబడిన లేఖనాలు యేసు జీవితకాలంలో ఏవిధంగా నెరవేరాయో  ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి.

''ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలులను పేరు పెట్టుదురు. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లుగా ఇదంతయు జరిగెను.'' (మత్తయి 1:22)

"ఏలయనగా యూద దేశపు బెత్లేహేమా నీవు యూదయ ప్రదానులలో ఎంత మాత్రమును అల్పమైన దానపు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి యున్నదనిరి." (మత్తయి 2 :5)

2. ధర్మ శాస్త్రము అనగా మూసా (అ. స) పై అవతరించిన 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం అని అంటారు.

ఉదాహరణకు: దేవుడు ఈ ఆజ్ఞాలన్నియు వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. "పైన ఆకాశమందే గానీ క్రింది భూమి యందేగాని భూమి క్రింద నీళ్ళ యందేగాని యుండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు; వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏల అనగా నీ దేవుడైన యెహొవానగు నేను రోషము గల దేవుడను." (నిర్గమ కాండము 20:1-5)

ఇంకా 300 లకు పైగా ఆజ్ఞలు ఆదికాండం నుండి దితియోపదేశ కాండము వరకు మనం చూడగలము. యేసువారు మొత్తం పది ఆజ్ఞలను ముఖ్యమైన ఆజ్ఞలుగా చెప్పారు. (మత్తయి 22:36-40)

3. చరిత్ర అనగా సువార్తీకులు అందించిన విషయాలు. (జరిగిపోయిన విషయాలు చూసినవి, విన్నవి మరియు వారి అభిప్రాయాలు కూడా చరిత్రలోనికి వస్తాయి.)

ఉదా: "యేసు - నా గొఱ్ఱెలను మేపుము. నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుముకట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను వెంబడించు మని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని - ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి - ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు - నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రాచుర మాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు. గాని - నేను వచ్చుటకు అతడుందుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము." (యోహాను 21:18-24) 

క్రైస్తవులకు బైబిల్ ఎలా చదివించాలి?

ఉదా: ఒట్టు (లేక) ప్రమాణము తీసుకోండి.

మొదట లేఖనాన్ని పరిశీలిద్దాం : 1. యెహోవా చెప్పుట :

"నీ దేవుడైన యెహొవానకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను." (ద్వితియోప దేశ కాండము 10:20)

2. యేసు చెప్పిరి : "మరియు - నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకోనవద్దు ;  ఆకాసము తోననవద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు; అది ఆయన పాద పీఠము, యేరుషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకోనవద్దు. నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే, అవును, కాదంటే కాదు అని యుండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది." (మత్తయి 5:33-37)

3. శిష్యులు చెప్పుట : "నా సహోదరులారా! ముఖ్యమైన సంగతి ఎదనగా, ఆకాశము తోడనిగాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు  పెట్టుకోనక, మీరు తీర్పు పాలు కాకుండు నట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను." (యాకోబు 5:12)


పాపము --పరిహారము 

"ఈ గ్రంధం అల్లాహ్ తరపు నుండి అవతరించింది. ఆయన మహా శక్తిమంతుడు. మహాజ్ఞాని, పాపాలను క్షమించేవాడు, పశ్చాతాపాన్ని అంగీకరించేవాడు; కఠినంగా శిక్షించేవాడు; ఘనంగా కరుణించేవాడు; ఆయన తప్ప ఆరాధ్య దైవం మరెవ్వడూ లేడు. ఆయన వైపునకే అందరూ తిరిగి పోవలసి ఉన్నది." (ఖుర్'అన్ 40:2-3)

పాపమని దేనినంటారు?

"కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి - మేము యోహానాకును, నీకును విరోధముగా మాటలాడి పాపం చేసితిమి" (సంఖ్యా కాండము 21:7)

"వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకుని నీమాట వినకపోతిరి." (నెహెమ్యా 9:29)

"సకల దుర్నీతియు పాపం." (1వ యోహాను 5:17)

"అజ్ఞాతిక్రమమే పాపము." (1వ యోహాను 3:4)

పై వాక్యాలను బట్టి దేవుని తిరస్కరించినను, దేవునికి, దైవ ప్రవక్తకు విరోధంగా మాటలాడినను, దేవుని ఆజ్ఞలకు లోబడక ఆజ్ఞాతిక్రమము చేసినను పాపం అవుతుంది.

పాపాలు ఎన్ని రకాలు?

"అపుడు ఇశ్రాయేలీయులు - మేము నీ సన్నిధిని పాపం చేసి యున్నాము. మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱపెట్టగా" (న్యాయాధిపతులు 10:10)

"రునాడు మోషే ప్రజలతో - మీరు గొప్ప పాపం చేసితిరి" (నిర్గమ కాండం 32:30)

"మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా ..." (ద్వితియోపదేశకాండం 21:22)

"తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవరైనను చూచినా యెడల అతడు వేడుకునును. అతని బట్టి దేవుడు మరనకరము కాని పాపం  చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపం కలదు అట్టి వాని గూర్చి వేడుకోనవలేనని నేను చెప్పుటలేదు." ( 1వ యోహాను 5:16)

"నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను." (యోహాను 19:11)

"సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపలడును గాని పరిశుద్ధాత్మ విషయమున దూషణచేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై యుండును."
(మార్కు 3:28,29) 

"ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారికి అందరి యెదుట గద్దించవలెను." (1తిమోతి 5:20)

"ఒకడు పొరపాటున పాపం చేసిన యెడల..." (సంఖ్యా కాండం 15:27)

"మూర్ఖుని యోచన పాపము. " (సామెతలు 24:9)

"కాబట్టి మేలైనది చేయనెరిగియూ ఆలాగు చేయని వానికి పాపం కలుగును." (యాకోబు 4:17)

"విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము." (రోమా 14:23)

పాపము - పర్యవసానము:

"అందుకు యోహానా - ఎవడు నా యెదుట పాపం చేసెనో వాని నా గ్రంధంలో నుండి తుడిచివేయుదును.
(నిర్గమ కాండం 32:33)

"అయితే మీరు నన్ను విసర్జించి ఆవు దేవతలను పూజించిరి కనుక నేను ఇకనూ మిమ్ములను రక్షింపను." (న్యాయాధిపతులు 10:13) 

".... వారి పాపములను బట్టి వారిని సిక్షించును మరియు యెహోవా నాతొ ఇట్లనెను - వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్ధన చేయకుము." (యిర్మియా 14:10-11)

"అతడు చేసిన నీతి కార్యములు జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపము బట్టి మరణం నొందును." (యేహెజ్కేలు 18:24) 

"విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించెదురు." (యేహెజ్కేలు 23:49)

"నిరపరాధుల రక్తంతో యేరుషలెమును నిమ్పినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను."
(II రాజులు 24:5)

"మీ పాపములు రక్తంవలె ఎర్రనివైనను అది హిమము వాలే తెల్లబడును. కెంపువలె ఎర్రనివైనను అవి గోఱ్ఱే బొచ్చు వలె తెల్లనివగును" (యెషయా 1:18)

ఈ విధంగా ఎన్నో రకాల పాపాలను గురించి వాటి పరిహారం, పర్యవసానం గూర్చి, క్షమించబడే, క్షమార్హం కాని మరణకరమైన, ఎక్కువ, తక్కువ, చిన్న, గొప్ప, పొరపాటున, బుద్ధిపూర్వకంగా చేసే మరియు అవిశ్వాస సంబధమైన పాపాలను గూర్చి బైబిల్ ప్రస్తావిస్తుంది. వాటన్నిటి గురించి ఒకేసారి చర్చించడం అసాధ్యం కాబట్టి విశ్వాసమునకు సంబంధించిన పాపము - పరిహారము గూర్చి కొన్ని విషయాలు పరిశీలిద్దాం.

పాపం చేసేదెవరు? చేయించేదెవరు? 

 "యెహోవా మాట వినక ఆయన ధర్మ శాస్త్రమును బట్టియూ కట్టడములను బట్టియూ ఆయన తనకు సాక్షార్ధముగ ఇచ్చిన ఆజ్ఞలను బట్టియూ నడవక మీరు రూపము వేయుచూ యెహోవాకు విరోధంగా పాపం చేసితిరి కనుక నే నేడునట్లుగా ఈ కీడు మీకు సంభవించును." (యిర్మియా 44:23)

"ధర్మ శాస్త్రము త్రోసి వేయువారు దుష్టులను పొగుడు చుందురు. ధర్మశాస్త్రం ను అనుసరించువారు వారితో పోరాడుదురు." (సామెతలు 28:4)

"వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపము చేయరు" (కీర్తనలు ; 119:3) 

"నీ యెదుట నేను పాపం చేయుకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకునియున్నాను. " 
(కీర్తనలు; 119:11)

"నేను పాపులను పిలువ వచ్చితిని గానీ నీతి మంతులను పిలువ రాలేదు." (మత్తయి 9:13)

"దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడునూ పాపము చేయడని యెరుగుదుము. దేవుని మూలమున పుట్టినవాడు తన్ను భద్రం చేసుకోనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. "  (I యోహాను 5:18)

పై వాక్యాల ప్రకారం యెహోవా మాట వినక ధర్మశాస్త్రపు ఆజ్ఞల ప్రకారం తానూ నడువక ఇతరులను నడిపింపక దుష్టులను పొగుడు వాడు పాపాత్ములని దేవుని మూలంగా పుట్టినవాడు ఆజ్ఞలను గైకోనుచూ హృదయమును భద్రపరచుకొనుటయే గాక ధర్మ శాస్త్రమును త్రోసి వేయు వారితో పోరాడుచూ ఎన్నటికీ పాపం చేయడని స్పష్టమవుతున్నది.

యేసు బోధనలో పాపం ఏది? 

"కాగా మీ పాపములోనే ఉండి మీరు చని పొవుదునని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపంలో ఉండి చనిపొవుదురని వారితో చెప్పెను." (యోహాను 8:24)

ఇది యేసు పట్ల విశ్వాసమునకు సంబంధించిన విషయం. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి "యేసు నేను ఆయననని విశ్వసించమంటే ఎవరిని విశ్వసించాలి? దేవుదనా?దీనిలోని భాగమనా? త్రియేక దేవుడనా? మెసియ్యా అనా? ఏమని విశ్వసించాలి? ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

"....ఆ స్త్రీ ఆయనతో - క్రీస్తనబడిన మెసియ్య వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మీకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాట్లాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను" (యోహాను 4:25-26)

పై రెండు వాక్యాలను బట్టి యేసు దేవుడని దేవునిలోని భాగమని త్రియెక దేవుడని విశ్వసించు వాడు పాపం చేసినవాడై పాపంలోనే యుండి చనిపోవురని అర్ధమవుతుంది. ఇంకా యేసును క్రీస్తనబడిన మెసయ్యా అని
మాత్రమే విశ్వసించాలని స్పష్టమవుతుంది. 

యూదులకు ఏ పాపం వచ్చింది ? 

"నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మేష లేదు." (యోహాను 15:22)

"ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపం లేక పోయెను.
(యోహాను 15:24) 

"ఆయన వారి ఎదుట యిన్ని సూచక క్రియలు చూసిననూ వారాయన యందు విశ్వాసముంచరైరి.
(యోహాను 12:37)

"అందుకు యేసు - మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పాలనుకోనుచున్నారు గనుక మీ పాపం నిలిచి యున్నదని చెప్పెను." (యోహాను 8:41)

"ఎందుకనిన ఆయన క్రీస్తు అని ఎవరైననూ ఒప్పుకోనిన యెడల దానిని సమాజ మందిరంలో నుండి వేలివేయమని యూదులు అంతకు మునుపే నిర్ణయించుకొని యుండిరి." (యోహాను 9:22)

వాక్యాల ప్రకారం యేసు అనేక సూచక క్రియలు చేస్తూ తానె క్రీస్తని ప్రకటిస్తున్నప్పటికీ యూదులు యేసును క్రీస్తుగా, మెసియ్యగా విశ్వసింపక విశ్వసించే వారిని సమాజ మందిరములో నుండి వెలివేస్తామని భయపెడుతూ వచ్చారు. తాము విస్వసించక పోవడం ఒక పాపమైతే విశ్వసించే వారిని అడ్డుకోవడం వలన మరో పెద్ద పాపం వారికి వచ్చి పడింది. ఇంకా మీరు గ్రుడ్డి వారైతే, మీకు పాపం లేకపోవును గానీ అని చెప్పుట ద్వారా మానవుడు జన్మతః పాపి కాదని కూడా తెలుస్తుంది.

ఈ పాపమును ఒప్పుకోనజేసేదెవరు ?

"ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమందు ఒప్పుకోనజేయును." (యోహాను 16:8)

పై వాక్యం ప్రకారం ఆదరణకర్త లేక ఉత్తరవాదియైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవ వాణి దివ్య ఖుర్'ఆన్ మరియు ప్రవచనాల ద్వారా యేసు మేసియ్యా అని ఆనాటి యూదులను క్రైస్తవులను యావత్ మానవాళిని ఒప్పుకోనేలా బోధించడం జరిగింది. తర్వాత ఆయన అనుచరులైన ముస్లింలంతా నేటికి యేసే మేసియ్యా అని లోకమును ఒప్పుకోనజేయుచున్నారు.

క్రీస్తు పూర్వం పాప పరిహారం ఎలా జరిగేది ? 

"ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధ పరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా - మా పాపా లన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుకోనుచున్నాము. నీవంగీకరింప దగినవి ఇవే మాకున్నవి." (హోషేయా 14 : 1 - 2)

"ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి నుంచెదను. వారి హృదయం మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడైయున్నందున వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడునూ - యెహోవాను గూర్చి బోధనొందుదము. అని తమ పొరుగు వారికి గానీ సహోదరులకు గానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడునూ జ్ఞాపకం చెసుకొనను గనుక అల్పులేమి, ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు." (యిర్మియా 31:33,34)

"ఆయన వేయి వేల మందికి కృపను చూపుచూ దోషములను, అపరాధములను, పాపమును క్షమించును...."
 (నిర్గమ కాండం 34:7)

"నేను నేనే నా చిత్త ప్రకారంగా నీ యతిక్రమములను తుడిచి వేయుచున్నాన్ను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసికొనును." (యెషయా; 43:25)

పాపులు మారు మనస్సునొంది దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపము తో చేసిన పాపాలు ఒప్పుకొని మా పాపాలన్నింటినీ పరిహరింపుమని మొఱపెట్టుకొనగా వారి అపరాధాలను, దోషములను, పాపాలను క్షమించడమే గాక గత పాపాలు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవని యెహోవా వాగ్దానం చేస్తున్నట్లు మనం గ్రహించగలం.


حم  تانزيل الكتاب من الله العزيز العليم  غافير ألذنب 

(و قابيل أتوب شاديد العقاب ذي الطول (سورة المومن

"హా మీమ్. ఈ గ్రందావతరణ అల్లాహ్ తరపున జరిగింది. ఆయన మహా శక్తిమంతుడు, సర్వం తెలిసినవాడు. పాపాలను క్షమించేవాడు (అనంతంగా) అనుగ్రహించేవాడు" (ఖుర్'ఆన్ 40 : 1-3)

ఆయన గతంలో దాసులపట్ల జరిగిన పాపాలను మన్నించే వాడు. భవిష్యత్తులో జరిగే పొరపాట్లపై దాసుల పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. లేదా తన నేస్తాల పాలిట క్షమా శీలి, తనను తిరస్కరించే వారు గనక పశ్చాత్తాపం చెందితే వారి పశ్చాత్తాపాన్ని దయతో స్వీకరించేవాడని అర్ధం. 

యేసు ఏమని బోధించారు ? 

"మీకు ఒకని మీద విరోధమైననూ కలిగియున్న యెడల మీరు నిలబడి ప్రార్ధన చేయు నప్పుడెల్లనూ వాని క్షమించుడి. అపుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపాలు క్షమించును." (మార్కు 11:25-26)

"మేము మాకోచ్చియున్న ప్రతివానిని క్షమించియున్నాము కనుక మా పాపాలు క్షమింపుము." (లూకా 11:4)

"యేసు - తండ్రి వేరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను." (లూకా 23:34)

"అటువలె మారు మనస్సులేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును." (లూకా 15:7)

పూర్తి బైబిల్ పరిశీలిస్తే దైవ దూషణ , విగ్రహారాధన, వ్యభిచారం, నరహత్య లాంటి ఘోరపాపాల పరిహారానికి మరియు జన్మతః పాప పరిహారానికి బలులు ఇచ్చినట్లు కనీసం ఒక్క వాక్యమైన కనిపించదు. అయితే పాపులు తమ పాప పరిహారానికి విరిగి నలిగిన హృదయంతో దీర్ఘ శాంతుడైన యెహోవాకు ప్రార్ధించిన వెంటనే ఆయన వారి పాపాలను క్షమించి వేవేలుగా కృప జూపిన ఎన్నో సంఘటనలు బైబిల్ లో కానవస్తాయి. ఇంకా యేసు తన సువార్తలలో సయితం దేవుడు పాపాలను క్షమించేవాడని చెప్పడమే గాక తను స్వయంగా తనకు హింసిస్తున్న వారి విషయంలో క్షమించమని దేవుని ప్రార్దిన్చినట్లుగా మనకు తెలుస్తుంది. మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని చెప్పడం బట్టి పాప పరిహారానికి పశ్చాత్తాపం చాలని, ఎవరి రక్తం, ఎవరి బాలి అవసరం లేదని స్పష్టమౌతుంది. 

యేసు నీతిమంతుడు; నీతిమంతుని ప్రార్ధనను దేవుడు అంగీకరిస్తాడు!

"అతడు న్యాయ పీఠం మీద కూర్చుండి యుండినప్పుడు అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధ పడితినని అతని యొద్దకు ఒక వర్తమానం పంపెను.
(మత్తయి; 27:19)

"నీతి మరణము నుండి రక్షించును." (సామెతలు; 10:2)

"నీతిమంతుడు ఆపదను తప్పించుకోనును" (సామెతలు; 12;13)

"యెహోవా దృష్టి నీతిమంతులపై ఉన్నది" (కీర్తనలు ; 34:15)

"నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమల నుండి వారిని విడిపించును." (కీర్తన 34:17)

"నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు" (కీర్తన ; 34:19-20) 

"వీటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. యహోవా నీతిమంతులను అప్పగించడు." (కీర్తన 37:32-33)

"నీతిమంతుడు ఆశించినది దొరుకును." (సామెతలు 10:24)


قال عسى ابن مريم اللهم ربنا أنزل علينا مائدة من 

(أسماء تكون لنا عيد لا ولينا و أخرنا فا أفية منك (سورة الماعدة

"అప్పుడు మర్యం కుమారుడగు ఈసా ఇలా వేడుకున్నాడు : "ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుంచి మాపై
ఆహారంతో నిండిన పళ్లాన్ని దించు. అది మా కొరకు, అనగా మాలోని తొలివారు, తుది వారందరికీ సంతోషకరమైన 
విషయం (పండుగ) కావాలి." (ఖుర్'ఆన్ 5:114)

"మృతులు మృతులను పాతిపెట్టుకొనిమ్మని చెప్పెను." (మత్తయి 8:22)

"ఈ చిన్నది నిద్రించు చున్నదిగాని చనిపోలేదు." (మత్తయి 10:19)

"ఈనా కుమారుడు చనిపోయి మరలా దొరికెను తప్పిపోయి దొరికెనని చెప్పెను." (లూకా 15:24)

"(ఓ ప్రవక్తా!) నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ మృతులకు వినిపించ లేవు. నీవు పిలిచినప్పుడు వెన్నుచూపి వెళ్ళిపోయే చెవిటి వారికి కూడా (నీ వాణిని) వినిపించలేవు." (ఖుర్'ఆన్ 30:52)  

యేసు ప్రార్ధనను దేవుడంగీకరించాడు ! 

"యేసు కన్నులు పైకెత్తి - తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును." (యోహాను 11 : 41 - 42)

"మహా రోదనతోను, కన్నీళ్ళతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్ధనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరించబడెను." (హేబ్రియులకు 5:7)

"దూత ఆయనకు కనబడి యేసును బలపరిచెను." (లూకా 22:43)

మానవుల పాపపరిహారార్ధం యేసు వచ్చినట్లయితే తప్పించమని ఎందుకు ప్రార్ధాన చేశారు?

"కొంత దూరం సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆ ఘడియ తన యొద్ద నుండి తొలగిపొవలెనని ప్రార్ధించుచు. నాయనా తండ్రీ నీకు సమస్తము  సాధ్యము. ఈ గిన్నె నాయొద్ద నుండి తొలగించుము. అయిననూ నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము." (మార్కు ; 14:35)

"వారి యోద్దనుంది రాత్రివేళ దూరంగా పోయి మోకాళ్ళూని ! తండ్రీ ! ఈ గిన్నె నా యొద్ద తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయిననూ నా యిష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్ధించెను. అపుడు పరలోకము నుండి యొక దూత కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదనపడి మరింత ఆత్రుతగా ప్రార్ధన చేయగా ఆయన చెమట నెల పడుతున్న గొప్ప రక్త బిందువులాయెను." (లూకా ; 22 : 41-43)















   





No comments:

Post a Comment