బైబిల్ లో 50000 తప్పులు!

బైబిల్ లో 50000 తప్పులు
జెహోవా విట్నెసెస్ (అతిప్రఖ్యాత క్రైస్తవ ప్రచార సమాజం) తన 8 సెప్టెంబర్ 1957 నాటి 'అవేక్' (AWAKE)  (మేలుకో) పత్రికలో అత్యంత సంభ్రమం కలిగించే శీర్షిక నొకదాన్ని ప్రచురించింది. ఆ శీర్షిక పేరు "50,000 ERRORS IN THE BIBLE 
(బైబిల్ లో యాభై వేల తప్పులు).
నేను నా ఈ చిన్న పుస్తకం పని మొదలెట్టేటప్పుడు ఓ ఆదివారం ఉదయం ఎవరో నా తలుపు తట్టారు. నేను తలుపు తెరిచాను. ఓ యూరోపియన్విశాలంగ నవ్వుతూ నిలబడి "గుడ్మార్నింగ్" అని తిరిగి అన్నాడు. నేనూ 'గుడ్మార్నింగ్' అని తిరిగి సమాధానమిచా. అతను తన దగ్గరున్న 'అవేక్', 'వాచ్ టవర్' పత్రికల్ని నాకందించాడు. అవును అతను యహొవా విట్నెస్ సమాజానికి చెందిన వ్యక్తి. వారిలో ఎవరైనా మీ తలుపు తడ్తే ఆ తట్టడంలోని ఓ అహంకారాన్ని మీరు కనుక్కోగలరు. సరే! నేను లోపలికి ఆహ్వానించాను. అతను కూర్చున్న తర్వాత నేను ఓ పాత  AWAKE పత్రికను చూపించి 'ఇదీ మీదేగా?' అని అడిగాను. అవునని అతను తలూపాడు. 'ఇందులో, బైబిలు గ్రంధంలో 50, 000 తప్పులున్నాయని వుందే! ఇది నిజమేగా?' అని అడిగాను. "ఏమిటది?"  అతను కాస్త ఆశ్ఛర్యపడ్డాడు. నేను మళ్ళీ చెప్పాను. "మీ బైబిలు గ్రంధంలో 50, 000 తప్పులున్నాయని ఈ పత్రికంటుంది" అని.
అతను ఆశ్ఛర్యంగా అడిగాడు "ఇది మీకు ఎక్కణ్ణుంచి వచ్చింది?" అని. (అది దాదాపు 23 సంవత్సరాల నాటిది. బహుశా అప్పుడతను చిన్న పెల్లవాడై వుండాలి!)  
"ఆ మాటనలా వుంచు. ఇది మీదేనా? అని ఆ పత్రిక పేరు "AWAKE" ను చూపించాను.
"AWAKE" అని అతనూ ఉచ్చరించాడు. నేను చూడవచ్చా? అని అడిగాడు. తప్పకుండా అంటూ నేను పత్రిక మొదటి పేజీ అతని కందించాను. అతను చదవ సాగాడు.
జెహోవా విట్నెస్ వాళ్ళు బాగా ట్రైనింగ్ పొందిన ప్రచారకులు. వాళ్ళకు KINGDOM HALLS   లో వారానికి ఐదుసార్లు ట్రైనింగ్క్లాసులు జరుగుతాయి. క్రైస్తవ ప్రపంచంలోని వేయిన్నొక్క ప్రచార సమాజాల్లో వీరే సరైన మిషనరీలు. ఎక్కడైనా ఏదైనా చిక్కు ప్రశ్న వస్తే, ఇరకాటం వస్తే ఏ విషయాన్ని, తమకు తామై ఒప్పుకోకూడదని, దేనికీ నోరుగాని, ద్వారంగాని తెరవరాదని, పరుశుద్ధాత్ముడు వచ్చి ఉత్తేజపరిచేవరకు ఆగాలని బాగా ట్రైనింగ్ పొందినవారు.
అతనలా కాగితాన్ని త్రిప్పుతూ వుంటే నేనతన్ని గమనిస్తూ పోయాను. ఠక్కున అతను తలపైకెత్తాడు. అతనికి సమాధానం దొరికినట్టుంది. పరిశుద్ధాత్మ అతన్ని కదిలించాడేమో!. అతను మొదలెట్టాడు, ఈ వ్యాసం అంటుందిఆ తప్పుల్లోంచి చాలా తీసివేయబడ్డాయి అని. చాలా వాటిని తీసివేశారంటే 50, 000 తప్పుల్లోంచి ఇంకా ఎన్ని మిగిలుంటాయంటావు? ఐదువేలా? ఐదువందలా? ఏభయ్యా? కనీసం ఏభై తప్పులు మిగులున్నా వాటిని దేవుని కంటగట్టాల్సిందేనా? అని అడిగాను.
పాపం అత్నికి మాట రాలేదు. క్షమించమని, తన చర్చీ సీనియర్ మెంబరు ఒకాయనతో మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. బహుశా ఆరోజు అంతా తేలిపోతుందని అనుకున్నాను. మరి ఆ రోజు రాలేదు.
ఈ నా పుస్తకం అప్పటికీ రెడీ అయిపోయుంటే అతనికిచ్చి చెప్పి వుండేవాడిని, "నీపేరు, చిరునామా, ఫోన్నెంబరివ్వు. ' బై్బిలు దైవ వాక్యమా?' (IS THE BIBLE GOD’S WORD?) "నీకు 90 రోజులకు గాను అరువుగా ఇస్తాను. చదివి నాకు జవాబు వ్రాసిపంపు" అని. కొందరు ముస్లిమ్మిత్రులు ఆ పని చేస్తున్నారు. మీరు ఆ పని చేస్తే ఆ మిషనరీ ప్రబోధకులు ఇంకెప్పుడూ మీ తలుపు మళ్ళీ తట్టరు. నేటి వరకూ ఈ పుస్తకం ఆ అద్భుతం చేస్తూనే వస్తోంది. మాషాఅల్లాహ్! శబ్ధార్ధ విన్యాసం తో, సదాచార త్రిత్వవాదులైన క్రైస్తవులతో దైవవాక్యం విషయంలో, అతి గట్టిగా తప్పుపట్టి ఆ సమాజాలన్నింటిని తూలనాడే, ఈ జెహోవా విట్నెసెస్ సమాజం తానే అలాంటి ఆటలాడుతుంది. ప్రస్తుతం మాట్లాడిన వ్యాసం "బైబిలు గ్రంధం లో 50, 000 తప్పులు" అన్న విషయంలో వాళ్ళిలా అంటారు.
"బహుశా 50,000 తప్పులుండవచ్చు…. ఆ తప్పులు బైబిలు గ్రంధంలో దొర్లి వుండవచ్చు… 50, 000 గంభీరమైన తప్పులా…. అందులో పెక్కు తప్పులనబడ్డవిమొత్తానికి బైబిలు సరైనది!"
 రివైస్డ్ స్టాండర్డ్ వెర్షన్రచయితలతో వాళ్ళు పున: పరిశీలన చేసి మార్చారన్న వేలాది తప్పులను అవి గంభీరమైనవా స్వల్పమైనవా అని తర్కించేందుకు మన దగ్గర అంత టైము లేదు, జాగాలేదు. ఆ సదావకాశాన్ని ఆ బైబిలు పండితులకే విడిచి పెడదాం. ఇక్కడ మాత్రం ఓ అరడజను చిన్న మార్పులను గురించి మాత్లాడే కృషి చేస్తాను.
(యషయా; 7: 14 AV)
"కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి కన్యక గర్భవతి యై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును."
       ఈ అనివార్యమైన కన్య అన్న పదం ఆ వాక్యంలోంచి రివైస్డ్ స్టాండర్డ్ వెర్షన్నుంచి కొన్ని పదాల పొందికగా మారి ఒక యువస్త్రీ అని మార్చ బడింది. అది వాస్తవానికి హిబ్రూ బైబిలు గ్రంధంలో వున్నది. కన్య అన్న పదానికి సమానార్ధకమైన బెతుల్లాహ్ కాదు. (బెతుల్లాహ్ అంటే కన్య. 'అల్లాహ్' అంటే 'ఒక యువతి'. హిబ్రూ గ్రంధాలన్నిటిలో 'అల్లాహ్' అని వుంది. బెతుల్లాహ్ కాదుఅనువాద కర్త)  
పున: విమర్శన, పరిశీలన చేసి మార్చబడిన ఇంగ్లీషు అనువాద బైబిలు ఒక్క రివైస్డ్ స్టాండర్డ్ వర్షెన్బైబిలు మాత్రమే. కాబట్టి ఈ సర్దుబాటు, మార్పు అందులో ఒక్క దానిలోనే జరిగింది. ఆఫ్రికన్‌, ఆప్రికానర్‌, అరబ్బీ, జులూ (హిందీ, తెలుగు తదితర) వాస్తవానికి 1500 ఇతర ప్రపంచ భాషల్లో క్రైస్తవులు ఇంకాను 'కన్య' అన్న తప్పటర్ధాన్నే మ్రింగుతూ వస్తున్నారు.

'కన్న' (పుట్టిన) - 'సృష్టించబడిన' కాదు
'యేసు ఒక్కడే దేవుని కన్న కొడుకు' కన్న బిడ్డకాని సృష్టించబడిన బిడ్డకాదు. క్రింద ఇవ్వబడ్డ వాక్యాన్ని ఆసరాగా వాడి, ఇలానే సదాచార ప్రశ్నోత్తర సారాంశంగా కన్న కుమారుడని తీసుకోవడం జరిగింది.

2. యోహాను 3: 16 AV
"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య పొందునట్లు ఆయన అనుగ్రహించెను."

          మున్ముందు మతం మార్పిడి చేసుకునే వారికి ప్రచారం చేసేటప్పుడు. కాస్త బుర్రవున్న ఏ మత ప్రబోధకుడు కూడా 'తండ్రి యొక్క ఒక్కగానొక్క కన్న కొడుకు అని చెప్పడు. బైబిలు పున: పరిశీలకులు ఈ 'కన్న 'BEGOTTEN' అనే పదాన్ని తీసేశారు. దానికి కారణం తెలుపకుండానే చర్చీ ఎలుకల్లా చడీచప్పుడూ లేకుండా చేసిన ఈ రహస్యపరమైన తీసివేతను, మార్పును గురించి ఏమీ పలకరు. ఈ దైవదూషిత 'కన్న' 'BEGOTTEN' అన్న పదం బైబిల్లో నూతనంగా కల్పించిన పదం. ఈ నూతన మార్పును, దైవదూషణను వెనువెంటనే దేవుడు కఠినమైన పదాలతో ఖండించేశాడు. దాదాపు 2000 ఏళ్ళవరకూ బైబిలు పండితులు గ్రహించేందుకని ఆగలేదు.  
(ఖుర్ఆన్; 19: 88-92) "కరుణామయుడు ఎవరినో కుమారునిగా చేసుకున్నాడు అని వారు అంటారుఎంత ఘోరమైన విషయాన్ని మీరు కల్పించి తెచ్చారు. కరుణామయునికి సంతానం వున్నదని వారు చేసే వాదన కానణంగా త్వరలోనే ఆకాశాలు పగిలి పోతాయెమో, భూమి బ్రద్దలౌతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో. ఎవరినైనా కుమారునిగా చేసుకోవడం అనేది కరుణామయుని ఔన్నత్యానికి తగినది కాదు.

క్రైస్తవ సమాజంలోని మేధాసంపత్తిలోని 'ఏభై సహకరించుకునే శాఖలు' "అత్యంత ప్రతిభాశాలురైన ముప్ఫై రెండు మంది పండితులు" కలిసి మార్పులు చేసి బైబిలు గ్రంధాన్ని కొంత వరకు పవిత్ర ఖుర్ ఆన్కు దగ్గర చేయడాన్ని ముస్లిం ప్రపంచం అభినందిస్తుంది.
(ఖుర్ఆన్‌; 112: 3) "ఆయనకు సంతానం ఎవరూలేరు. ఆయన కూడా ఎవరి సంతనమూ కాదు."   

క్రైస్తవులు వేసిన తప్పుడు లెక్కలు:
(యొహాను; మొదటి పత్రక; 5:7 AV)  "ఆకాశమున సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, తండ్రి, వాక్యము మరియు పరిశుద్ధాత్మ యు, ఈ ముగ్గురు ఏకీభవించివున్నారు."
సర్వ సంగ్రహ నిఘంటువు (Encyclopedia) అనబడే బైబిలు గ్రంధంలో, క్రైస్తవులు పలికే తమ పవిత్ర త్రిత్వ సిద్ధాంతానికి (TRINITY) కి అత్యంత దగ్గరి వాక్యమిది. కాని పున: పరిశీలన చేసుకున్న రివైస్డ్ స్టాండర్డ్ వర్షెన్(RSV) లో ఎలాంటి దగ్గరి రూపు రేఖలూ లేకుండా పైవాక్యం మార్చి వేయబడింది. ఆంగ్లభాష పలికే (చదివే) వారికై వ్రాసిన RSV (పున: పరిశీలన గావించి స్థిరం చేయబడ్డ పాఠ్య భాగం) బైబిల్లో ఈ పవిత్రమైన మోసం అతి గౌరవపరంగానే జరిగింది. కాని ప్రపంచంలోని మిగిలిన 1499 భాషా లోకాలకు తమ తమ భాషల్లో ఈ తంతు విషయం తెలియదు.
ఈ మోసపూరితమైన మార్పు అలానే ఉండి పొయింది. వాస్తవానికి ఈ సత్యం ప్రజలకు తీర్పుదినం వరకూ తెలియకుండా వుండిపొయింది. కాని ముస్లిములైన మనం, మరోమారు ఇంగ్లీషు RSV నుంచి ఈ పండితులు చేసిన పనిని బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే వారి ఈ కృషి తమ పరుశుద్ధ గ్రంధాన్ని ఇస్లాం పాఠ్యాలకు మరో అడుగు దగ్గర చేస్తుంది కాబట్టి. పవిత్ర ఖుర్ఆన్ఏమంటుందో చూడండి:
(ఖుర్ఆన్‌; 4: 171) "ముగ్గురు అని అనకండి, ఇలా అనడం మానివెయ్యండి ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు."

ఆరోహణ (స్వర్గారోహణ)
పున: పరిశీలన చేసిన మార్పు చెందిన RSV బైబిలు గ్రంధకర్తల అనువాదకులు ' ఆ గంభీరమైన తప్పులలోనుంచి సరిదిద్దే ప్రయత్నం చేసిన మరో వాక్యం ఆరోహణ (ఆకాశంలోకి యేసు వారు లేవనెత్తబడడం) అన్నది.
ఈ క్రైస్తవ ప్రపంచపు అత్యద్భుతమైన సంఘటన, (యేసువారు ఆకాశమునకు ఎత్తుకోబడడమనేది) ధర్మశాస్త్రకోవిదులు, సువార్తీకులైనమత్తయి, మార్కు, లూకా, యోహానులలో రెండు చోట్ల మాత్రం ఉచ్చరించబడింది. ఈ రెండు రిఫరెంసులు 1952 వరకూ ప్రతి భాషలోని ప్రతి బైబిల్లోనూ ఇవ్వబడినవే (అంటే RSV పాఠ్యభాగం ఉనికిలోనికి వచ్చేముందు వరకూ) ఇవి ఇలా ఇవ్వబడ్డాయి.
4. ().  (మార్కు; 16: 19)  "ఈలాగున ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చబడి, దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడయ్యెను."  

4. (బి) (లూకా; 24: 51) “వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను."

ఇప్పుడు, ప్రక్కన ఇవ్వబడిన ఫొటో కాపీలో 4 ఎ కొటేషన్పైభాగం చూడండి. మీకు ఆశ్ఛర్యం వేయక తప్పదు. మార్కు 16: 8 వాక్యానికే అంతమైపోతుంది. తర్వాత ఒక వింతైన ఖాళీజాగా ఇవ్వబడి ఉంటుంది. ఆ తర్వాత పేజి చివరన పైన ఇవ్వకుండా పోయిన వాక్యంఅతి చిన్న అక్షరాలతో కనిపిస్తుంది. మీకు 1952 పున: పరిశీలన గావించబడ్డ RSV బైబిలు పాఠ్యభాగం దొరికితే పరిశీలించండి. ఈ విషయం

చివరి ఆరు పదాలు 4 బి (పైనవి) 'AND WAS CARRIED UP INTO HEAVEN'  (స్వర్గానికి ఆరోహణుడయ్యెను లెదా పరలోకమునకు చేర్చుకోబడెను. అన్నవి) ఒక చిన్న () చిహ్నమిచ్చి క్రింద ఫుట్నోట్గా ఇవ్వబడ్డాయి. ఏ సదాచార క్రైస్తవుడైనా ఏ బైబిల్లోని ఫుట్నోట్క్రింద ఇచ్చిన పదాలను దైవ వాక్యమని ఎంచడు. మతం మౌలిక అంశాలతో ఈ మహా అద్భుతాన్ని, జీతం తీసుకుని ప్రచారంచేసే మిషనరీలు ఎందుకో ఒక ఫుట్నోట్పడేశారు.
'THE ORIGIN AND THE GROWTH OF ENGLISH BIBLE' (ఆంగ్ల బైబిలు పుట్టుక, దాని పెరుగుదల) అనే ఛార్టులో మీరు గమనించగలరు. బైబిలు పాఠాంతరాలన్నీను (1881 లోని పున:పరిశీలన చేసి స్థిరపడిన 'RSV' బైబిలుకు ముదువి. అన్నీను) యేసు జీవిత కాలానికి 5 లేక 6 వందల సంవత్సరాల తరువాతవి. 'RSV' 1952 పున: పరిశీలకులే యేసు తరువాత 3 లేక 4 వందల మధ్య కాలపు అత్యంత ప్రాచీన ప్రతులను మొట్ట మొదటి సారిగా కనుగొన్న బైబిలు పండితులు. ఏ దస్తావేజు అయినా అసలు మూలమైన దానికి ఎంత దగ్గరి కాలం లోనిదైతే అంత ఎక్కువ ప్రామాణికతను కలిగి వుంటుందని మనం ఒప్పుకోవాలి. ప్రాచీన ప్రతులు అన్న వాటికంటే అత్యంత ప్రాచీన ప్రతులన్నవే విశ్వాస యోగ్యమైనవి. కనుకనే, 'యేసు ఆకాశానికి లేవనెత్తుకో బడ్డాడన్న సరైన పదజాలమే అత్యంత ప్రాచీన ప్రతుల్లో లభించనందువల్ల క్రైస్తవ ఫాదరీలు 'RSV' 1952  (పున: పరిశీలన చేయబడి స్థిరపడిన పాఠ్యభాగం) లోనుంచి కొట్టిపారేశారు.

గాడిద చాకిరి:
యేసు క్రీస్తు ఆరోహణను గురించి పవిత్రాత్మతో ఉత్తేజితులైన ధర్మబద్ధులైన సువా ర్తీకులు, ఒక్కపదం కూడా వ్రాయలేనన్నది క్రైస్తవ ప్రపంచంలోని ఒక వింత ఒప్పుకోలు.
అయినా, "ఆయన కార్యక్రమం అంతిమదశకు చేరుకోబోతున్నప్పుడు వారి ప్రభువు, రక్షకుడూ ఒక గాడిదపై ఎక్కి జెరూసెలేములో ప్రవేశించాడ"న్నది మాత్రం ఆ ఉత్తేజితులైన సువార్తీకులందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు.

మత్తయి; 21: 7
"ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను."
 మార్కు; 11: 7
"వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా, ఆయన దానిపై కూర్చుండెను."
లూకా; 19: 35
"తరువాత వారు యేసు వద్దకు దానిని తోలుకుని వచ్చి, ఆ గడిద పిల్లమీద తమ బట్టలు వేసి, యేసును దానిపై ఎక్కించి…"
 యోహాను; 12: 14)
"ఇదిగో నీ రాజు గాడిదపై ఆశీనుడై వచ్చుచున్నాడు"
    
సర్వేశ్వరుడైన దేవుడే బైబిలు గ్రంఢకర్త అయితే పవిత్ర నగరానికి, తన కుమారుడి గాడిద సవారిలాంటి అసంగతమైన, అల్పమైన సంఘటనను అందరూ సువార్తీకుల చేత వ్రాయించి, తన కుమారుడు దైవదూతల రెక్కలపై నెక్కి స్వర్గారోహణ చేసిన అత్యద్భుత వార్తను, తన ఉత్తేజపూరితులైన సువార్తీకుల చేత ఎలాకొట్టి వేయించాడు?
  
చాలా కాలంవరకు ఆగలేదు.
సువార్త ప్రచారకులకు, బైబిలు వ్యాపకులకు ఇందులోని అసలు మర్మం ఇంకా అంతు పట్టలేదు. తమ ప్రబోధనల్లోని 'మూల పడేసిన రాయి (CORNER STONE) గా మారిన 'యేసు ఆరోహణ' క్రైస్తవ బైబిలు 'RSV' పాఠ్యభాగం బైబిలు అమ్మకంలో 15000000 (15 మిలియన్‌) డాలర్ల లాభాన్ని గడించివేసింది. అంత విరివిగా తప్పులు ఉన్న గ్రంధం అమ్ముడు పోయిందన్నమాట! 50 విభేద వర్గ సమాజాల్లో నుంచి రెండు వర్గాల ప్రబోధకులు రచ్చారావిడీ చేయగా ప్రచురణవేత్తలు మళ్ళీ కొత్తగా కూర్పుచేసి ఆ ఉత్తేజపూరితమైన దైవ పదం 'స్వర్గారోహణ'nu తమ 1952 లోని కొత్త 'RSV' ఎడిషన్లో చేర్చడం జరిగింది.
పున: పరిశీలన, పున: పున: పరిశీలన చేసుకుంటూ పొయిన బైబిలు మూల ప్రతులు

తమ దైవ గ్రంధం, దైవ వాక్కు తమకు అందిన నాటి నుంచే దాన్ని మాటిమాటికి పున: పరిశీలన చేసి మార్చుతూపోవడం క్రస్తవులకూ, యూదులకూ పాత ఆటే! అసలు విషయాలను మసి చేసి మారేడుకాయగా నూర్చడం, మెరుగు దిద్ది బంగారమని చెప్పడం, గ్రంధానికి 'ముందుమాట' విషయార్ధానికి ఫుట్నోట్లు ఇవన్నీ ప్రాచీన దస్తావేజుదారులకు, గ్రంధకర్తలకు తెలియవు. తెలిసిఉంటే వాళ్ళు కూడా నేటి తప్పుడు దస్తావేజుదారుల్లాగానే మార్చి, ఏర్చి, కూర్చి ఏవేవో సాకులు చెప్పివుండేవారు.
కాలిన్సు బైబిలు పేజీ 6, 7 లో ఇవ్వబడిన 'ముందుమాట' లో ఇలా వుంది.,
"పెక్కు వ్యక్తులు ఎన్నో మార్పుల కోసం ఎన్నో సలహాలు కమిటీకి సమర్పించారు. రెండు వర్గాలను తప్పించి, కమిటీ అందరి సలహాల గురించి జాగ్రత్తగా శ్రద్ధ చూపడం జరిగింది".
"గ్రంధంలోని రెండు భాగాలలో పెద్దది మార్కు; 16: 9-20 తో అంతమయ్యేదిలూకాలో 24: 51, మళ్ళీ చేర్చడం జరిగింది. కూర్చడం, చేర్చడం ఎందుకు? అంతకు మునుపు కొట్టివేయబడ్డాయి గనక! మరి స్వర్గారోహణ విషయం ముందెందుకు తీసి వేయబడింది? అత్యంత ప్రాచీన ప్రతుల్లో ఆ విషయం లేదు గనుక. యొహాను మొదటి పత్రికలోని 5: 7 లో త్రిత్వం విషయంలాగా మధ్యలో చేర్చబడిన పదజాలం ఒకదాన్ని తీసివేసి, మళ్ళీ మరోదాన్ని చేర్చడమెందుకు? ఆశ్ఛర్య పడకండి! ఇదంతా మీరు చదివి RSV  ఒకటి తీసుకునే లోపల ఆ పవిత్ర కమిటీ ఆ ముందుమాట మొత్తంతీసివేసి, మరేదైనా వ్రాసివుంటే ఆశ్ఛర్య పడాల్సిన పనే లేదు.
జెహోవా విట్నెస్ క్రైస్తవ సమాజమైతే తమ ముందు మాట లోని ఒకనాటి  అతి గంభీరమైన 27 పేజీలు నేడు తొలగించివేసి యున్నది. వారి నేటి నూతన నిబంధనల పేరు NEW WORLD TRANSLATION OF THE CHRISTIAN GREEK SCRIPTURES (క్రైస్తవ గ్రీకు గ్రంధాల నూతన ప్రపంచ అనువాదం).
అత్యంత గౌరవనీయుడు Rev C.I.SCOFIELD D.D అందరూ DD లే అయిన తన 8 మంది సలహాదారుల సంగ్రహ కమిటీతో కలిసి, స్కాఫీల్డ్ రెఫరెన్సు బైబిల్లో దేవుడు అన్నదానికి హిబ్రూ పదమైన 'ఎలాహ్' (ELAH) ను సరిగా ఎలా ఉచ్చరించాలో అని అది కొంచెం ఉఛ్ఛారణ  మార్పుతో 'అలాహ్' (ALAH) అని నిరూపించాడు. ఇక క్రైస్తవులకు మాత్రం ఒక ఒంటెను మ్రింగినట్లయింది. ఏమైనప్పటికీ దేవుని పేరు హిబ్రూ మాతృకలో 'అలాహ్' అని ఒప్పుకోక తప్పలేదు. అయినా ఉఛ్ఛరించేటప్పుడు మాత్రం '' వత్తు (L) లేకుండా అతి కష్టంగా ఉఛ్ఛరించేవారు. (ప్రక్కన ఇవ్వబడ్డ ఫొటో కాపీ చూడండి. అందులో ALAH అన్న పదాన్ని రౌండప్ చేసి చూపించడం జరిగింది). గ్రంధ కర్త స్కాఫీల్డ్ ప్రజా సభల్లో ప్రబోధనలు చేసి విశ్లేషించేటప్పుడు ఆ పదానికి తగు రెఫరెంసులు చూపించేవాడుమీరు నమ్మండి! తదుపరి SCOFIELD REFERENCE BIBLE ఆదికాండంలోని ఆ 1: 1 విశ్లెషణను ప్రతిపదం, తన తదుపరి ప్రచురణల్లో అలానే వుంచి, ఒక పదం ALAH మాత్రం ఎలానో మాయం చేసేసింది. ఆ పదం వుండిన చోటి జాగా కూడా సససiససిఫేయడం జరిగింది. ఇది సదాచార క్రైస్తవుల బైబిలు గ్రంధం, ఇలాంటి ట్రిక్కుల్ని సామాన్య ప్రజలు అర్ధం చేసుకోవడం కష్టం.

నికృష్టమైన ఒప్పుకోలు

ది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ (The seventh day Adventist church) ప్రవక్తురాలు (Prophetess) అయిన శ్రీమతి ఇలెన్జి వైట్ (Mrs. ELLEN G WHITE) తన బైబిలు కామెంటరీ (విశ్లేషణ) VOL 1 పేజి 14 లో బైబిలు గ్రంధంలోని లోపభూయిష్ట స్థితిని గురించి అంగీకరిస్తుంది.
"మనం నేడు చదివే బైబిలు చాలామంది అనుకరణ దారుల చేతిపని. వారంతా చాలా సందర్భాల్లో తమ ఈ కార్యాన్ని అత్యంత మహత్తరంగా నిక్కచ్చిగానే చేశారు. అయినా, ఈ అనుకరణ దారుల పొరపాట్లు తప్పులు లేని స్థితిగలవారు కారు. కడకు దేవుడు కూడా వారిని పూర్తిగా తమ అనువాదాల్లో, వ్రాత లెఖనాఅల్లో తప్పులు చేయకుండా కాపాడలేదు. "
ఇంకాస్త ముందుకుపొయిన తర్వాత శ్రీమతి వైట్ ఇలా రాస్తుంది.
"దేవుడు బైబిలు గ్రంధాన్ని ప్రత్యేకంగా కాపాడ్డం గమనించాను." (దేని నుండి?) "కాని ఎప్పుడైతే కొన్ని సందర్భాలలో పదాలు మారాయో వాటిని ఇంక సులభపరచాలని సాదాగా వుంచాలనే ప్రయత్నంలో (అనుకరణదారులు) మరీ క్లిష్టతరం చేశారు…. సరళమైన వాటిని తమ ఆచార వ్యవహారాలతో ముందుగానే స్థిరపరుచుకున్న భావాలకనుగుణంగా మలిచి ఇంకా మర్మపూరితం చేసేశారు."

పెరిగే రోగం
మానసిక రోగమన్నది తెచ్చిపెట్టుకునేదే. ఆ రచయిత్రి, ఆమె అనుయాయులు, నేటికీ బైబిలన్నది వాస్తవంగా ఎలాంటి పొరపాటు స్థితికి లోనుకాని దైవవాక్యమని ఎలుగెత్తి అరుస్తారు.

"నిజమే అది కలుషితము చేయబడింది. అయినా అది పరిశుద్ధమైనది" అని అంటారు.  

"అది మానవ లిఖితమే కాని దైవలిఖితం" అని చెబుతారు. ఇలా వాళ్ళ పరిభాషలో పదాలకేమైన సరైన అర్దాలున్నాయా?.... ఉన్నాయి. ఎక్కడ అంటే వాళ్ళు న్యాయవిచారణ చేసే కోర్టుల్లో కాని ధర్మశాస్త్రంలో మాత్రం కాదు. ఒక కవితా ధోరణి లైసెన్సు, తమ ప్రబోధనా విషయంలో వారు కల్పించుకున్నారు. 

దీని గురించే అంతిమ దైవగ్రంధం ఖుర్'ఆను పలికింది. 

(ఖుర్'ఆన్; 2:10) "వారి హృదయాలకు రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. ఎందుకంటే వారు అసత్యవాదులు."  

సాక్ష్యం:

బైబిలు ప్రబోధకుల్లో జెహోవా విట్నెస్ సమాజం వారు చాలా విషయాలను చర్చించే సమాజం. వారి బైబిలుకు 'ముందుమాట' (ఇంతకు మునుపు ఇచ్చి వున్నాం) లో వాళ్ళ ఒప్పుకోలు కూడా ఇలా వుంది.  

'పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ పొందిన అసలు గ్రంధాలను మానవ హస్తంతో ప్రతిలేఖనం చేయడంలో మానవ బలహీనత చోటు చేసుకుంది. కాబట్టి ప్రస్తుతం ఉనికిలోవున్న వేలాది బైబిలు పాఠ్యభాగాల్లో ఏవి కూడాను అసలు (మాతృక) భాష ప్రతులకు బాగా సరైన అనుకరణలు కావు". 
అందుకే వారి బైబిలు 'ముందుమాట' లోంచి 27 పేజీలు  తీసివేయడం జరిగింది. వారిమాటల్ని అల్లాహ్ వేయించాడు.  
గుర్రపు దళాలా? పదాతి దళాలా? 

ప్రక్కన ఇవ్వబడ్డ కొటేషన్లు చూడండి. దావీదు ఎంతమంది రధికుల్ని హతమార్చాడు. ఏడువందలా? ఏడువేలా? ఇంతేకాదు అతను 40000 మంది గుర్రపు రౌతుల్ని హతమార్చాడా? లేక 40000 మంది పదాతి దళాల్నా? ఈ విభేదాల రికార్డులు 2వ సమూయేలు 10:18 కును 1వ దినవృత్తాంతములు ; 19:18కు మాత్రం పరిమితంకావు. దేవుడికి వేలకు వందలకూ వున్నా వ్యత్యాసం తెలియదు!

'గుర్రపు రౌతులకు' 'పదాతి దళాలకు' వున్నా వ్యత్యాసం కూడా తెలియదు. 

మరి ఈ రకపు 'దైవదూషణ' క్రైస్తవంలో 'ప్రేరణ'గా ఎంచబడిందా? 

దేవుడు 3 సంవత్సరాల క్షామం నిర్ణయించాడా? లేక 7 సంవత్సరాల క్షామమా? 

(2వ సమూయేలు; 24:13) "కావున గాడు దావీదు వోద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల యెదుట నిలువలేక నీవు మూడునెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా?"

(1వ దినవృత్తాంతములు; 21:11,12) "కావున గాడు దావీదు వోద్దకువచ్చి ఇట్లనెను - మూడేండ్లపాటు కరువు కలుగుట, మూడు నెలల పాటు శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు మొదట నిలువలేక నశించి పోవుట.."

మన క్రైస్తవులు నమ్మినట్టు దేవుడే బైబిల్లోని ప్రతి పదానికి, వాక్యానికి, కామాలు, పుల్స్టాపులకు గ్రంధకర్త అయితే, పైన చూపించబడ్డ లెక్కల తప్పులకు కూడా దేవుడే గ్రంధకర్త కావాలికదా?

జేహోవియచిన్ ఎన్నేళ్ళ వాడు? 8 లేక 18?  

8కి 18కి మధ్య పదేళ్ళ వ్యత్యాసముంది. దేవుడికి లెక్కలెయ్యడం చేతగాదని, 8కి 18కి మధ్య వ్యత్యాసం తెలీదని మనం అనగలమా? (పాపం క్షమించుగాక!) మనం బైబిలు దైవవాక్యమేనని అనుకుంటే, దేవాధి దేవుడి అధికారాన్ని, గొప్పదనాన్ని కించ పరచినట్లౌతుంది. 

(2వ దినవృత్తాంతములు; 36:9)  "యెహొవాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్ల వాడై యేరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరుషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నేహుష్తా అతని తల్లి."

(2వ రాజులు; 24:8) "యెహొవాకీను ఏలనారంభించినప్పుడు, ఎనిమిదేండ్ల వాడై యేరుషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచేను.

700లా? 7000వేలా?

అసలు 7000 నుండి ఒక సున్నా (0) తీసి వేయబడిందా? లేక 700 లకు ఒక సున్నా (0) కలవబడిందా అన్నది బైబిలు ప్రేమికులకు ఇబ్బందికరమైన మాటే. ఇది బైబిలు గణిత శాస్త్రాన్ని ఇంకా క్లిష్టతరం చేస్తుంది. 

(2వ సమూయేలు; 10:18) "సిరియనులు సంనిద్ధులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము చేసి ఇశ్రాయేలీయుల యెదుట నిలువజాలక పారిపోగా, దావీదు సిరియనులో ఏడు వందల మంది రధికులను, నలుబది వేలమంది గుఱ్ఱపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను."

(1వ దినవృత్తాంతములు; 19:16) "అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేక తిరిగి పారిపోయి, దావీదు సిరియనులలో ఏడువేల రధికులను, నలుబది వేల కాల్బలములను హతము చేసి, సైన్యాధిపతి అయిన పోషకును చంపి వేసెను

దేవుడు 'గుర్రపు రౌతులు'  'కాల్బలము' ల మధ్య అస్పష్టత చెందాడు
ప్రేరణ, ఉత్తేజం పొందిన బైబిలు గ్రంధకర్తలు 'కాల్బలము' 'గుర్రపు రౌతుల'లో భేదాన్ని అర్ధం చేసుకోక పోవడం 'కాల్బలానికి' గుర్రపు రౌతులకు ఉన్న భేదం దేవుడికి తెలియదనే నిందగా, ఆ ప్రేరణకు కారకుడైన దేవుడిపైనే వేయడం శోచనీయం. కొంపదీసి పారిపోయిన సిరియన్లు సెంటార్లు (గుర్రపు కాళ్ళు శరీరం వుంది మనిషి తల మనిషి చేతులూ వుండే గ్రీకుపాత్రలు) అని లెక్క కట్టాలేమో లేదా మనల్ని మోసగించే గ్రంధకర్తకు ప్రేరేపించే సహాయంగా గ్రీకు పురాణాల్లోనుంచి ఆ శక్తులు సడన్ గా దాపురించాయా? వందలకు వేలకు తేడాగాని, గుర్రపు రౌతులకు కాల్బలానికి తేడా గాని దేవుడికి తెలియకుండా పోయిందనే దైవదూషణ ప్రేరణ ఉత్తేజ రూపంలో క్రైస్తవ నిఘంటువుల్లో చోటు చేసుకుంది. 

కాస్త హొమ్ వర్క్ ఉంది చూడండి
తన గొప్ప కోసం సోలోమోను రాజు ఓ రాచమందిర నిర్మాణం చేపట్టాడు. అది పూర్తయ్యేందుకు దాదాపు పదమూడేళ్ళు పట్టింది. ఇది మనకు 1 రాజులు 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇంతకూ మునుపు ఓసారి మనం డాక్టర్ పార్కర్ చెప్పివున్న గొప్పల్ని చూశాం. 

అన్ని పేజీలు  అనామకమైన పేర్లతో నిండి ఉన్నాయా అని ఈ 7వ అధ్యాయం, ఎహేజ్కేలులోని 45 అధ్యాయం పిల్లతనానికి మచ్చు తునకలు. అందరూ తమ జీవితంలో కనీసం ఓసారి చదివి తీరాల్సిందే. 

దాని తర్వాత మీరు పవిత్ర ఖుర్'ఆన్ ను కూడా చదివి పోల్చిచూడ గలరు. మీరు ముస్లిములై ఉండి, మీ దగ్గర అలాంటి బైబిలు ఒకటి లేనిచో మీరు ఇక్కడ ఇవ్వబడ్డ చిరునామాకు వ్రాస్తే మీకు ఉచితంగా ఓ బైబిలు పంపబడుతుంది. 

JESUS TO MUSLIMS (ముస్లిములకు యేసు) 

4బి, బ్రైట్ స్ట్రీట్, బెనొని 1500, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, (ఇది ప్రత్యేకంగా ముస్లిములకే ఉచితంగా ఇవ్వబడేది) 

ఈ పుస్తకం చదువుతూ నేనిచ్చిన రెఫరెన్సులు మీరు గంగు పెన్సిళ్ళతో ఆ బైబిల్లో గృతు పెట్టుకుంటూ పోగలరు. ఉదాహరణకు బైబిల్లోని విభేదాలకు "పసుపురంగు" మనం అంగీకరించదగ్గ, జ్ఞానమిచ్చే కొటేషన్లు (మనం ముందు ఇచ్చి ఉన్నాం) దేవుడి వాక్యాలని దేవుని ప్రవక్త వాక్యాలని అనిపించేవాటికి 'పచ్చరంగు' ఇలా మీరు రంగులతో గుర్తు పెట్టిన బైబిలు మీ సంతానానికి వారసత్వంగా ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో భేటీ చేయబోయే క్రైస్తవ ప్రచారకుల్తో సంవాదం జరిపేందుకు ఉపయోగపడతాయి. 

"శాంతి కాలంలో మనం చెమట ఎక్కువగా కక్క గల్గితే యుద్ధ కాలంలో రక్తం కారడం తగ్గుతుంది." (చియాంగ్ కై షేక్) 

ఎంతవరకు సమంజసం
 
మరోటి చూడండి . 1 రాజులు గ్రంధకర్త 7.26 లో సోలోమోను రాజమందిరంలో 2000 స్నానపు గదులు కట్టించాడని లెక్క గట్టి చెప్పాడు. కాని 2వ దిన వృత్తాంతములు; గ్రంధకర్త అయితే 4:5లో 50% ఎక్కువ చేసి 3000 స్నానపు గదులని ఖచ్చితంగా చెప్పాడు. 'దైవవాక్యమనిపించుకున్న ఈ గ్రంధంలో ఇలాంటి అతిగాని తప్పుగాని ఏమిటి? మహా మహితాత్ముడైన దేవుడు ఇలాంటి పని చేయకుండా వున్నా ఇంట నీచంగా విభేదాన్ని యూదులకు 'ఉత్తేజం' చేసివుంటాడా? బైబిలు దేవుని గ్రంథమా? దేవుని వాక్యమేనా అన్న ప్రశ్న ఉద్భవించక మానదు కదా? 

కుప్పలు కుప్పలుగా అనంగాతాలు, స్వవిరుద్ధాలు 
ఈ లెక్కకు మిక్కుటమైన అసంగాతాలను, విరుద్ధాలను ముగింపుకు తెచ్చేముందు ఒక ఉదాహరణ ఇవ్వదలిచాను. ఈ విభేదాలు వందలకు వందలున్నాయి. మళ్ళీ ఓసారి సోలోమానును చూడండి. ఆయన అన్నీను చాలా పెద్ద తరహాలోనే చేస్తాడు. గత ఇరానుషా కూడా ఈయన ముందు బలాదూర్. 

2వ దినవృత్తాంతముల గ్రంధ కర్త 9:25లో ఓ వేయి గుర్రపు శాలలు, స్నానపుతొట్లు ఎక్కువగానే ఇచ్చాడు. "మరియు సోలోమోను నాలుగువేల గుర్రపుశాలలు కలిగి" అని. కాని 1వ రాజుల గ్రంధకర్త మాత్రం 4:26 లో నిజమైన రాజరికపు అట్టహాసపు ఊహతో పని చేసి తనరాజుకు 1000% శాలలు హెచ్చుగా ఇచ్చేశాడు. 4000 శాలల నుండి 40000 గుర్రపు శాలలు? మీ దగ్గరికి బాగా వాగే ప్రచారకుడైన వచ్చి "అదే ముంది కొన్ని సున్నాలే (0) పెద్ద పొరపాటేం కాదుకదా? ఎవరో రాసేవాడు. ఓ సున్నా లేదా రెండు ఎక్కువగా పడేసి ఉంటాడు.' అని అనకముందే, మీరు తెలుసుకోవాల్సి ఉన్నదేమిటంటే సోలోమోను రాజు కాలంలో యూదులకు సున్నా (ZERO) గురించి ఏమీ తెలియదు. ఆ సున్నాని అరబ్బులే తూర్పు మధ్య ప్రపంచానికి అందించిన తర్వాత శతాబ్దాల తరువాత యూరపు దేశాలకది తెలిసింది. యూరపు తమ అంకెలను పదాలలో పలికేవారు. వాటిని అంకెలుగా వ్రాసేవారు కాదు. 
మా ప్రశ్న ఏమంటే ఈ అత్యంత విచిత్రమైన పరస్పర విరుద్దాలైన 36000 ల తప్పులకు అసలు గ్రంధకర్త ఎవరు అన్నది? దేవుడా? మనిషా? మరి అది తెలుసుకోవాలంటే" "బైబిలు దైవవాక్యమా? లేదా మానవ వాక్యమా" చదవాలి.

ఆ పుస్తకాన్ని క్రింది చిరునామాకు వ్రాసి తెప్పించుకోగలరు.

ISLAMIC MISSIONARY SOCIETY, 
A.E.L. BUILDING, 78 MINT ROAD, 
FORDS BURG, 
REPUBLIC OF SOUTH AFRICA 

హేతుబద్ధమైన అత్యంత బహిరంగ నిదర్శనం  

క్రైస్తవ ప్రబోధకులు బైబిలు దైవవాక్యమని నిదర్శనంగా క్రింది వాక్యానిచ్చి అతిప్రేమగా కోట్ చేస్తుంటారు. 

(2 తిమోతి 3:16) (AV by SCOFIELD)

(ALL SCRIPTURE IS GIVEN BY INSPIRATION OF GOD, AND IS PROFITABLE FOR DOCTRINE, FOR REPROOF, FOR CORRECTION, FOR INSTRUCTION IN RIGHTEOUSNESS)

ఇందులో ఇంగ్లీషులో IS అన్నది పెద్దక్షరాల్లో ఇవ్వబడింది. అంటే రెవరెండ్ స్కాఫీల్డు మనకు మెల్లగా ఇది అసలు గ్రీకు బైబిల్లో లేదనే తెలుపుతున్నాడు. కాని కొత్త ఆంగ్ల బైబిలు THE NEW ENGLISH BIBLE చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్, ది ప్రెస్ బిటేరియన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇతరత్రా వారంతా కలిసి వ్రాసిన కమిటీ అనువదించిన ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ మరియు బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ వారు కలిసి అసలైన గ్రీకు నుంచి, అతి దగ్గరి అనువాదం చేసిన బైబిల్లో ఇలా వుంది.

"EVERY INSPIRED SCRIPTURE HAS ITS USE FOR TEACHING THE TRUTH AND REFUTING ERROR OR FOR REFORMATION OF MANNERS AND DISCIPLINE IN RIGHT LLIVING" 

(2 తిమోతి; 3:16) దీని అర్ధం- "ఉత్ప్రేరితమైన (ప్రేరేరింపబడిన) ప్రతి గ్రంధం సత్యమును ఉపదేశించుటకు, తప్పును దిద్దుటకు లేదా సచ్చీల శిక్షణకు, నడవడిక మార్పులు చేయుటకును ఉపయోగము కలది." 
ప్రొటేస్తెంటుల ఆధరైజ్డ్ వెర్షెన్ (AV) కంటే రోమన్క్యాథలిక్కుల డోవే  (DOVAY) వెర్షన్ కాస్త న్యాయ సమ్మతంగా వుంది. వాళ్ళంటారు:


"సర్వ గ్రంధం దైవ ప్రేరితం. అది ఉపదేశించుటకు, దిద్దుబాటుకు, చక్కదిద్దుటకు చాలా ప్రయోజనకారి. 

మనం పదాలతో ఆటలాడుకోవాల్సిన అవసరం లేదు. మనం క్రైస్తవులమైనగాని, ముస్లిములైనాగాని దేవుడి నుంచి వచ్చిన దేదైనా అది ప్రేరణగా మనకి అది ముఖ్యంగా నాలుగు రకాలుగా ప్రయోజనానికి సంబంధితమై యుండాలి.  
(నాలుగు సూత్రాలు తిమోతి ప్రకారం) (నాలుగు ప్రమాణాలు) 


1. DOCTRINE సరైన సిద్ధాంతాలను ఉపదేశించాలి.

2. (REPROVE) తప్పు జరిగితే ఖండించేదిగా వుండాలి.

3. (CORRECTION) సరిదిద్దే మార్గాన్ని ఇవాలి.

4. (RIGHTEOUSNESS) నైతికతకు, సచ్చీలతకు మార్గదర్శి కావాలి.



పై నాల్గింటికి తోడూ మరో ఐదవ మేకును దైవవాక్య పరిశీలనకు తోడై ఉండేందుకు తగిలించగలరా అని నేను గత నలభై సంవత్సరాలుగా క్రైస్తవ విజ్ఞులందరినీ అడుగుతూనే వస్తున్నాను. వాళ్ళు అలాంటిదేదీ ఇవ్వలేక పోతున్నారు.
వాళ్ళు చేసిన పరిశోధనలపై నేను మెరుగులు దిద్దటం లేదు. సరే, ఆ పైనాలుగు బాహ్య నిరూపణ సాక్ష్యాల విధానంతోనే మనం పరిశుద్ధ గ్రంధాన్ని కాస్త పరిశీలిద్దాం. 

ఏంతో దూరం పోనక్కరలేదు

బైబిలు గ్రంధంలోని మొదటి గ్రంధమైన 'ఆదికాండమేమనకు చక్కటి నిదర్శనాలెన్నింటినో సమకూరుస్తుంది. అందులో 38వ అధ్యాయం తీసి చదవండి. జూడియా (యూదా)జుడాయిజమ్ (యూదమతం) అనే పదజాలం యూదసంతతి తండ్రి అయిన జూడా (యూదా) ఇచ్చిన చరిత్ర మనకిక్కడ లభ్యమవుతుంది.  ఈ యూద పితామహుడు వివాహం చేసుకున్న తరువాత దేవుడు అతనికి 'ఏరు' 'ఓనాను' 'షెలాహఅనే ముగ్గురు కుమారుల్ని ఇచ్చాడు. మొట్టమొదటి పుత్రుడు పెరిగి పెద్దవాడైన తర్వాత యూదా అతన్ని 'తామారుఅనే స్త్రీతో వివాహం జరిపించాడు.
(ఆదికాండం38: 7)  "యూదా జ్యేష్ట కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను"
ఈ విచార సంఘటనను పైన ఇవ్వబడిన తిమోతి యొక్క నాలుగు సూత్రాలలో దేనితో అన్వయింపజేయగలరు.? 
బహుశా రెండవది కావచ్చు. తప్పు చేస్తే ఖంధించడం REPROVE తో ఏరు చెడ్డవాడు గనుక దేవుడు అతనిని చంపెను. ఇక్కడ అందరికీ ఇవ్వబడ్డ నీతి ఏమంటే మనం చెడ్డతనం చేస్తే దేవుడిచేత చంపబడతాము. (REPROOF) 
యూదా చరిత్రను చూస్తె వారి ఆచారం ప్రకారం ఒక సోదరుడు పిల్లలు లేకుండా చనిపోతే అతని రెండవ సోదరుడు చనిపోయిన వాని వంశావళిని కొనసాగించేందుకు తన వదినకు తన 'బీజాన్ని' (రేతస్సును) ఇవ్వాలి. కాబట్టి యూదా తమ మతాచారాన్ని గౌరవిస్తు తన రెండవ కుమారుడైన ఓనానుకు ఆ విధవ (తామారు) నిచ్చి ఆ విధి నిర్వహించాడు. కాని అతని (ఓనాను) హృదయంలో ఈర్ష్య పొడసూపింది. తన బీజాన్ని ఇవ్వగా తన సోదరుడి పేరెందుకు కొనసాగాలి. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు 'ఓనాను' ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము గలగ చేయకుండునట్లు "తన రేతస్సును (ఇంద్రియాన్ని) నేలపై విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను." (ఆది;38:9-10) మళ్ళీ చూడండి. ఈ చంపటమన్నది తిమోతి ఇచ్చిన పైనాలుగు సూత్రాలలో దేనితో అన్వయింపబడుతుంది. రెండవ దానితో 'ఖండించడం' (REPROOF) తో అనే సమాధానం. మీరు ఈ సమాధానాలు అతి సులువుగా చెప్పినా మీకెలాంటి బహుమతులూ ఇవ్వబడవు. ఇవి మౌలికమైన విషయాలు. తప్పు చేస్తే పర్యవసానం అనుభవించక తప్పదు. 'ఓనాను' ఇక దైవగ్రందంలో తరువాత మరచి పోబడ్డాడేమో కాని మన క్రైస్తవ లైంగిక శాస్త్రవేత్తలు (sexologists) మాత్రం అతని ఆ కార్యానికి 'ఒనానిజమ్' అని పేరు పెట్టి ఆ పనిని శాస్త్రపరమైన భాషలో 'కాయిటస్ ఇంటర్రప్టస్ (COITUS INTERRUPTOS) అని తమ సెక్సు నిఘంటువుల్లో అతన్ని అమరుణ్ణి చేశారు. 

ఇప్పుడు యూదా తన కోడలైన తామారును తన మూడవ కుమారుడైన షెలాహ్, ఎదిగి పెద్దవాడయ్యేంత వరకు, ఆమె తండ్రి ఇంటికి పోయివుండమని పంపించి వేశాడు. ఆమె తిరిగి వచ్చిన తదుపరి తన మూడవ కుమారిడితో తన విధి నిర్వహణ పూర్తి చేయాలని భావించాడు. 

స్త్రీ ప్రతీకారం 

షెలాహ్ ఎదిగి బహుశా మరో స్త్రీతో వివాహం చేసుకుంటాడు. కాని తామారును చేయవలసిన తన విధిని యూదా పూర్తిచేయలేదు. ఈ మంత్రగత్తె వల్ల తాను ఇప్పటికే ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకునానని అతను అంతరంగంలో బాగా భయపడి పోయివుంటాడు. 

"అప్పుడు యూదా - ఇతడు (షెలాహ్) కూడా తన అన్నలవలె చనిపోవునేమో అనుకునెను. (ఆదికాండము; 38:11) అలా యూదా తన వాగ్దానాన్ని వదిలివేశాడు. కాని వ్యధ చెందిన ఆ యువతి తామారు మాత్రం తనకు రావలసిన ఆ 'బీజం'ను ఆపేసిన మామపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. యూదా తన గొర్రెల్ని మేపుకునేందుకు తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారు తెలుసుకుంటుంది. అతన్ని దారిలోనే కలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అతని రాకకంటే ముందుగానే వెళ్లి తిమ్నాతు మార్గంలో యయలు ప్రదేశంలో కూర్చుని వుంటుంది. ఆమె ముఖంపై ముసుగు కప్పుకుని కూర్చుని వుంటే ఆమెను యూదా చూసి ఆమె ఒక వేశ్య (పడుపు కత్తె) గామోనని అనుకుంటాడు. దగ్గరకెళ్ళి తన లైంగిక వాంఛను వెలిబుచ్చుతాడు. 

"ఆమె తన కోడలని తెలీక నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె - నీవు నాతొ వచ్చిన యెడల నాకేమి ఇచ్చెదవని అడిగెను." తను వెళ్లి ఓ గొర్రెపిల్లను ఇచ్చి పంపుతానని అతడు మాట ఇస్తాడు. అతను పంపుతాడని గ్యారంటీ ఏమిటి? 

సరే దానికై ఏం కుదువ పెట్టాలని అతనడగ్గా అతని ముద్రయు, దాని దారమును, అతని చేతి కర్రను కుదువకై అడుగుతుంది. ఆ పెద్దాయన అవన్నీ ఆమెకిచ్చేస్తాడు. 

"అతను వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి యాయెను." (ఆది; 38:16-18) 

మరి దీని నీతి ఏమిటి?

దైవప్రేరిత గ్రంధం తిమోతీ గొప్పదనాన్ని గురించి విని 3:16 వాక్యాన్ని చదివి పైన ఇవ్వబడ్డ నాలుగు ప్రమాణాలు చూడగా ఈ గాధ ఏ సూత్రానికి సరిపడుతుందనే ప్రశ్న మీకైనా నాకైనా ఉద్భవిస్తుంది. దీని నీతి ఏమిటని? తామారు తీసుకున్న ఈ తీయని ప్రతీకారం వాళ్ళ మన పిల్లలు నేర్చుకోవలసిన నీతి ఏమిటన్నది? మనం మన పిల్లలకు ఎన్నో కధలు వినిపిస్తాం. అవన్నీ వాళ్ళ ఆహ్లాదానికే కాకుండా వాళ్లకు కొంత నీతిని కూడా ఇవ్వాలనే మనం "నక్క ద్రాక్ష పండ్లు", "తోడేలు గొర్రె పిల్ల", "కుక్క దాని నీడ" లాంటి కధలు వినిపిస్తాం. ఎంత పిచ్చి కధైనా దాని వెనుక ఏదో ఒక నీతి వుంటుంది కదా?

క్రైస్తవ తల్లి దండ్రుల ఇబ్బంది 

డాక్టర్ వెర్నాన్ జోన్స్ (Dr. VERNAN JONES) అనే ప్రఖ్యాత అమెరికన్ మనస్తత్వ శాస్త్రవేత్త (PSYCHOLOGIST) స్కూలు పిల్లల మీద కొన్ని కథల ప్రభావం ఎలావుంటుందో అన్న పరిశోధనలు జరిపాడు. అందరికి వినిపించే ఆ కథల్లో హీరోలు అంటా ఒక్కటే అయినా వివిధ పిల్లల గ్రూపులో వివిధరకాలుగా ప్రవర్తించేవారై వుంటారు. ఉదాహరణకు ఒక గ్రూపు కథలో సెయింట్ జార్జ్ డ్రాగన్ ను నరికి చంపివేసే ఓ మహా వీరుడిగా చెప్పబడితే మరో గ్రూపు పిల్లలకు అతను భయపడి పారిపోయి అమ్మ ఒళ్లో దాక్కొనే పిరికిపందగా వర్ణించబడ్డాడు. 

"ఈ కథలు కొంచెం అల్పమైనవని అనిపించినా పిల్లల నడవడికల్లో నిర్ణాయకమైన మార్పుల్ని తెచ్చాయి. (చిన్న క్లాసుల్లో సైతం) అని డా. జోన్స్ మనం మన దినపత్రికల్ని చూస్తె, పవిత్ర బైబిలు గ్రంథంలోని హత్యలు, రేపులు, వావివరుస తప్పిన వ్యభిచారాలు, జంతురతులు క్రస్తవ పిల్లలపై ఎలాంటి శాశ్వత విధ్వంసాన్ని కల్గిస్తున్నాయన్నవి లెక్కగట్టగలం. మరి పాశ్చాత్య నైతికతకు మూలం అలాంటి దైతే, నేడు మెథడిస్టు క్రైస్తవులు, రోమన్ కాథలిక్కులు, "స్వలింగ సంపర్కుల" మధ్య వివాహాన్ని తమ దైవ గృహాలలో (చర్చీల్లొ) గంభీరంగా, గౌరవంగా జరిపించడం వింతేమీకాదు. 

"మరి 8000 మంది 'గేస్' (GAYS) (స్వలింగ సంపర్కులకిచ్చిన మృదు పదం ఇది) తమ వేర్సుతో (WARES) లండన్ హైడ్ పార్కులో 1979 జులైలో పెరేడు చేశారు" అనే వార్తలు మనకు TV చానల్స్ ద్వారా అందించబడ్డాయి. 

మీరు ఆ పవిత్ర బైబిలు గ్రంథం తెచ్చి ఆదికాండంలోని  38వ అధ్యాయం పూర్తిగా చదివి అందులోని శృంగార పూరిత పదాలను, వాక్యాలను 'ఎరుపు' రంగుతో గుర్తించండి. మనం ఎక్కడికి చేరివున్నాం? మన నీతి పాఠంలోని 18వ వాక్యానికి చేరివున్నాం. అదే, "ఆమె అతనితో (మామతో) గర్భవతి యాయెను." 

దాగని నిజం  

తరువాతేం జరిగిందంటే, మూడు మాసాల తర్వాత, తన కోడలైన తామారు వేశ్యగా ప్రవర్తించిందని.... 

(ఆది కాండము; 38:24,25) "మూడు నెలలైన తర్వాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను, అంతేగాక ఆమె జారత్వమున గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చి వేయవలెను అని చెప్పెను."

యూదా ఆమెను ఓ 'మంత్రగత్తె' లెక్కన ఎంచి అత్యంత శాడిస్ట్ గా ఆమెను కాల్చ నిర్ణయించాడు. కాని ఆ జిత్తులమారి స్త్రీ ఆ ముసలాయన కంటే రెండాకులు ఎక్కువే చదివింది. ఆమె ఆ 'ముద్రను' 'దారాన్ని' 'చేతికర్రను' ఓ పనివాడికిచ్చి తన గర్భానికి కారకుడైన నేరస్తుణ్ణి పట్టుకొమ్మని తన మామకు కబురు పంపింది. ఇప్పుడు యూదా ఇరకాటంలో పడ్డాడు. 

(ఆదికాండము; 38:26) "తర్వాత ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి యూదా మరి ఎప్పుడును ఆమెను చూడలేదు." 

మరి ఈ సంఘటనను బైబిలు పలురకాల ప్రచురణలు పలురకాలుగా రాస్తాయి. మార్పులు సహజం. కాని జెహోవా విట్నెస్స్ క్రైస్తవ సమాజం తమ NEW WORLD TRANSLATINON (ప్రపంచ కొత్త అనువాదం) బైబిల్లో ఈ వాక్యాన్ని ఉన్నది వున్నట్లుగా ఇలా వ్రాశారు. 

"ఆయన ఆమెతో తదుపరి మళ్ళీ సంభోగం చేయలేదు."* మనం తామారును గురించి దైవ వాక్యం బైబిల్లో విన్నది ఇంతవరకే. అయినా సువార్తల గ్రంథకర్తలు ఆమెని "ప్రభువు వంశావళి" లో మాత్రం అమరురాల్ని చేశారు. 

వావి వరుస లేని వ్యభిచారం (INCEST) గౌరవ ప్రదానం 

నేనింకా ఈ విషయంలో మిమ్మల్ని బోర్ కొట్టించ దలచలేదు. అయినా ఆదికాండంలోని 38వ అధ్యాయంలోని అంతిమ వాక్యాలు తామారు గర్భం లోని శిశువుల పోటాపోటీ గురించినవి తెలపాలి. ఎవరు ముందు గర్భంలోంచి బయట పడాలన్న విషయం గురించి. 'ప్రథమ సంతానం' విషయంలో యూదులు కడుజాగ్రత్త వహిస్తారు. తండ్రి స్థానంలో ప్రథమ సంతానానికి ఆస్థిలో పెద్దవాటా. మరి తామారు గర్భంలోని ఈ పోటీలో ఎవరు నెగ్గి ముందుకొస్తారు? ఈ ప్రత్యెక పోటికి సంబంధించి మనకు నాలుగు పేర్లు చాలా ముఖ్యమైనవి. అవి యూదా ద్వారా తామారు యొక్క ఫారేజు  మరియు జారా. ఈ నాలుగు ఎలా ముఖ్యమన్నది ఇప్పుడే చూద్దాం. కాని ముందు నీతి ఏమిటి అన్నది చూడాలిగా? పై గాథలోని నీతి ఏమిటి? తమ పలు చెడు కార్యాలకు ఏరును, ఓనానును దేవుడెలా సిక్షించాడో మీరు చూశారు. ఆ ఇద్దరి విషయంలో రెండవ ప్రామాణిక సూత్రం ఖండన (REPROOF) వర్తిస్తుంది. కాని వావీవరుసలను అతిక్రమించి యూదా, తామారు చేసిన ఈ అశ్లీల అక్రమ సంబంధాన్ని మన తిమోతి ఇచ్చిన నైతిక ప్రామాణిక సూత్రాలలో దేనిలో వుంచుతారు? పైగా తదుపరి ఉద్భవించిన ఆ అక్రమ సంతానాన్ని, తద్వారా పెరిగిన అక్రమ వంశావళిని ఏ ప్రామాణికలో వుంచుతారు? అయినా పైన అండర్ లైన్ చేసిన పాత్రలు అశ్లీలతలతో కూడుకొని వున్నప్పటికీ దైవ వాక్యమైన గ్రంథంలో గౌరవ ప్రదమైన పాత్రలు, వీరంతా 'దేవుని ఒక్కగానొక్క కన్నా కుమారుడికి' మహనీయులైన తాతలు, అమ్మమ్మలు! 

ఓసారి మత్తయి; 1:3 చూడండి: ఆంగ్లంలోని, పాత నిబంధనలలోని ఆది కాండంలోని, 38వ అధ్యాయంలోని ఆ పాత్రల ఉచ్చారణలు (Spellings) నూతన నిబంధనలలోని మత్తయి; 1వ అధ్యాయంలో కొంచెం మార్చబడ్డాయి. పాత నిబంధనల్లోని PHAREZ ను PARES గా, ZARAH ను ZARA గా TAMAR ను THAMAR గా. ఏది ఏమైనా మనకు లభించే నీతి ఏమిటి? ఈ అక్రమ సంబంధ నేరాన్ని చేసిన యూదాను, దేవుడు ఆశీస్సులతో సత్కరించాడే? కాబట్టి మేరు 'ఏరు'లా చెడు చేస్తే, దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు. మీరు మీ రేతస్సును ఓనాన్ లా పారేస్తే దేవుడు చంపేస్తాడు, కాని కోడలైన తామారు పగతో, మోసంతో తన మామతో వ్యభిచరించి, ఆయన రేతస్సును సంపాదించి గర్భవతి అయితే ఆమెకు అభినందనలు! అప్పుడు, ఈ దైవ వాక్యమైన గ్రంథంలో ఇచ్చిన ఈ గౌరవ ప్రదానాన్ని మీరు ఏ ప్రమాణంలో వుంచుతారు? 

  1. సిద్ధాంతీకరణ లోనా?
  2. ఖండన లోనా? 
  3. దిద్దుబాటు లోనా?
  4. మంచివైపుకు మరలించిన మార్గం లోనా?
మీ ఇంటికొచ్చి మీ తలుపుతట్టి మీకు బోధ చేయాలని వచ్చే మిషనరీలను ప్రశ్నించండి. వారు సరిఅయిన జవాబు చెబితే సరైన ప్రామాణికాల్లో ఈ నీతి బాహ్యమైన అశ్లీలతకు ఎలాంటి తావులేదు. దీన్ని మనం ఐదవ ప్రామాణికగా 'ౠతువ్రాత' (PORNOGRAPHY) లో పెట్టాలి. 

ఈ పుస్తకాన్ని నిషేధించండి 

"భూమి మీద (ప్రపంచంలో) ఇది అత్యంత ప్రమాదకరమైన పుస్తకం. దీన్ని తాళం వేసి మూసిపెట్టండి. అని మహా మేధావి మహా రచయిత అయిన జార్జి బెర్నార్డ్ షా అనేశాడు. దీనిని మన పిల్లలకు దూరంగా పెట్టండని. కాని అతని మాటల్ని ఎవరు లెక్కచెస్తారు? అతను 'రెండవ జన్మ' (BORN AGAIN) ఎత్తిన క్రైస్తవుడు కాదు కదా? 

అత్యంత నైతిక నిశ్చయ విలువల్ని పాటిస్తూ దక్షిణ ఆఫ్రికాలోని క్రైస్తవ పాలకులు "లేడీ చాటార్లీన్ లవర్" అనే నవలను ఒక్క నాలుగక్షరాల బూతుపదం అందులో వుండిందని, బహిష్కరించి వేశారు. మరి ఈ పవిత్ర బైబిలు గ్రంథమన్నది క్రైస్తవులది గాక ఏ హిందూ మాట గ్రంథమైనా లేదా ముస్లిం మాట గ్రంథమైనా అయ్యుంటే అలానే తప్పక బహిష్కరించేసేవారు. కాని అది వాళ్ళ పరిశుద్ధ గంధం. వారి 'రక్షణ' (మోక్షం) దానిపై ఆధారపడి వుంది కావున నిస్సహాయులయ్యారు. 

"బైబిలు గాధల్ని పిల్లలకు వినిపిస్తే పలువిధాలుగా సెక్సు నీతిని గురించి మాట్లాడే మార్గాలు తెరవబడ్డాయి. శుభ్రపరచబడని బైబిలుకు కొని సేన్సారుల ద్వారా X రేటింగ్ (X-RATING) ఇవ్వాల్సి వుంటుంది. (ది ప్లెయిన్ ట్రూత్ అక్టోబర్ 1977) 

తండ్రిచే చెరిచే కూతుళ్ళు 
ఆదికాండం; 19:30 చదవండి: మళ్ళీ ఈ గౌరవ ప్రతిష్టలను ప్రసాదించే మాటల్ని 'ఎర్ర' రంగుతో గుర్తుపెట్టండి. ఎలాంటి శంక అక్కర్లేదు. మీరు రంగులతో మార్కు చేసిన బైబిలు మీ పిల్లలకు ఓ మంచి ఆస్తిగా సంక్రమిస్తుంది. షా చెప్పినట్లు తాళం పెట్టమనడాన్ని నేనంగీకరిస్తాను. అయినా మన క్రైస్తవ సోదరులతో చేసే సంవాదంలో అది వాడక తప్పదే. ఇస్లామీయ ప్రవక్త 'యుద్ధాన్ని' ఓ 'ఎత్తుగడ' (STRATEGY) అన్నారు. ఎత్తుగడల్లో మన శత్రువుల ఆయుధాలనే మనం వాడటం అవసరం. అక్కడ మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం ఉండరాదు. ఆ 'ఒక్క పుస్తకం పండితులు' "బైబిలు ఇలా చెప్పింది" అంటూ మన తలుపుల్ని తడుతూ వున్నప్పుడు మనం మరి దాన్నే వాడక తప్పదు గదా? మన పవిత్ర ఖుర్ఆనును తీసివేసి వారి పవిత్ర బైబిలుని మనకందించాలన్నది వారి ప్లాను. వారికి కనిపించకుండా పోయిన తప్పుల్ని మనమైనా వారికి చూపించాలి కదా? ఒక్కోసారి వాళ్ళు దాన్ని మొట్ట మొదటిసారిగా చూసినట్లు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తారు కూడా! పైగా తమ ప్రబోధనలకు సరిఐన వాక్యాలతో సంసిద్ధులై వుంటారు సుమా! 

చరిత్రను ఇంకాస్త సాగదీసి చూడండి - ఆ గ్రంతంలోనే వుంది. ప్రతి రాత్రి (NIGHT AFTER NIGHT) లోతు కుమార్తెలు బాగా తాగిన తమ తండ్రితో తమ తండ్రి రేతస్సును పొందాలనే పవిత్ర ఉద్దేశంతో చెరచడం మనం వింటున్నాం. ఈ పవిత్ర గ్రంథంలో ఈ 'రేతస్సు' (బీజం, SEED) చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని వుంది. ఈ చిన్న గ్రంథం 'ఆదికాండం' లోనే 47మార్లు ఈ 'బీజం' రేతస్సు ప్రస్తావన వచ్చింది. ఇలాంటి అక్రమ, వావివరుసలను అతిక్రమించిన వ్యభిచారం ఇశ్రాయేలీయుల దేవుడి ప్రత్యెక ప్రేమను పొందిన "అమ్మోనైదులు" "ముఅబైటుల" విషయంలో వస్తుంది. తదుపరి ఆ ప్రేమపూరితమైన దేవుడే ఫైలిస్తీనేయుల స్త్రీలను, పురుషుల్ని కడకు పిల్లల్ని కూడా అతిదారుణంగా చంపివేసేందుకు యూదులకు ఆజ్ఞ ఇవ్వడం కూడా మనం చూస్తాం. కడకు పశువులూ వృక్షాలు సైతం నరక బడ్డాయి. కాని అమ్మోనీయులకు ఎలాంటి బాధను, ఇబ్బందిని కలుగచేయరాదు. ఎందుకంటే వాళ్ళు లోతుసాంతానం (ఆయన బీజం) కదా! (ద్వితియోప దేశ కాండం; 2:19). తల్లితోగాని, చెల్లితో గాని, కూతురితో గాని కడకు వివాహానికై ప్రధానమైన స్త్రీతోగాని లోటు చేసే అక్రమ సంబంధాన్ని ఏ పాఠకుడు కూడా జీర్ణించు కోజాలడు. అభినందనలంటారా అవి వేరే. ఇలాంటి మతి స్థిమితం దెబ్బతిన్న వారికే అవి అవసరం. 

అంటే కాదు ఈసారి యేహెజ్కేలు; 23 చదివి దానిని కూడా 'ఎర్ర' రంగుతో మార్కు చేయండి. అందులో ఇద్దరు అప్పజేల్లెళ్ళ వ్యభిచారం, ఆహాలాబు, అహొలిబాహ్ వ్యబిచారం (అక్రమ సంబంధము, వావివరుస దాటిన అక్రమ సంబంధము) గురించి మీకు తెలుస్తుంది. ఇందులోని సెక్సు విశేషాలు నిషేధించబడ్డ సెక్సు పుస్కాలను సైతం సిగ్గుపడేలా చేస్తాయి . మరి ఈ ఆశ్లీలతను (తిమోతి మనకిచ్చిన నాలుగు ప్రమాణికల్లో) ఏ ప్రమాణంలో పెట్టాలో మీదగ్గరికోచ్చే క్రైస్తవ ప్రబోధకుల్ని అడిగి తెలుసుకోండి. ఏ 'దైవ వాక్యం' లోనూ అలాంటి అసహ్యాలకు తావు ఉండరాదు.  

యేసు వంశావళి 

తమ ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు (అలైహిస్సలాం) కు నూతన నిబంధనల్లో క్రైస్తవ ఫాదరీలు, ఎంతటి హేయమైన అక్రమ సంబంధాల వంశావళిని అంటగట్టారో మీరు చూడగలరు. వాస్తవానికి ఆయన ఎలాంటి వంస పరమపర లేని మహాత్ముడు. అయినా ఆయనకు ఒ వంశావళి ఉత్పత్తి చేశారు. అదీ ఎలాంటి వంశావళి? ఆరుగురు వ్యభిచారుల, వావివరుసలు తప్పి వ్యభిచరించిన వారి సంతానపు వంశాన్ని అంటగట్టారు. వాళ్ళంతా ఎలాంటి స్త్రీలు, పురుషులంటే యూదుల మోషే ధర్మశాస్త్రం ప్రకారం, రాళ్ళతో కొట్టి చంపబడవలసిన వారు. అంతటి పాపాత్ములన్న మాట! తరాలపాటు బహిష్కరించబడి తీసివేయబడవలసిన వారు. 

తుచ్చమైన పూర్వికులు 

దేవుడు తన కుమారుడగు యేసు (అ.స) కు ఒక తండ్రి (యేసేపు) ను ఎందుకిచ్చాడు? ఎందుకంత తుచ్చమైన వంశావళినిచ్చాడు? ఒక విపరీతమతి ఇలా అంటాడు; 

"అసలు అందమంతా ఇక్కడే వుంది! దేవుడు పాపుల్ని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుడికి అలాంటి వంశావళిని ఇచ్చేందుకు ఎలాంటి ఉపేక్ష చేయలేదు." 


  • "కుండుడు యెహోవా సమాజములో చేరగూడదు. వానికి పదియ వతరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు" (ద్వితి; 23:2) ఇది అతి సూక్ష్మమైన సాక్ష్యం. మ్రింగుడు పడదు గదా? 

నియామకం ఇద్దరిది మాత్రమే 

నాలుగు సువార్తీకుల్లో దేవుడు తన 'కుమారుడి' వంశావళిని వ్రాసేందుకు ఇద్దరిని మాత్రమే ఉత్తేజపరిచాడు. ఆ ఇద్దరు ప్రేరేపించబడ్డవారు తయారు చేసిన జాబితాల్లో మీరు సులభంగా యేసు యొక్క తాత తండ్రుల్ని పోల్చి చూసుకునేందుకు నేను పేర్లు మాత్రం ఇచ్చాను. 

ఆ జాబితా చూడండి:


GENEALOGY 
From 
DAVID TO JESUS 

According to MATTHEW  1:6-16                                                          According to LUKE; 3:23-31


దేవుడు తన కుమారుడికి దావీదు నుండి యేసు వరకు 26 మంది పూర్వీకుల్ని మాత్రమే మత్తయిని ప్రేరేపించి వ్రాయించాడు. 

కాని ప్రేరేపించబడిన లూకా మాత్రం యేసు కొరకు 41 మంది తండ్రుల్ని తాతల్ని (పరంపరను) సేకరించాడు. ఈ రెండు జాబితాలలోనూ దావీదు నుంచి యేసు మధ్య వరకు ఒక్క పేరు మాత్రం రెంటిలోనూ సరిగా వ్రాయబడి వుంది. అది యేసేపు. అదీను లూకా ప్రకారం (3:23) 'ఎంచబడిన తండ్రి'. ఈ ఒక్కపేరు మాత్రం కొట్టవచినట్లు ప్రత్యేకంగా కన్పిస్తుంది. దీన్ని వెతికి తీసేందుకు మీకు పెద్ద శ్రమ అక్కర్లేదు. ఆయన వడ్రంగి అయిన యేసేపు. మీరు చూడగానే అట్టే కనిపెట్టగలరు. రెండు చిట్టాలు ఒకదానికొకటి భిన్నంగానే వుంటాయి. మరి ఈ రెండు పద్దులు కూడాను ఒకే ఆధారం మూలమైన దేవుడి నుంచే ఉద్భవించిన వంటారా? 

భవిష్య వాణి నెరవేరిందా?

"అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చొండ బెట్టుదును"(అపోస్తుల; 2 :  30). కూర్చొన వలసినదనే భ్రమలో మత్తయి, లుకాలు ఇరువురూ దావీదు రాజును ఏసు యొక్క ప్రథమ, ముఖ్య పుర్వీకుడిగా నియమించి ఉత్సాహాన్ని చూపించారు. కాని సువార్తలు ఈ ప్రవచనాన్ని బొంకాయి అని తెలుస్తుంది. ఎందుకంటే యేసు తన తండ్రి (దావీదు) సింహాసనంపై కూర్చోడానికి బదులుగా, ఒక రోమను గవర్నరైన, విగ్రహారాధకుడైన పొంతిపిలాతు దానిని అధిరోహించి, ఆ సింహాసనానికి హక్కుదారుడైన (?) ఆ యేసుకు మరణ దండన విధించాడని ఆ వాక్యాలే మనకు తెలుపుతున్నాయి. "ఏం ఫర్వాలేదు. మొదటి రాకలో కాకపోయినా రాబోయే ఆయన రెండవ రాకడలో ఆ ప్రవచనాన్ని మరో మూడువందల ప్రవచనాలని ఆయన పూర్తి చేసి చూపిస్తాడు" అంటాడు ఎవాంజలిస్టు (ప్రబోధకుడు). 

కాని, అమిత ఉత్సాహంతో యేసు వంస పుర్వీకతను శారీరకంగా (అంటే రక్త పరంగా) దావీదుకు తగిలించాలన్న ప్రయత్నం జరిగింది. అదేగా బైబిలులోని అపోస్తుల 2:30 లో అన్నది. "అతని గర్భఫలముల నుండి" అంటే శారీరకంగా (అంటే రక్తపరంగా) అన్నమాట. దావీదుతో చేర్చే కార్యంలో మొట్టమొదటి మెట్టు నుంచే సువర్తీకులు జారిపడ్డారు. 

మత్తయి; 1:6 ప్రకారం మాత్రం ఏసు 'సోలమోను'ద్వారా దావీదు పుత్రుడని వ్రాయబడింది. 

కాని లూకా 3:  31 ప్రకారం మాత్రం ఏసు 'నథాను' ద్వారా, దావీదు పుత్రుడని వుంది. దావీదు రేతస్సు ఎసుతల్లి గర్భంవరకు ఒకేసారిగా ఇటు నథాను ద్వారా, అటు సోలమోను ద్వారా చేరడం అసంభవమని చెప్పేందుకు ఎవరు కూడా పెద్ద గర్భ కోశ నిపుణులు (Gynaecologist) కావలసిన అవసరం లేదు. మనకు ఈ ఇద్దరూ సువార్తీకులు నిక్కచ్చిగా అబద్దమాడుతున్నారన్నది బాగా స్పష్టమైపోతుంది. 

ఎందుకంటే ఏసు (అ.స) జననమన్నది, ఏ పురుష స్పర్శ లేకుండా ఒ మహా అద్భుతంగా, మహాత్తుగానే జరిగింది కాబట్టి! 

శరీర సంబంధంగా అనగా రక్తసంబంధంగా కూడా ఏసు వంస పూర్వీకులు దావీదు ద్వారా అని అనడంలో కూడా ఇరువురు సువార్తీకులు తప్పులోనే వున్నారు. 

పక్షపాతాన్ని దురభిమానాన్ని తీసేయాలి 

క్రైస్తవులు ఎంత చిత్తభ్రమలో వున్నారంటే మనం చేస్తున్న ఈ అతి స్వల్పమైన తర్కం కూడా వారి పక్షపాత మస్తిష్కానికి చేరదు. సరైన ప్రమాణం కోసం వారికి మనం అలాంటిదే ఒక ఉదాహరణిద్దాం. 

ఇస్లామందించిన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివ సల్లం) ఇస్మాయేలు ద్వారా అబ్రహాము కుమారుడని మనందరికీ తెలుసు. మన దగ్గరికి ఎవరైన ఉత్తేజం పొందిన గ్రంథకర్త వచ్చి 'నాకు ఈ ప్రేరణ జరిగింది. ముహమ్మద్ (స. అ. సం) ప్రవక్త ఇస్సాకు ద్వారా అబ్రహాము కుమారుడవుతాడని అంటే మనం అతను అబద్ధీకుడని గట్టిగా చెప్పగలం. ఎందుకంటే అబ్రహాము రేతస్సు, ముహమ్మద్ (స. అ. సం) తల్లి అయిన అమీనా వరకు ఇటు ఇసాక్కు ద్వారా అటు ఇష్మాయేలు ద్వారాను ఒకేసారిగా చేరదు. ఈ ఇరువురు అబ్రహాము పుత్రుల వంశపరంపరే ఇటు యూదుల అటు అరబ్బుల మధ్య భేదం. 

కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) విషయంలో ఎవరైనా ఇస్సాకు ఆయన పూర్వీకుడు, తాత అని అంటే మనం దాన్ని అసత్యమంటాం. కాని అదే ఏసు విషయంలో మత్తయి, లూకా ఇద్దరినీ అనేందుకు అనుమానమెందుకు? క్రైస్తవులు ఈ ఇద్దరిలో తమ దేవుడికి ఎవరు పుర్వీకులో నిర్ణయించుకునేంతవరకు మనం ఆ రెండు సువార్తలను అంగీకరించలేము. అది జరగడం లేదు. గత 2000 సంవత్సరాలుగా ఈ మర్మాన్ని విడదీయాలని క్రైస్తవ ప్రపంచం కడు యాతనలు పడుతూనే వుంది. పాపం ప్రయత్నం మానటంలేదు. వారి పట్టుదలను మనం అభినందించాలి. 'కాలం' సరైన పరిష్కారం ఇస్తుందని వాళ్లింకా నమ్ముతున్నారు కాబట్టి. 

"ప్రతి నాస్తికుడి తృప్తి కోసం ధర్మశాస్త్రవేత్తలు పరిష్కరించలేకపోతున్న పలు విభేదాలు వున్నాయి. చాలా గ్రంథ సంబంధమైన ఇబ్బందులున్నాయి. వాటికై విజ్ఞులు ఇంకా కుస్తీ పడుతూనేవున్నారు. సరైన జ్ఞానం లేనివాడే, అలాంటివి ఇతరత్రా బైబిల్లో లేవని అనగలుగుతాడు." (ది ప్లయిన్ ట్రూత్, జూలై 1975) 

"THERE ARE CLAIMED CONTRADICTIONS THAT THEOLOGIANS HAVE NOT RESOLVED TO EVERY ATHEIST'S SATISFACTION. THERE ARE TEXTUAL DIFFICULTIES WITH WHICH SCHOLARS ARE STILL WRESTLING. ONLY A BIBLE ILLITERATE WOULD DENY THESE AND OTHER PROBLEMS" (THE PLAIN TRUTH JULY 1975)
  
లూకా 'ప్రేరణకు' మూలం 
  
మర్మంగా ఉంచిన చిహ్నం (సంకేతం) 'Q' గురించి (ఇంతకు ముందు) మనం దీని గురించి చెప్పుకొని ఉన్నాం) మత్తయి, లూకాల నుండి, మార్కు వరకూ 85% విషయాలను మనం మేకులతో బిగించాం. 

"ఘనత వహించిన థియోఫిలా" అని లూకా; 1:3లో కథగా ఏసుకు చెప్పింది, తనకు ఎవరి ప్రేరణ (ఉత్తేజం) వలనో కూడా మనం తెలుసుకుందాం. 

లూకా సువార్తకు ముందుమాటగా ఏం రాయబడివుందో చూడండి. (ఇంగ్లీషు ఆథరైజ్డ్ వర్షన్ లో) 

తనకంటే తక్కువ విద్యావంతులైన వారిమార్గాన్నే తను అనుసరిస్తున్నానని వారంతాను తన నాయకుడైన ఏసు విషయంలో వేర్రిసాహాసం (తెగువ) చూపించే వ్రాశారని, లూకా మనకు స్పష్టంగా తెలుపుతున్నాడు. తానొక వైద్యుడు కాబట్టి ఆ బెస్తవాళ్ళ కంటే, సుంకరులకంటే చక్కటి సాహిత్య పటిమను చూపించి వుండవచ్చు. ఇదంతా తానెందుకు చేశాడో తానే తెలుపుతున్నాడు. "నాకు అది బాగనే వుందనిపించింది, సరిగా వుందనిపించింది" అని తనకంటే ముందు వ్రాసినవారి రచనల్ని ఓ విధంగా సమర్ధించుకున్నాడు. 

సెయింట్ లూకా సువార్త యొక్క అనువాదానికి పరిచయ వాక్యాలు వ్రాస్తూ అతి ప్రముఖ క్రైస్తవ విజ్ఞుడైన జె.బి. ఫిల్లిప్స్ ఇలా అంటాడు. 
"లూకా తనకు దొరికిన, ప్రస్తుతం వున్న వ్రాత సంపద నుంచి పోల్చి చూచి, సంగ్రాహ్యం చేసి వ్రాశానని తానె ఒప్పుకున్నాడు. అతనికి ఇంకా ఎక్కువ వ్రాత సంపద అందుబాటులో ఉండింది. (అయినా అది వాడలేదని) అతను తీసుకుని వ్రాసిన మూలప్రతుల నుంచి దానిని మనం చాలావరకు గమనించగలం"

అయినా మీరు దీనిని 'దైవ వాక్యమంటారా?' 

నూతన ఆంగ్లంలో సువార్త "THE GOSPEL యిం MODERN ENGLISH" ఫోంటానా (FONTANA) పబ్లికేషన్స్ వారిది ఒకటి సంపాదించండి. అది చాలా ఛీప్ ఎడిషన్. దాన్ని తొందరగా సంపాదించండి. లేకపోతె ఫిలిప్పు రాసిన పై వాక్యాలను క్రైస్తవులు తీసివేసినా ఆశ్చర్య పడనవసరం లేదు. రివైస్జ్ స్టాండర్డ్ వెర్షన్ (RSV) గ్రంథకర్తలు కూడా 'ముందుమాట' (preface) ని తమ అనువాదం నుంచి తీసివేసినా మీరు ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళ చాలా చాలా పాత అలవాటు. 

క్రైస్తవ్యంలో ఏదైనా తప్పు ప్రచురితమై పట్టుబడితే, వెంటనే దాన్ని తీసి మార్చివేసి వ్రాయడం చాలా పాత అలవాటు. మనం 'నేడు' అని చూసిన వాటిని 'గతం' గా కూడా మార్చివేసే చరిత్ర వుంది. 
ఇక మిగిలిన సువార్త
"యోహాను సువార్త" (THE GOSPEL OF St. JOHN) గ్రంధకర్త ఎవరు? వాస్తవానికి దేవుడు కాదు, సెయింట్యోహానూ కాదు! మీరే చూడండి 'అతను' "he" (?) "తనను" "himself" (?)గురించి ఏమంటున్నాడో:
యోహాను 19 : 35 మరియు 21 : 24 – 25 చదవండి. ఎవరు అతని యొక్క "అతడు" (he) మరియు "అతని" "his" మరియు 'ఇది' (This) మరియు "మన మెరుగుదుము" (We Know) మరియు "నా ప్రకారం" (I Suppose). అతను కొపదీసి తోటలో అత్యవసరమైన సందర్భంలో మతి స్థిమితంలేక ఆయనను వదలి వేసిన చపలమతి కాదు కదా? లేదా అంతిమ విందు (THE LAST SUPPER) లో బల్లమీద "యేసు ప్రేమించిన" పదునాల్గో వ్యక్తికాదు కదా? ఇద్దరూ యోహానులే. యోహాను అన్నది యూదుల కాలంలో కడుకునేటి క్రైస్తవుల్లో కూడా ఓ సర్వ సాధారణమైన పేరు. పైన చెప్పిన వారిద్దరిలో ఎవడూ ఈనాలుగో సువార్త గ్రంధకర్త కాదు. అది ఎవరో గుర్తు తెలీని వ్యక్తి వ్రాసిందని నేడు స్పష్టమై పోయింది.
యోహాను సువార్తలో ఉపయోగించబడిన సర్వనామముల (PRONOUNS) ను చూడండి.
ఓసారి గ్రంధకర్తల్ని గురించి క్లుప్తంగా  
50 'సహకరించే పలు క్రైస్తవ సమాఖ్యలు' మద్దతునివ్వగా 32 బైబిలు మహా విగ్నులతో కూడి, 'గ్రంధకర్తల' ను గురించిన తీర్పు ఏమిటో తెలిపి ఈ పుస్తకాన్ని ముగిస్తాను. ఈ గ్రంధకర్తల పోటాపోతీలో 'దేవుడు కనిపించడు. ఆయన ఎప్పుడో తీసివేయబడ్డాడు. రివైస్డ్ స్టాండర్డ్ వెర్షెన్కోలిన్సు (COLLINS) వారి THE BOOKS OF THE BIBLE 'బైబిలు పుస్తకాలు' అనే శీర్షిక మీద అమూల్యమైన సమాచారం వారి పుస్తకాంతంలో ఇవ్వబడింది. దానిలో కొంత భాగం మీ పరెశీలన నిమిత్తం ఇచ్చాను.
మనం బైబిలు గ్రంధంలోని మొదటి పుస్తకం 'ఆదికాండం' నుంచి ప్రారంభిద్దాం. దాని గ్రంధకర్తను గురించి పడితులేమంటున్నారంటే మోషే యొక్క ఐదు పుస్తకాలలో ఒకటి (ONE OF THE FIVE BOOKS OF MOSES) బాగా గమనించండి ఇన్వెర్టెడ్ కామాలు పెట్టి మధ్యలో "FIVE BOOKS OF MOSEA" అని వ్రాయబడింది
దీని అర్ధం ఏమంటే, ఇది మోషే పుస్తకమని, మోషే దీని గ్రంధకర్త అని ఇతరులు ఇతర ప్రజలు అంటున్నారని కొటేషన్లు పెట్టి యుక్తిగా వ్రాయడం. అంటే ఇది మేము 32 మంది బైబిలు విగ్నులు అంటున్నమాట కాదని చమత్కారంగా తప్పుకోవడం.
మరి ఇతర నాలుగు పుస్తకాలు నిర్మకాండం, లెవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. వీటి రచయితా, గ్రంధకర్త ఎవరు? "సాధారణంగా మోషేకు చెందినవి" అంటారు.
ఇదీ ఆదికాండానికి ఉపయోగించిన విధానమే.
మరి 'యెహోషువా' గ్రంధానికి గ్రంధకర్త ఎవరు?
జవాబు : "చాలా భాగం యెహోషువాకే చెందుతుంది"
మరి 'న్యాయాధిపతులు" గ్రంధం రచయిత ఎవరు?
జవాబు: "బహుశా సమూయేలు"
'రూతు' పుస్తకానికి గ్రంధకర్త ఎవరు?
జవాబు : 'పక్కాగా తెలియదు'
గ్రంథకర్త ఎవరు?
1 సమూయేలు? – జవాబు : గ్రంథకర్త "తెలీదు" (UNKNOWN)
2 సమూయేలు? – జవాబు : గ్రంథకర్త "తెలీదు" (UNKNOWN)
1 రాజులు? – జవాబు : గ్రంథకర్త "తెలీదు" (UNKNOWN)
2 రాజులు? – జవాబు : గ్రంథకర్త "తెలీదు" (UNKNOWN)

1 దినవృత్తాంతములు? – జవాబు : "గ్రంథకర్త తెలీదు" బహుశా…."
2 దినవృత్తాంతములు? – జవాబు : "గ్రంథకర్త తెలీదు మొత్తానికి ……..కావచ్చు. "
మరి ఈ కథ ఇలాగే కొనసాగుతూ పోతుంది. ఈ గుర్తు తెలియని పుస్తకాల, గ్రంథకర్తల పుట్టుక అయితె మాత్రం "తెలియదు" (UNKNOWN) లేదా "బహుశా" (PRABABLY) లేదా "కావచ్చు" (LIKELY) లేదా "అనుమానాస్పదం" (Doubtful) మరిలాంటి గందరగోళానికి దేవుణ్ణి తప్పుపడ్తే ఎలా? ఈ యూదుల నీచ దోషాలకు, అహంకారాలకు, దురభిమానాలకు, వాళ్ళ దురాశాభావాలకు, ఈర్ష్యాధ్వెషాలకు, ఝగడాలకు, దుష్కృతాలకు, చాలా కాలంగా వ్యధచెందుతున్న కరుణాకరుడైన దేవుదు తాను వాటికి గ్రంథకర్తకానని బైబిలు పండితుల ద్వారా చెప్పించేందుకు రెందు వేల సమ్వత్సరాల దాక ఆగలేదు. త్వరగానే వారంతా ఏం చేస్తున్నారన్నది బహిర్గతం చేసేశాడు.
(ఖుర్ఆన్‌; 2 : 79) "ధర్మ గ్రంథాన్ని తమ హస్తాలతో రచించి తద్వారా తుచ్ఛ ప్రయోజనం పొందే నిమిత్తం ఇఇది దేవుడి దగ్గరి నుండి వచ్చింది అని చెప్పేవారికి నాశనం తప్పదు. వారి వినాశనానికి దారితీస్తుంది. వారి ఎ సంపాదన కూడా వారి సర్వవినాశనానికి కారణభూతమౌతుంది."