Tuesday, September 13, 2022

ఇస్లాం చరిత్ర 3

 ఇస్లాం చరిత్ర:-3         🕋☪🕋☪


~~~~~~~~~~~~~


{ఇస్లాం పరిచయం:-3}


                 అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?:- 2


🔸 'అల్లాహ్' అనే పదానికి అర్థం ఏమిటి ?:-


'అల్లాహ్' అనే అరబీ పదానికి 'సకల ఆరాధనలకు అర్హుడైన దైవం' అని అర్థం. అల్లాహ్ అనే పదాన్ని అలాగే వాడడానికి వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, అల్లాహ్ అనే పదం భాషాపరంగా ఎంతో విశిష్టమైనది. ఎలాగంటే, ఈ పదానికి అరబీ భాషలో బహువచనం లేదు. దేవుడు అనే పదానికి బహువచనం {దేవుళ్ళు} అని ఉంది. కాని అల్లాహ్ అనే పదానికి బహువచనం లేదు. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ పదానికి బహువచనం ఉండటం అర్థరహితం. ఇంకా అల్లాహ్ అనే పదానికి లింగం కూడా లేదు. దేవుడు అనే పదానికి స్త్రీ లింగం {దేవి, దేవత} ఉంది. కాని అల్లాహ్ అనే పదం అసలు ఏ లింగమూ కలిగిలేదు. అరబీ వ్యాకరణ నియామాలననుసరించి అల్లాహ్ ను 'అతడు' అని పుల్లింగంలో సంబోధిస్తాము. కాని అసలు ఈ పదానికి లింగం లేదని గుర్తించాలి. ఎందుకంటే స్త్రీ, పురుష లింగాలు సృష్టికి సంబంధించినవి మరియు జంతువులు, మానవులకు వర్తించేవి. సృష్టికర్త మనలాంటి ప్రాణి కాడు. ఆయన లింగానికి అతీతుడు.


ఇలా దైవ అస్తిత్వానికి సూటిగా సరిపోయే పదం 'అల్లాహ్'. ఇంకా చిట్టచివరి దైవసందేశ గ్రంథమయిన ఖుర్ఆన్ లో ఆ దైవం తనను తాను 'అల్లాహ్' అని పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనను అదే పేరుతో పిలవడం సమంజసం. ఇంకా ఖుర్ఆన్ లో పేర్గొనబడిన ఆయన ఇతర గుణనామాలు కూడా వాడవచ్చు. {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 "వారికి చెప్పు: ''అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా - ఏ పేరుతో పిలిచినా - మంచి పేర్లన్నీ ఆయనవే. నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగానూ, మరీ మెల్లగానూ పఠించకు. వీటికి నడుమ మధ్యేమార్గాన్ని అవలంబించు." {ఖుర్ఆన్ 17:110}.


🔸 అల్లాహ్ {సృష్టికర్త}కు రూపం ఉందా ?:-


ఉంది. కాని అది మనం ఊహించలేము, ఈ శరీరంతో దానిని వీక్షించలేము.  ఎందుకంటే ఆయనను సృష్టిలోని ఏ వస్తువుతో కూడా పోల్చలేము, సమానం చెయ్యలేము. {ఖుర్ఆన్ ఆయత్ ల యొక్క తెలుగు భావానువాదం}:


💎 ".... ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు...." {ఖుర్ఆన్ 42:11}.


💎 "{ఓ ము'హమ్మద్‌ - స !} వారికి ఇలా చెప్పు: ఆయన అల్లాహ్‌ {నిజమైన ఆరాధ్యుడు} ఒక్కడు. అల్లాహ్‌ నిరుపేక్షాపరుడు. {ఏ అక్కరా లేనివాడు}. ఆయన {ఎవరినీ} కనలేదు. ఆయన {కూడా} ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు {పోల్చదగినవాడు} ఎవడూ లేడు." {ఖుర్ఆన్ 112:1-4}.


💎 "ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు. సర్వమూ తెలిసినవాడు." {ఖుర్ఆన్ 6:103}.


💎 "మేము నిర్థారించిన సమయానికి మూసా {అలైహిస్సలాం} వచ్చి, అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను, ''నా ప్రభూ ! నాకు నీ దర్శనం కలిగించు. నేను ఓసారి నిన్ను చూస్తాను'' అని విన్నవించుకోగా, ''ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నన్ను చూడలేవు. అయితే అదిగో ! ఆ కొండ వైపు దృష్టిని సారించు. అది గనక యధాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు'' అని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. మూసా స్పృహతప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, ''{ప్రభూ !} నీవు పరమ పవిత్రుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను. అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను'' అని మనవి చేసుకున్నాడు." {ఖుర్ఆన్ 7:143}.


సూర్యుడినే కొన్ని క్షణాలపాటు చూడలేని కళ్ళతో మనం ఈ విశ్వ సృష్టికర్తనే చూడాలనుకోవడం అవివేకం, అతనికి తగని రూపాన్ని అతనికి ఆపాదించడం అజ్ఞానం. అందుకనే మస్జిదులో ఆయన యొక్క ఏ చిత్ర పటమూ, విగ్రహమూ ఉండవు. 


అయితే పరలోక జీవితంలో సాఫల్యం పొందిన వారికి ఆయన దర్శనభాగ్యం లభించనుందని అల్లాహ్‌ తెలియపరిచారు. అక్కడ మనకు ఇవ్వబడే శరీరాలు వేరుగా ఉంటాయి. {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 "మేమే మీ మధ్య చావును నియమించాము. ఈ విషయంలో మేము అశక్తులము కాము. మీ స్థానంలో మీ వంటి వారిని తీసుకువచ్చే, మీరెరుగని అవస్థలో మిమ్మల్ని తిరిగి లేపే శక్తి మాకుంది." {ఖుర్ఆన్ 56:60,61}.


అందుకని ఆయన రూపాన్ని దర్శించాలనే తపన కలవారు ఆయన తెలియజేసిన మార్గంలో పయనించాలి. ఎందుకంటే పరలోకంలో సాఫల్యం చెందేవారికే ఆ మహాభాగ్యం లభించనుంది. {ఖుర్ఆన్ ఆయత్ ల యొక్క తెలుగు భావానువాదం}:


💎 "ఆ రోజు ఎన్నో ముఖాలు {ఆహ్లాదకరంగా} తాజాగా ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి." {ఖుర్ఆన్ 75:22,23}.


💎 "ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే." {ఖుర్ఆన్ 2:5}.


🔸 అల్లాహ్ ను మాత్రమే ఎందుకు ఆరాధించాలి ?:-


ఎందుకంటే అల్లాహ్ భూమి, ఆకాశాల సృష్టికర్త. సకల జీవుల ప్రభువు. అంటే వాటి సృష్టికర్త {Creator}, అధిపతి {Owner} మరియు పోషణకర్త {Cherisher or Sustainer}. తీర్పు దినానికి యజమాని. ఆయనే మనందరినీ సృష్టించి, పోషిస్తున్నాడు మరియు మరణం తరువాత మనందరమూ తీర్పు కోసం ఆయన ముందు నిలవనున్నాము. అందుకని సకల ఆరాధనలకు అర్హత కేవలం ఆ ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది.


🔸 మరి ఆయనను ఇక్కడ ఎలా ఆరాధించాలి ? రూపం తెలియకుంటే ఏకాగ్రత ఎలా సాధ్యం ?:-


ఆయనను ఆయన దైవప్రవక్తలు {ము'హమ్మద్, ఈసా, ఇబ్రాహీం మొదలైన మహాప్రవక్తలు - వారందరిపై దైవం యొక్క శాంతి, శుభాలు కురుయుగాక} ఎలా ఆరాధించి చూపారో అలానే నమాజు ద్వారా ఆరాధించడం జరుగుతుంది. 


కష్టాలలో ఉన్నప్పుడు, ఏ విగ్రహమూ, బొమ్మ గురించి ఆలోచించము, దేవుడా రక్షించు అంటాము. అప్పుడు అవసరంలేని విగ్రహం ఇప్పుడెందుకు ? దేవుడి గుణగణాలను, అనుగ్రహాలను లేదా కరుణా కటాక్షాలను మననం చేసుకుంటూ మరియు ఖుర్ఆన్ వాక్యాల అర్థం మీద మనసు కేంద్రీకృతం చేస్తే చాలు ఏకాగ్రత, మనో నిర్మలత వాటంతట అవే వస్తాయి. {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 "మరి వారు ఓడలో ప్రయాణమైనప్పుడు, తమ ఆరాధనను అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని - కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే, అప్పటికప్పుడే వారు దైవానికి సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు." {ఖుర్ఆన్ 29:65}.


చెట్లు, చేమలు, నదులు, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, జంతువులు, విగ్రహాలు, పుణ్యపురుషులు, బాబాలు, దైవప్రవక్తలు, పౌరాణిక గాధలలోని పాత్రలు మొదలైనవన్నీ సృష్టితాలే, ఇవేమీ సృష్టికర్తకు సమానం కావు. ఎంత గొప్ప మనిషైనా దేవుడితో సమానం కాడు, సృష్టిలోని అంశమే. దేవుడు మనిషి కాజాలడు. దేవుడు దేవుడే, మనిషి మనిషే.


అల్లాహ్ అంటే ముస్లిముల లేదా అరబ్బుల దేవుడు అని ఒక అపోహ ఉంది. ఇక్కడ ప్రస్తావించబడుతోంది ఒక వర్గం వారి దేవుడి గురించి కాదు. భూమ్యాకాశాలను, సమస్త మానవాళిని, జంతు జీవాలనూ సృష్టించినవాడు ఒక్కడే. ఒకొక్క జాతికి, దేశానికి ఒకొక్క దేవుడు లేడు, సమస్త మానవాళి దైవం ఒక్కడే. ఆ దైవానికి మనం అతడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా అనేక రూపాలు, అస్తిత్వాలు కల్పించుకొని అజ్ఞానంతో మతాలుగా విడిపోయి విభేదాలలో పడిపోయాము. దైవానికి అనేక రూపాలను కల్పించుకోవడాన్ని దైవం తరపునుండి ఏ ప్రమాణం లేకున్నా, మానవ కల్పిత సిద్ధాంతాల ద్వారా సమర్ధించుకుంటున్నాము. ఈ అంధకారం నుంచి బయటపడి, దైవాన్ని గుర్తించవలసిన రీతిలో గుర్తించి ఏకేశ్వరోపాసన ద్వారా మాత్రమే మానవాళి ఐక్యత, సమానత్వం, శాంతి సాధ్యమౌతాయి. అందుకని ఇక్కడ ఎవరి దేవుడు గొప్ప అనేది చర్చ కాదు, కల్పిత దైవాల ద్వారా దేవుడి గొప్పదనాన్ని ఎలా కూలగొడుతున్నామో అనేది ఆలోచించుకోవాలి.


సృష్టిని కాదు సృష్టికర్తనే ఆరాధించండి., ఇదియే మోక్షమార్గం. {ఖుర్ఆన్ ఆయత్ ల యొక్క తెలుగు భావానువాదం}:


💎 "ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను {తాగూత్ ను} తిరస్కరించి అల్లాహ్ ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వంవినేవాడు, సర్వంతెలిసినవాడు." {ఖుర్ఆన్ 2:256}.


💎 "నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం...." {ఖుర్ఆన్ 3:19}.


💎 "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు." {ఖుర్ఆన్ 3:85}.


తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతిమానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరం లేక నేర్చుకోవలసిన అవసరం లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయినవారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ము'హమ్మద్ {సల్లల్లాహు అలైహి వసల్లం} ఇలా బోధించారు: "ఫిత్రా {మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస} స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో చేసి వేస్తారు." {సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం.}


🔰 _'ఇస్లాం అంటే ఏమిటి ?', 'అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?' అనే అంశాల గురించి వివరంగా తెలుసుకున్న తరువాత, 'భూమ్యాకాశాలను మరియు సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడా ? లేక అవి వాటికవే ఉనికిలోనికి వచ్చాయా ?' అనే అంశం గురించి InSha Allah రేపటిభాగంలో తెలుసుకుందాం.


అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు

ఇస్లాం చరిత్ర 2

 ☪🕋☪🕋        ఇస్లాం చరిత్ర:-2         🕋☪🕋☪


~~~~~~~~~~~~~


{ఇస్లాం పరిచయం:-2}


                 అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?:- 1


భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్యఉన్న సమస్తాన్ని ఎవరైతే సృష్టించారో, ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో, ఎవరైతే సమస్తానికి మరణాన్ని ఇస్తున్నారో, ఎవరైతే సమస్తజీవులను ప్రశ్నిస్తాడో, లెక్కతీసుకుంటాడో, ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు.


"అల్లాహ్" అంటే మానవుల ఆరాధ్యదైవం. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఎవరి అవసరం లేనివాడు. ఆయనకు సంతానంలేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. విశ్వమంతటినీ సృష్టించింది ఆయనే. యావత్ ప్రపంచంపై ఆయన అధికారం ఉంది. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. ఆయన నిత్యం ఉంటాడు. సృష్టిరాశుల జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన చేయదలచుకున్న దానిని ఆపేవాడేవడూ లేడు. ఆయన ఆపదలచుకున్న దానిని చేసేవాడు కూడా ఎవడూ లేడు.


     ఆయన తినడు, త్రాగడు; ఆయనకు నిద్రలేదు, కునుకూ రాదు. విశ్వవ్యవస్థను నడిపిస్తూ ఆయన అలసిపోడు. మనసుల్లో దాగిఉండే రహస్యాలు సైతం ఆయనకు తెలుసు. భూమ్యాకాశాలలో ఏదీ ఆయనకు గోప్యంగా లేదు. ఆయన జ్ఞానం విశ్వమంతా వ్యాపించిఉంది. ప్రతివిషయం ఆయనకు తెలుస్తూ ఉంటుంది.


     అల్లాహ్ భూమ్యాకాశాలకు మరియు సర్వానికి సృష్టికర్త. ఆయనే ఆరాధనీయుడు, ఆయనకు భాగస్వాములు, ప్రత్యర్థులు, సమానులు అంటూ ఎవరూలేరు. అల్లాహ్ తాను సృష్టించిన వాటిలా కాదు. ఆయన దైవత్వాన్ని దేనికీ ఆపాదించలేము. అంటే - సృష్టికర్త, పోషకుడు, కరుణామయుడు, సర్వశక్తిమంతుడు, న్యాయమూర్తి, సమస్తమూ తెలిసినవాడు.


     తన అధికారమూ, కార్యములరీత్యా అల్లాహ్ కు భాగస్వాములు లేరు. అల్లాహ్ ఆదేశం మేరకే జగత్తు సృష్టించబడింది. ఆయనే ఈ జగత్తులన్నింటినీ నడిపిస్తున్నదీ, నియంత్రిస్తున్నది. ఎంతో సమతుల్యమైన, సంక్లిష్టమైన ఈ సృష్టిని సృష్టించడమన్నది ఆ సర్వశక్తిమంతుడికి తప్ప మరొకరికి సాధ్యంకాదు.


     సుఖసంతోషాలు ఆయనే ఇస్తాడు. దుఃఖవిచారాలు ఆయనే కలిగిస్తాడు. మంచీచెడులు, లాభనష్టాలు అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. దైవత్వంలో, గుణగణాలలో, శక్తిసామర్థ్యాలలో ఆయనకు భాగస్వాములు ఎవరూలేరు. ఖుర్ఆన్ మాటల్లో చెప్పుకోవాలంటే: {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 ".... ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు...." {ఖుర్ఆన్ 42:11}.


అల్లాహ్ అంటే, ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్థం. కాని, అల్లాహ్ అంటే, దర్గాలు {సమాధులు}గానీ, పీర్లు గానీ, బాబాలు గానీ మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు గానీ కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ఆన్ గ్రంథం ప్రకారం అతిపెద్ద పాపం. దివ్య ఖుర్ఆన్ 30:40 వాక్యం ప్రకారం {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


"ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని సృష్టించాడు, తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని చంపుతాడు, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి ! ఈ పనులలో దేన్నయినా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా ? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు." {ఖుర్ఆన్ 30:40}.


🌎☄ సృష్టికర్త {అల్లాహ్} ఎలా ఉంటాడు ? మనిషికి ఉన్న బలాలు, బలహీనతలు సృష్టికర్తకు కూడా ఉంటాయా ? ☄🌎


ఆ సృష్టికర్త యొక్క లక్షణాలను గురించి దివ్య ఖుర్ఆన్ బోధనలు: ↓


🔸 అల్లాహ్ {సృష్టికర్త} యొక్క లక్షణాలు:-


అల్లాహ్ లక్షణాలపై ఖుర్ఆన్ లోని కొన్ని ఆయత్ ల భావాలు ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది.


✳ పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు. {ఖుర్ఆన్ 112:3}.


✳ మరణం ఇచ్చేవాడేకాని మరణం లేనివాడు. {ఖుర్ఆన్ 25:58}.


✳ నిదురను ఇచ్చేవాడు, నిద్రించనివాడు. {ఖుర్ఆన్ 2:255}.


✳ ఆకలిని తీర్చేవాడు, ఆహారం అవసరం లేనివాడు. {ఖుర్ఆన్ 51:57}.


✳ సంతానం ఇచ్చేవాడు, సంతానం లేనివాడు. {ఖుర్ఆన్ 112:3,42:49}.


✳ మనల్ని చూసేవాడు, మనకు కనబడనివాడు. {ఖుర్ఆన్ 6:103}.


✳ అలసిపోనివాడు. {ఖుర్ఆన్ 50:38}.


✳ భూమ్యాకాశాలకు వెలుగైనవాడు. {ఖుర్ఆన్ 24:35}.


✳ సృష్టి నాశనం అవుతుంది. తాను నాశనంలేని వాడు. {ఖుర్ఆన్ 55:26}.


✳ సృష్టిలో ఏ వస్తువుతో పోలిక లేనివాడు. {ఖుర్ఆన్ 42:11}.


✳ అవసరాలు తీర్చేవాడు, అవసరాలు లేనివాడు. {ఖుర్ఆన్ 112:2}.


✳ మొదటివాడు, ఆఖరివాడు. {ఖుర్ఆన్ 57:3}.


✳ మారనివాడు, స్థిరంగా ఉండేవాడు. {ఖుర్ఆన్ 2:255}.


✴ ఆయన ఒక్కడే {అద్వితీయుడు}. {ఖుర్ఆన్ 112:1}.


✴ ఆయనకు ఆది, అంతం, పుట్టుక, మరణము,లేదు. {ఖుర్ఆన్ 112:3;28:88}.


✴ ఆయనకు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఉండరు. {ఖుర్ఆన్ 6:101; 112:3}.


✴ ఆయనకు సరిసమానులు, సాటి, మేటి ఎవ్వరూ లేరు. {ఖుర్ఆన్ 112:4}.


✴ ఆయనకు ఎటువంటి ప్రతిమ లేదు. ఆయనను పోలినది ఈ సృష్టిలో ఏదీలేదు. {ఖుర్ఆన్ 42:11}.


✴ ఆయనకు ఆకలిదప్పులు, నిద్ర అలసట లాంటి బలహీనతలు ఉండవు. ఆయన దేనిపైన ఆధారపడేవాడు కాదు. {ఖుర్ఆన్ 2:255;112:2}.


✴ ఆయన ఏదైనా చేయాలనుకుంటే కేవలం 'అయిపో' అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది. {ఖుర్ఆన్ 2:117}.


✴ ఆయన భూమిపైన {మానవరూపంలో} అవతరించడు. దైవదూతలను సందేశ నిమిత్తం అవతరింపజేస్తాడు. {ఖుర్ఆన్ 97:4}.


✴ ఆయన సప్తాకాశాలకు పైన సృష్టి సామ్రాజ్యపీఠము {అర్ష్}ను అధిష్టించి ఉంటాడు. {ఖుర్ఆన్ 20:5}.


ఈ లక్షణాలు గలవాడిని మనం మన ఆరాధ్యదైవంగా చేసుకోవాలి. ఈరోజు మనిషి ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, పూజిస్తున్నాడో వారు కూడా మనలాంటి మానవులే. మనకున్న శరీరం, ఆకలి దప్పికలు, నిదుర కునుకులు, మల మూత్ర విసర్జనలు వారికీ ఉన్నాయి. ఆ సృష్టికర్త మనలాంటి బలహీనతలు, లోపాలు కలిగినవాడుకాదు. మానవాతీతమైన లక్షణాలు కలిగినవాడు.


🔸 'అల్లాహ్' అనే పదానికి అర్థం ఏమిటి ?:-


విశ్వప్రభువుకు అన్నివిధాలా శోభాయమానమైన పదం "అల్లాహ్"


"అల్లాహ్" అనేది అరబీ భాషాపదం. ఇది "అల్" మరియు "ఇలాహ్" అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది.


'అల్' అనేది ఇంగ్లీషులో వాడబడే THE వంటి ఉపపదం - ఆర్టికల్. దీని అర్థం నిర్దిష్టమైన, నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకు ముందు ప్రస్తావించబడిన, ఏకైక మరియు వాస్తవమైన అని.


'ఇలాహ్' అంటే ఆరాధింపబడేవాడు, ఆరాధ్యుడు, పూజితుడు, పూజింపబడేవాడు అని మొదలగు అర్థాలు వస్తాయి.


అల్ {The} + ఇలాహ్ {God} = అల్లాహ్ {The God}


ఇప్పుడు ఈ రెండు పదాలను {అల్+ఇలాహ్}ను కలిపితే "అల్లాహ్" అనే పదం ఏర్పడింది. అదే విధంగా దాని ప్రత్యేక అర్థం కూడ ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికి తెలిసిన ఆరాధ్యుడు.


     ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టిరాశులు ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వెల్లబుచ్చుతున్నవి మాత్రమే. అంతిమ లక్ష్యంవైపు పయనిస్తున్నవి మాత్రమే.


తెలుగులో మనం 'దేవుడు' అంటాం. అరబీలో "అల్లాహ్" అంటారు. ఇంగ్లీషులో 'గాడ్ {God}' అని అంటారు. ఇలా మానవుల ఆరాధ్యదైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. కాని ఇన్ని పదాల్లోకెల్లా "అల్లాహ్" అనేది ఎంతో విలక్షణమైన పదం. విశ్వప్రభువుకు అది అన్నివిధాలా శోభాయమానమైన పదం.


'దేవుడు' అనే పదం బహువచనమైతే 'దేవుళ్ళు' అయిపోతుంది. స్త్రీలింగమయితే 'దేవత' అవుతుంది. అలాగే ఇంగ్లీషులో కూడా God అనే పదం gods మరియు goddess అవటానికి ఆస్కారముంది. అలాగే ఆ పదం స్త్రీ పురుష భేదాన్ని సూచించేటట్టుగా కూడా ఉండరాదు. అరబీ భాషలోని అల్లాహ్ అనే పదం అచ్చు ఆ భావానికి దర్పణం పడుతుంది. అల్లాహ్ అనే పదానికి బహువచనం లేదు. అలాగే దీనికి స్త్రీ లింగ పదం కూడా రాదు. కనుక "అల్లాహ్" అనే పదం విశ్వప్రభువుకు అన్నివిధాలా శోభాయమైనదని చెప్పవచ్చు.


అరబ్బీ మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు "దేవుడు" అనే పదానికి  బదులుగా "అల్లాహ్" అనే పదాన్ని వాడుతారు. ఇంగ్లిష్ Bible లో God అని వాడిన చోటల్లా అరబిక్ Bible లో "అల్లాహ్" అనే పదం కనపడుతుంది.


🔸 ఒక అపోహ:-


ముస్లిమేతరులకు ఇస్లాం గురించి వున్న అనేక పెద్ద అపోహల్లో "అల్లాహ్" అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. క్రైస్తవుల, యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ముస్లింలు ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే "అల్లాహ్" అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ ఒక్కడే.


దేవుడు ఎవరు ? ఆయన అస్తిత్వం ఏమిటి ? అనే విషయాల్లో యూదులు - క్రైస్తవులు - ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఉదా:- క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వభావన {Trinity}ను యూదులు తిరస్కరిస్తారు. ముస్లింలు కూడా దాన్ని తిరస్కరిస్తారు. అంత మాత్రం చేత ఆ మూడు మతాలకు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్థంకాదు. ఎందుకంటే - విశ్వమంతటికి నిజదేవుడు ఒక్కడే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే - ఇతర మతాలవాళ్ళు కూడా అల్లాహ్ నే విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ ను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించటం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకొని విశ్వసిస్తున్నారు.


🔸 అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు:-


అల్లాహ్ అంటే ముస్లిముల దైవం, ఇంకో పేరున మరోజాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ మరియు విశ్లేషణ దివ్య ఖుర్ఆన్ లో ఇలా ఉన్నది: {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 "{ఓ ము'హమ్మద్‌ - స !} వారికి ఇలాచెప్పు: ఆయన అల్లాహ్‌ {నిజమైన ఆరాధ్యుడు} ఒక్కడు. అల్లాహ్‌ నిరుపేక్షాపరుడు. {ఏ అక్కరా లేనివాడు}. ఆయన {ఎవరినీ} కనలేదు. ఆయన {కూడా} ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు {పోల్చదగినవాడు} ఎవడూ లేడు." {ఖుర్ఆన్ 112:1-4}.


నీ ప్రభువు పుట్టుపూర్వోత్తరాలను, ఆయన వంశ పరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవారాధకులు మహాప్రవక్త {సల్లల్లాహు అలైహి వసల్లం}ను డిమాండు చేసిన నేపథ్యంలో ఈ ఖుర్ఆన్ అధ్యాయం అవతరించింది.


అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. ఆయనకు ఎవరి అవసరమూ లేదూ. ఆయన ఎవరిపైనా ఆధారపడినవాడు కాడు. అందరికీ ఆయన అవసరం ఉంది. అందరూ ఆయన పైనే ఆధారపడి ఉన్నారు. అల్లాహ్ అందరికన్నా వేరైనవాడు, నిరపేక్షాపరుడు. ఆయనకు సంతానం లేదు. ఆయనకు తల్లిదండ్రులు సైతం లేరు. ఆయన ఎవ్వరినీ కూడా కుమారులుగా గాని, కుమార్తెలుగా గాని చేసుకోలేదు. ఆయన ఉనికిలోగాని, ఆయన గుణగణాలలో గానీ, ఆయన అధికారాలలో గానీ ఆయనకు భాగస్వాములు లేరు. ఆయనకు సరిజోడీ కూడా లేరు. {ఖుర్ఆన్ ఆయత్ యొక్క తెలుగు భావానువాదం}:


💎 ".... ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు...." {ఖుర్ఆన్ 42:11}.


🔸 ఒక హదీస్ ఖుద్సీలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:


"మానవుడు నన్ను దూషిస్తున్నాడు. అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు. వాస్తవానికి నేను ఒక్కడినే. నేను నిరుపేక్షాపరుణ్ణి. నేనెవరినీ కనలేదు. నేనెవరికీ పుట్టనూలేదు. నాకు సరిజోడీ కూడా ఎవరూలేరు."


ఈ విధంగా బహుధైవారాధకుల మూఢనమ్మకాలు, అల్లాహ్ కు కుమారులను ఆపాదించే వారి మిథ్యావాదాలు, దైవానికి భాగస్వాములను కల్పించేవారి యొక్క కల్పనిక సిద్ధాంతాలు అన్నీ నిర్ద్వంద్వంగా ఖండించబడ్డాయి.


అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు. ఖుర్ఆన్ ప్రకారం అల్లాహ్ కు రూపం ఉంది. కానీ, ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు. స్వర్గంలో మాత్రమే అల్లాహ్ ను కళ్ళారా చూసే అదృష్టం {అవకాశం} లభిస్తుంది.


                 అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?:- 2


🔰 InSha Allah రేపటిభాగంలో....;


అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు

ఇస్లాం చరిత్ర- 1

🕋☪🕋        ఇస్లాం చరిత్ర:- 1         🕋☪🕋☪


{....'ఇస్లాం చరిత్ర' మొదలుకొని 'హజ్రత్ ఈసా {అలైహి}' వరకు....}


{ఇస్లాం పరిచయం:-1}

అల్హందులిల్లాహ్ - సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే. మేము ఆయనను ప్రశంశిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము. మనలోని ప్రతి చెడు మరియు దుష్ట పనులనుండి ఆయన శరణు వేడుకుంటాము. అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ సన్మార్గం నుండి తప్పించలేరు మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలివేసిన వారికి మరెవ్వరూ దారిచూపలేరు. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యుడు లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ము'హమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని.


🔷🔷 ఇస్లాం అంటే ఏమిటి ? 🔷🔷


'ఇస్లాం' అనేది మతము కాదు. ఇది ఒక జీవనవిధానం. మానవాళి కోసం సృష్టికర్త అయిన దైవం పంపించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి జీవనవిధానం. నిజదేవుడు ఒక్కడే అని నమ్మి, ఆయనను మాత్రమే ఆరాధించడం అనేది ఇస్లాంలో అత్యంత ముఖ్యాంశం.


ఇస్లాం ధర్మం ఒక సహజమైన మరియు సంపూర్ణమైన జీవనవిధానం. సర్వలోకాల సృష్టికర్తతో మరియు ఆయన సృష్టితో తమసంబంధం ఎలా ఉండాలనే ముఖ్యాంశంపై తగిన సావధానత చూపాలని మనల్ని ప్రోత్సహిస్తున్నది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ఆమోదించిన మంచిపనులు చేయడంలోనే ఆత్మలకు నిజమైన సంతోషం మరియు శాంతి లభిస్తుందని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఆ మంచిపనులు స్వంతానికీ మరియు సమాజానికీ ప్రయోజనకరమైనవై ఉంటాయి.


ఇస్లాం ధర్మంయొక్క ఔన్నత్యం ఏమిటంటే, ఒకవ్యక్తి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అతడు ఈ ప్రపంచంలో నుండి వెళ్ళిపోయేవరకు, ఏమిచెయ్యాలి, ఏమిచెయ్యకూడదు అనేటటువంటి ప్రతివిషయాన్ని క్షుణ్ణంగా చర్చించినటువంటి ధర్మము ఇస్లాం.


ఒకసారి మనం ప్రపంచంలో ఉండే మతాలను పరిశీలిస్తే, అందులో ప్రధానమైనటువంటి చాలా విషయాల ప్రస్తావన మనకు కనిపించదు. కానీ ఇస్లాంధర్మంలో, ఒకశిశువు పుట్టినప్పటి నుండి అతని నామకరణం ఎలాచెయ్యాలి, అతనికి ఎలాంటి విద్యను నేర్పించాలి, ఆ వ్యక్తికి ఎలాంటి సంస్కరణను నేర్పించాలి, ఆ వ్యక్తి వివాహం ఎలాచెయ్యాలి మరియు ఎలాంటి వ్యక్తితో చెయ్యాలి, చెడు విషయాల జోలికి పోకుండా జీవితాన్ని ఎలాగడపాలి, చివరకు ఆ వ్యక్తి మరణించిన తరువాత ఆ శవాన్ని ఖననం చేసేవరకూ ప్రతి విషయాన్నీ ఇస్లాం ధర్మం బోధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే; ఒక మనిషి పుట్టుకనుండి మరణంవరకు ఏమిచెయ్యాలి, ఏమిచెయ్యకూడదు, ఎలా జీవితం గడపాలి అనేటటువంటి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా చర్చించినటువంటి ధర్మం ఈ భూమండలంపై ఏదైనా ఉందంటే అదికేవలం ఇస్లాం మాత్రమే.


ఇస్లాం ధర్మం, మనిషి యొక్క వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఒక వ్యక్తి మార్గదర్శకం వహిస్తుంది.


ఇస్లాం ధర్మం, నైతిక విలువలను మరియు జీవన శైలిని సూచించే పేరు కలిగున్న ఒక సంపూర్ణ ఏకైకధర్మం.


ప్రపంచంలోని మతాలన్నింటినీ ఒకసారి పరిశీలించండి. క్రీస్తు ప్రవక్త అనుయాయులు తమ మతానికి తమ ప్రవక్త పేరే పెట్టుకున్నారు. సింధూ నదీ తీరాన ఆవిర్భవించిన మతం సింధూ లేక హిందూమతంగా ప్రఖ్యాతిగాంచింది. యూదుల్లోని ఒక ప్రత్యేక తెగ యహూదా మూలంగా యూద మతానికి ఆ పేరు వచ్చింది. గౌతమ బుద్ధుడు స్థాపించిన మతం బౌద్ధమతం అయింది. ఈ విధంగా ప్రపంచంలోని ఇతర మతాలన్నీ కూడా వాటిని స్థాపించినవారి పేర్లతోనో లేక అవి ఆవిర్భవించిన ప్రాంతం, తెగల పేర్లతోనో నామకరణం చేయబడ్డాయి. కాని ఇస్లాం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఒక సహజమైన పదంతో నామకరణం చేయబడింది.


'ఇస్లాం' అనేటటువంటి పదము అరబీలోని 'సలాం' మరియు 'సిల్మ్' అనే రెండు మూలపదాల నుండి ఏర్పడింది. 


'సలాం' అంటే 'శాంతి' మరియు 'సిల్మ్' అంటే 'సమర్పణ' అని అర్థం.


ఎవరైతే తన ఇష్టాన్ని పక్కనపెట్టి దైవ ఇష్టానికై తనకు తాను సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందడాన్నే అరబీలో 'ఇస్లాం' అని అంటారు. ఈ విధానాన్ని పాటించేటటువంటి వ్యక్తిని అరబీలో 'ముస్లిం {దైవవిధేయుడు)' అని అంటారు.


💎 "నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం...." {ఖుర్ఆన్3:19}.


ఇస్లాం ధర్మం కొత్త ధర్మమేమీ కాదు. ప్రవక్తలందరూ, తమతమ కాలాల్లో, తమతమ జాతులకు బోధపరచిన ధర్మమే ఇది. కాకపోతే అంతిమ దైవప్రవక్త ము'హమ్మద్ {సల్లం} ద్వారా ఇది మానవాళికి సంపూర్ణంగా అందజేయబడింది. మహాప్రవక్త {సల్లం} తెలిపినట్లుగానే మనం ఈ ధర్మాన్ని పూర్తిగా నమ్మి నడుచుకోవాలి. తౌహీద్ {దేవుని ఏకత్వం}, రిసాలత్ {దైవదౌత్యం}, ఆఖిరత్ {పరలోకం}పై దృఢవిశ్వాసం కలిగి ఉండాలి. అల్లాహ్ ఒక్కడే అని కేవలం నమ్మినంతమాత్రాన లేక కొన్ని మంచిపనులు చేసుకున్నంత మాత్రాన మన జీవితంలో సంపూర్ణ ఇస్లాంరాదు. దానివల్ల పరలోక సాఫల్యం కూడా సిద్ధించదు. ఇస్లాం అన్నా, ఈమాన్ అన్నా, జీవనధర్మం అన్నా పూర్తిభావం ఏమిటంటే - అల్లాహ్ ఒక్కడేనని నమ్మాలి. కేవలం ఆయన్నే ఆరాధించాలి, ము'హమ్మద్ {సల్లం} సమేతంగా దైవప్రవక్తలందరినీ విశ్వసించాలి. మహాప్రవక్త ము'హమ్మద్ {సల్లం}తో దైవదౌత్యం పరిసమాప్తమయిందన్న విషయాన్ని మనసారా అంగీకరించాలి. ఈ విశ్వాసాలతో పాటు ఖుర్ఆన్ {మరియు} హదీసుల ప్రకారం సదాచరణలను శ్రద్ధగా అవలంబించాలి. ఇదే ఇస్లాం ధర్మం. ఈ ధర్మం తప్ప మరొక ధర్మం ఏదీ దైవసమక్షంలో స్వీకారయోగ్యం కాదు. ఈ మార్గాన్ని తప్ప మరోమార్గాన్ని అవలంబించినవాడు పరలోకంలో విఫలుడవుతాడు, నష్టపోతాడు.


💎 "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరోధర్మాన్ని అన్వేషిస్తే అతనిధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు." {ఖుర్ఆన్ 3:85}.


ఇస్లాం ద్వారానే, అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ కి విధేయత చూపడం ద్వారానే ఇహలోకంలోనూ మరియు మరణానంతరం పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు.


అల్లాహ్ {సృష్టికర్త} అంటే ఎవరు ?:-


"అల్లాహ్" అంటే మానవుల ఆరాధ్యదైవం. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఎవరి అవసరం లేనివాడు. ఆయనకు సంతానంలేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూలేరు. విశ్వమంతటినీ సృష్టించింది ఆయనే. యావత్ ప్రపంచంపై ఆయన అధికారం ఉంది. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. ఆయన నిత్యం ఉంటాడు. సృష్టిరాశుల జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన చేయదలచుకున్న దానిని ఆపేవాడేవడూ లేడు. ఆయన ఆపదలచుకున్న దానిని చేసేవాడు కూడా ఎవడూలేడు.


ఆయన తినడు, త్రాగడు; ఆయనకు నిద్రలేదు, కునుకూరాదు. విశ్వవ్యవస్థను నడిపిస్తూ ఆయన అలసిపోడు. మనసుల్లో దాగిఉండే రహస్యాలు సైతం ఆయనకు తెలుసు. భూమ్యాకాశాలలో ఏదీ ఆయనకు గోప్యంగా లేదు. ఆయన జ్ఞానం విశ్వమంతా వ్యాపించిఉంది. ప్రతివిషయం ఆయనకు తెలుస్తూ ఉంటుంది.


🔰 అల్లాహ్ {సృష్టికర్త} గురించి In Sha Allah రేపటిభాగంలో మరింత వివరంగా తెలుసుకుందాం.



Saturday, December 19, 2020

బైబిల్ ప్రకారం ఎవనిని ప్రార్ధించాలి దేవుడి నా లేక దాసుడి నా?

బైబిల్ ప్రకారం ఎవనిని ప్రార్ధించాలి దేవుడి నా లేక దాసుడి నా? (ఏసు నా లేక యహోవానా)?


పాత నిబంధన కాలంలో ఎవరిని ప్రార్ధించారు?

అబ్రహాము ప్రవక్త  ఎవరిని ప్రార్ధించారు ?

(ఆదికాండము; 21:33) "అబ్రహాము బెయేర్షేబాలో ఒక పిచులవృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యహోవా పేరిట ప్రార్ధన చేసెను"

ఈ పై వాక్యంలోని సంఘటన పాత నిబంధనకు పూర్వం సంభవించింది. ఆనాడు అబ్రహాము యహోవానే ప్రార్ధించారు. ఆ తరువాత పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, పరిశుద్ధులు మరియు సాధారణ విశ్వాసులు ఎవనిని ప్రార్ధించేవారు? అన్న ప్రశ్నకు సమాధానంగా క్రింద మచ్చుకు కొన్ని వాక్యాలు గమనించగలరు. 

యోనా ప్రవక్త  ఎవరిని ప్రార్ధించారు?

(యోనా; 2:10) "యోనా ప్రార్ధన, పశ్చాత్తాపాలకు యహోవా అంగీకరించి మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కి వేసెను."

మోషే ప్రవక్త  ఎవరిని ప్రార్ధించారు?

(నిర్గమ కాండము; 10:16-19) "(ఫరో) - ఈ చావు మాత్రం తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకోమనగా అతడు (మోషే) - ఫరో యోద్దనుండి బయలు వెళ్లి యహోవాను వేడుకొనెను."

పాత నిబంధన కాలంలో అబ్రాహాము, యోనా, మోషే లాంటి ప్రవక్తలు పరలోకమందున్న యహోవానే ప్రార్ధించినట్లు స్పష్టంగా బోధపడుతుంది. 


క్రొత్త నిబంధన కాలంలో ఎవనిని ప్రార్ధించారు?

యేసు ఎవరిని ప్రార్ధించారు?

(మార్కు; 14:34-38) అప్పుడాయన యేసు - నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముల్లో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉంది మెలుకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తోలగిపోవలేనని ప్రార్ధించుచూ - నాయనా! తండ్రీ! నీకు సమస్తమూ సాధ్యము; ఈ గిన్నె (శిలువమరణము) నా యోద్దనుండి తొలగించుము.

ఈ వాక్యం ప్రకారం యేసు స్వయంగానూ ఆది నుండి అందరూ ప్రార్ధిస్తూ వచ్చిన ఆ యహోవానే ప్రార్ధించినట్లు  స్పష్టంగా కనిపిస్తుంది. 

అంటే యేసు బైబిల్ ప్రకారం ప్రార్ధనలు చేసిన దాసుడు అయితే యహోవా ప్రార్ధనలు అందుకున్న దేవుడు


యేసు ఎవరిని ప్రార్ధించమని శిష్యులను ఆజ్ఞాపించారు? 

(లూకా; 11:1-4) ఆయన (యేసు) యొకచోట ప్రార్ధన చేయుచుండెను. ప్రార్ధన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా! యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్ధన చేయనేర్పుమని ఆయన నడిగెను. అందుకాయన - మీరు ప్రార్ధన చేయునప్పుడు - తండ్రీ! నీ నామము పరుశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము. మేము మా కచ్చి యున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేకుము, అని పలుకుడని వారితో చెప్పెను." 

తద్వారా రక్షణ పొందాలనుకుంటున్న వారికి యేసు కొన్ని మౌలిక అంశాలు వివరించారు. వాటిలో మొదటిది ప్రార్ధన యహోవాకే చేయాలని స్పష్టముగా చెబుతున్నారు. రెండవది యహోవా నామము పరిశుద్ధపరచబడటం అనగా యహోవాతో పాటు మరొకరిని లేక మరి కొందరిని కూడా ఆయనకు సహవర్తులుగా భావిస్తూ యహోవాను వేడుకోమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నారు.

ఎందుకంటే ఈ పనులు చేసే శక్తి కేవలం ఒక్క యహోవాకే ఉన్నదనే విశ్వాసము పూర్వపు వారి వాలే యేసు కూడా కలిగి ఉన్నారు. అదే విశ్వాసాన్ని కలిగి, ఆయననే ప్రార్ధిస్తూ ఉండమని తన అనుయాయులకు కూడా ఆజ్ఞాపిస్తున్నారు.


ఎవనిని ప్రార్ధించమని యేసు ఆజ్ఞాపిస్తున్నారు? 

(మత్తయి; 6:6) "నీవు ప్రార్ధన చేయునప్పుడు గదిలోనికి వెళ్లి గడియ వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి (యహోవా) ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి (యహోవా) నీకు ప్రతిఫలమిచ్చును."

ఈ వాక్యం ద్వారా తండ్రి అయిన యహోవానే ప్రార్ధించమని యేసు తన శిష్యులను ఆజ్ఞాపిస్తున్న వైనం స్పష్టంగా గోచరిస్తుంది. యేసును, పరిశుద్ధాత్మలను ప్రార్ధించడం, యేసు ఆజ్ఞను ధిక్కరించడం కాదా? కనుక యేసు ఆజ్ఞ ప్రకారం కేవలం యహోవానే ప్రార్ధించాలి. నిజమైన యేసు అనుచరుడు తన ప్రార్ధనల ఫలప్రదాతగా యహోవానే గుర్తించాలని పై వాక్యం ద్వారా అర్ధం అవుతుంది.


యేసు అనంతరం శిష్యులు ఎవనిని ఆరాధించారు?

(అపోస్తులు; 12:5) "పేతురు చెరశాలలో ఉంచబడెను, సంఘమైతే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి (యహోవాకి) ప్రార్ధన చేయుచుండెను." 

(1వ పేతురు; 3:12) "ప్రభువు (యహోవా) కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్ధనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది." 

(యాకోబు; 1:5) "మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతను దేవుని (యహోవాను) అడుగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును."  

పైన పేర్కొన్న రెండవ, మూడవ వాక్యాలు యేసు ప్రత్యక్ష శిష్యులు స్వయంగా పేర్కొన్నవి. ముఖ్యంగా యేసు వారసత్వాన్ని పేతురు చెరసాలలో వేయబడినప్పుడు ఆదిమసంఘస్తులు యేసును గాని, పరిశుద్ధాత్మనుగాని ప్రార్ధించక యహోవాను మాత్రమే ప్రార్ధించారని అత్యంత గమనించవలసిన విషయం. అలాగే పేతురు - కీర్తనలు;34:12-16 వాక్యాలలో నీతిమంతుల ప్రార్ధన యహోవా వింటాడన్న విషయాన్ని పైన పేర్కొన్న రెండవ వచనంలో ఊటంకిస్తున్నాడు. ఇంకా యేసు ప్రత్యక్ష శిష్యుడైన యాకూబు సైతం మీలో ఎవనికైనను జ్ఞానం కొదవైతే యహోవా దేవుని అడగమన్నాడే గాని యేసు, పరిశుద్ధాత్మలను అడగమనలేదు.


పౌలు వ్యక్తిగతంగా ఎవనిని ప్రార్ధించెను?  

(ఫిలిప్పీయులకు; 1:6) "నేను చేయు ప్రతి ప్రార్ధనలో ఎల్లప్పుడును సంతోషంతో ప్రార్ధన చేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి (యహోవాకు) కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను." 


పౌలు అతని శిష్యులు ప్రార్ధించింది ఎవనిని?

(అపోస్తుల కా 16:25)  "అయితే మధ్య రాత్రి వేళ పౌలును సీలయు దేవునికి (యహోవా) ప్రార్ధించుచు కీర్తనలు పాడుచుండిరి." 


ఎవనిని ప్రార్ధించమని పౌలు ఆదేశిస్తున్నాడు?

(ఫిలిప్పీయులకు; 4:6)  "దేనిని గురించియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి (యహోవాకు) తెలియజేయుడి." 

నేటి మన అధిక శాతం క్రైస్తవుల అపోహ ఏమిటంటే యేసుకు పూర్వపు విశ్వాసులు తమ అవసరాల నిమిత్తము యహోవాను ప్రార్ధిస్తూ ఉండేవారు. కాని యేసు అనంతరం యేసును ప్రార్దించారన్నది. కాని పై వాక్యాల ప్రకారం యేసు అనంతరం కూడా యేసు ప్రత్యక్ష శిష్యులు, పౌలు సైతం యహోవానే ప్రార్ధించైన, మరియు ప్రార్ధించమని చెప్పిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటప్పుడు యేసును దేవునిగా భావిస్తూ, ఆయనను ప్రార్ధించటం బైబిల్ గ్రంధాన్ని ధిక్కరించడం కాదా!?


సర్వ శక్తిమంతుడు (Omni  Potent) ఎవడు?

మేలు-కీడు చేయగలిగే సమర్ధుడు ఎవడు? అని బైబిల్ గ్రంధాన్ని పరిశీలిస్తే ఈ క్రింది వాక్యాల ద్వారా లభించే సమాధానం ఏమిటో గమనించగలరు.

(నిర్గమ కాండము; 4:11)  "యహోవా - మానవులకు నోరు ఇచ్చినవాడు ఎవడు? మూగవానినే గాని చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యహోవానైన నేనే గదా!?"

(ద్వితియోప దేశ కాండం; 32:39)  "ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మ్రుతినొందించు వాడను, బ్రతికించువాడనూ నేనే, గాయపరచువాడనూ స్వస్థపరచువాడనూ నేనే. నా చేతిలో నుండి విడిపించు వాడెవరునూ లేడు." 

(యషయా: 45:7)  "నేనే వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధాన కర్తను, కీడును కలుగచేయువాడనూ నేనే. యహోవా అను నేనే  వీటన్నింటినీ కలుగజేయుచున్నాను." 

పై వాక్యాల ద్వారా ఒక్క యహోవా మాత్రమే -

మృతి నొందించువాడు - బ్రతికించు వాడు 

గాయ పరచు వాడు - గాయమును కట్టువాడు 

మేలు కలిగించువాడు - కీడు కలిగించు వాడు 

లేవనెత్తు వాడు - పడద్రోయువాడు అని ప్రకటించబడుతుంది. 


అందుకే యేసు సైతం దేవుడైన యహోవాను ఉద్దేశించి సమస్తమూ నీకే  సాధ్యము అని ప్రకటిస్తున్నారు

"నాయనా! తండ్రీ!! నీకు సమస్తమూ (మేలు-కీడు చేయుట) సాధ్యము అని మార్కు( 14:36) వచనంలో ప్రకటిస్తున్నారు. 

తను స్వయంగా కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి యేసు "నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్లి తలుపు వేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును." అని మత్తయి; 6:6లో ఆదేశిస్తున్నారు. 

ఈ వాక్యంలో 'నీ తండ్రి (యహోవా) నీకు ప్రతిఫలమిస్తాడన్నది అత్యంత గమనించవలసిన విషయం. ఇంకా యేసు ప్రత్యక్ష శిష్యుడైన యాకోబు - "ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించు వాడు. ఆయనే రక్షించుటకును, నశింపజేయుటకును శక్తి మంతుడైయున్నాడు; పరునికి తీర్పుతీరుచుటకు నీవేపాటి వాడవు? అని యాకోబు; 4:7వ వచనంలో ప్రకటిస్తున్నాడు. 

దీని ప్రకారం పాత నిబంధనకాలంలోనే కాక, క్రొత్త నిబంధన కాలంలో మరియు యేసు అనంతరం ఆదిమ అపోస్తలులు మరియు పౌలు ప్రకటించిన సువార్తా ప్రార్ధనా కాలంలోనూ కేవలం ఒక్క యహోవాయే సర్వ శక్తి గల (OMNI POTENT) దేవునిగా పరిగణించ బడ్డాడని తెలుస్తుంది. అటువంటప్పుడు యేసు, పరిశుద్ధాత్మలను సహాయం కొరకు వేడుకోవడం వాక్య విరుద్ధం కాదా!?


సర్వజ్ఞుడు (Omni  Scient) ఎవడు?      

సర్వ ప్రాణుల సకల అవసరాల జ్ఞానం ఎవనికి ఉంది? అని ప్రశ్నిస్తే బైబిల్ గ్రంధం ఎవని పేరు ప్రకటిస్తుందో ఈ క్రింది వాక్యాలు గమనించగలరు.

(ద్వితియోప; 29:29)  "రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును." 

(1వ సమూయేలు; 2:3)  "యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించుచున్నాడు.........."

(సామెతలు; 21:2) "యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు" 

పై వాక్యం ప్రకారం సర్వజ్ఞుడు (Omni  Scient) ఒక్క యహోవా మాత్రమే అని బైబిల్ ఉద్ఘాటిస్తుంది. అందుకే ఒక్క యహోవా తప్ప ఎవడూ హృదయాల రహస్యాలు ఎరగడని వాక్యం సాక్ష్యమిస్తుంది.

(మత్తయి; 24:36)  "అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి  మాత్రమే (ఎరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడై నను (యేసుకూడా) ఎరుగును."


దాసుడు ఎవరు - యజమాని ఎవరు ?

యోహాను సువార్త 13:16 - దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Verily, verily I say unto you, the servant is not greater than his lord, neither he that is sent greater than he that sent him.

యోహాను సువార్త 15:20 - దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి 

ఈ వాక్యాల ప్రకారం దాసుడు యేసు అని యజమాని పరలోకమందున్న యహోవా అని అర్ధం అవుతుంది 


యహోవా అందరికి తండ్రి (సంరక్షకుడు) - అందరికి దేవుడు 

యహోవా అందరికి తండ్రి, అందరికి దేవుడు అని యేసువారు  ప్రకటించాడు 

యోహాను సువార్త 20:17 అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. Jesus said unto her, "Touch Me not, for I am not yet ascended to My Father; but go to My brethren and say unto them, `I ascend unto My Father and your Father, and to My God and your God.'"

పై వాక్యాలలో (యోహాను సువార్త 20:17 ) యేసు వారి మాటల  ప్రకారం యహోవా మనకు తండ్రియే అలాగే  యేసువారికి కూడా తండ్రియే,  మనకు దేవుడే అలాగే యేసువారికి కూడా దేవుడే 

యేసు తనను తానూ దాసుని గా ప్రకటించుకున్నాడు, పరలోక మందున్న యహోవానే దేవుడి గా ప్రకటించాడు, యహోవానే ఆరాధించారు,  కష్టకాలంలో సహాయం కోసం యహోవానే ప్రార్ధించారు, ప్రజలకు యహోవా సువార్త చేస్తూ గలిలయ వీధుల్లో తిరిగారు,  అంటే బైబిల్ గ్రంధం ప్రకారం దేవుడు పరలోకమందున్న యహోవా అని ఏసు దేవుడు పంపిన ప్రవక్త అని స్పష్టంగా అర్ధం అవుతుంది,  

Thursday, October 22, 2015

మహమ్మద్ (స) బైబిల్ గ్రంధం లో

------------------------------------------------------------------------
ముహమ్మద్ (స.అ. సం)  బైబిల్ గ్రంధం లో 
------------------------------------------------------------------------
(అల్ అహ్ జాబ్; 33:40)

(ఓ మానవులారా!) ముహమ్మద్‌ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్‌ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్‌యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.

(ఖుర్'ఆన్; 33 : 41)  "ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను (ఏకాగ్రతతో) అత్యధికంగా స్మరించండి."

(ఖుర్'ఆన్; 33:42)  "మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన పవిత్రతను కొని యాడుతూ ఉండండి."

(ఖుర్'ఆన్; 33:43)  "ఆయన మీపై ఆశీర్వాదాలు ('సలాత్‌) పంపుతూ ఉంటాడు మరియు ఆయన దూతలు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకు రావటానికి (ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు). మరియు ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణాప్రదాత."

(ఖుర్'ఆన్; 33:44)  "వారు ఆయనను కలుసుకునే రోజున వారికి: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది. మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిధ్ధపరచి ఉంచాడు."

(ఖుర్'ఆన్; 33:45)  "ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేము, నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము!"

(ఖుర్'ఆన్; 33:46) "మరియు ఆయన అనుమతితో, అల్లాహ్‌ వైపునకు పిలిచేవానిగా మరియు ప్రకాశించే దీపంగానూ (చేసి పంపాము)!"

(ఖుర్'ఆన్; 33:47)  "మరియు నిశ్చయంగా, వారి మీద అల్లాహ్‌ యొక్క గొప్ప అనుగ్రహం ఉందనే శుభవార్తను విశ్వాసులకు ఇవ్వు."

(ఖుర్'ఆన్; 33:48)  "మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్యపెట్టకు మరియు కేవలం అల్లాహ్‌నే నమ్ముకో. మరియు కార్యకర్తగా కేవలం అల్లాహ్‌యే చాలు!"]

---------------------------------------------------------------------------
అక్షరములు తెలియని ప్రవక్త 
---------------------------------------------------------------------------
యషయ (29:11) దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును.

యషయ (29:12) మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.

అల్ అలఖ్ 96:1 చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!

96:2 ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.

96:3 చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.

96:4 ఆయన కలం ద్వారా నేర్పాడు.

96:5 మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.

96:6 అలాకాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.

అల్ అరాఫ్  7:157  "ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్య రాస్యుడైన ఈ ప్రవక్తను అనుస రిస్తారో!ఎవరి ప్రస్తావన వారి వద్దవున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మ తంచేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్బంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు.

7:158  (ఓ ము'హమ్మద్!) వారితో ఇలా అను: “మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరివైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుడు, నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుస రించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు!”
---------------------------------------------------------------------------
మోషే వంటి  ప్రవక్త 
---------------------------------------------------------------------------
16 ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.

17 ​మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;

18 ​వారి సహో దరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.

19 అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.

20 అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.

21 ​మరియు ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనిన యెడల,

22 ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయిన యెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడ లను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయ పడవద్దు.

ఈ వాఖ్యములలో ముఖ్యం గా  అయిదు (5 లేఖనాలు) విషయాలు వున్నాయి
1). వారి సహో దరులలో
2). నీవంటి ప్రవక్త
3). అతని నోట నా మాటల నుంచుదును
4). నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.
5). అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.  

1). వారి సహోదరులలో
ఆది కాండము 25:12
ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మా యేలు వంశావళి యిదే.
13 ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము
14 మిష్మా దూమానమశ్శా
15 హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
16 ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.
17 ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
18 వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివ సించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను.
19 అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.

ఆది కాండము 16:3 కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.
16:4 అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను.
16:10 మరియు యెహోవా దూతనీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
16:11 మరియు యెహోవా దూతఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;

17: 20 ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;
21:18 నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
21:19 మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.
21:20 దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.
21 అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
21:22 ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక.
23 నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను.
21:24 అందుకు అబ్రాహాముప్రమాణము చేసెదననెను.

12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
12:3 నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను.

అందుకే ముస్లిం లు ధరూదే ఇబ్రాహీం చదువుతారు

2). నీవంటి ప్రవక్త

మోషే వంటి ప్రవక్త మహమ్మద్ (స) మాత్రమె

3). అతని నోట నా మాటల నుంచుదును


నజ్మ్ సుర 53:2 అస్తమించే నక్షత్రం సాక్షిగా మీ సహచరుడు (ము'హమ్మద్‌), మార్గ భ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.
53:3 మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
53:4 అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వ'హీ) మాత్రమే.
53:5 అది అతనికి మహా బలవంతుడు (జిబ్రీల్‌) నేర్పాడు.

4). నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.
5). అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.
---------------------------------------------------------------------------
  ఆ ప్రవక్త ఎవరు ? 
---------------------------------------------------------------------------
యాచకులు లేవియులు యోహాను ను
యోహాను 1:19 నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.
20 అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను.
21 కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.
22 నీవు ఆ ప్రవక్తవా అని అడుగగాకానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి
23 అందు కతడుప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.
24 పంపబడినవారు పరిసయ్యులకు చెందిన వారు
25 వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా
26 యోహాను నేను నీళ్లలో బాప్తి స్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;
27 మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.

యోహాను ఎవరు ...యేసు సాక్ష్యము
మత్తయి 11:14 ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే. విను టకు చెవులుగలవాడు వినుగాక.

క్రీస్తు ఎవరు ...యేసు సాక్ష్యము ........యోహాను 4:25
ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక
5 యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.
6 అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.
7 సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.
8 ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.
9 ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏల యనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
10 అందుకు యేసునీవు దేవుని వరమునునాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెన
11 అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?
12 తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.
13 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;
14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
15 ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
16 యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.
17 ఆ స్త్రీనాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతొ నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;
18 నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.
19 అప్పుడా స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.
20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
21 అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;
22 మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
23 అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరు చ
24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
25 ఆ స్త్రీ ఆయనతోక్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా
26 యేసునీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.

---------------------------------------------------------------------------
  ఆధారణ కర్త ఎవరు ? 
---------------------------------------------------------------------------
యోహాను 14:16,
యోహాను 14:26
యోహాను 15:26,
యోహాను 16:7-14,

యోహాను 14:1 మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి.
2 నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
3 నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
4 నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.
5 అందుకు తోమా ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా
6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
8 అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా
9 యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.
11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
12 నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
13 మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును.
14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.
16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండు టకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును.
17 లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.
18 మిమ్మును అనాథ లనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు;
19 అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.
20 నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.
21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.
22 ఇస్కరియోతు కాని యూదా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా
23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.
24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.
25 నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.
26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
27 శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
28 నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లు చున్నానని మీరు సంతోషింతురు.
29 ఈ సంగతి సంభ వించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను.
30 ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు.
31 అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయు చున్నాను. లెండి, యిక్కడనుండి వెళ్లుదము.

యోహాను 15:26,
26 తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును.
27 మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.

యోహాను 16:7-,
7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దక
8 ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
9 లోకులు నాయందు విశ్వాస ముంచలేదు గనుక పాపమును గూర్చియు,
10 నేనుతండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు,
11 ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన జేయును.
12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు.
13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభ
14 ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.
15 తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.
16 కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.
17 కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పు కొనిరి.
18 కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతిమనకు తెలియదని చెప్పుకొనిరి.

ఆదరణ కర్త ,పరిశుద్ధాత్మ ఒకటి కాదు
లూక 3:22
21 ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి
22 పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడునీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
23 యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి,

యోహాను 1:32
32 మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.
33 నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడునీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.

సత్య స్వరూపి అయిన ఆత్మ
యోహాను 16:13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును;

సమాదానం :
1వ యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
2 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;
3 యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.

యోహాను14:16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండు టకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును.
(ఆదరణకర్త = ఉత్తరవాది అనగా సత్యస్వరూపి యగు ఆత్మ)
1వ యోహాను 2:1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండు టకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.

------------------------------------------------------------------------
మహమ్మద్ (స) పేరు హీబ్రు బైబిల్ గ్రంధం లో 
------------------------------------------------------------------------

Glycyrrrhiza 5:16 של פיו . בנות ירושלם , זה המאהב שלי , חבר שלי .

పరమగీతంలు 5:16 అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.
15 అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము
11 అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణ ములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.

10 నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
11 అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణ ములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
12 అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.
13 అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
14 అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.

http://www.freetranslation.com/
http://worldlingo.com/en/products_servi … lator.html

------------------------------------------------------------------------
చివర గా బైబిల్ హెచ్చరిక 
------------------------------------------------------------------------
దితియోపదేశ కాండము 18:19 అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.
అపోస్తులు కార్యములు 3: 22
22 మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలెను.
23 ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.
24 మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
25 ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.
26 దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

బఖరా 2:41,42
2:38 మేము (అల్లాహ్) ఇలా అన్నాము: “మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి.” ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
2:39 కాని, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిరస్కరిస్తారో మరియు మా సూచన (అయాత్)లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
2:40 ఓ ఇస్రాయీ‘ల్ సంతతివారలారా! నేను మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేనూ మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను. మరియు మీరు నాకు మాత్రమే భయపడండి!
2:41 మరియు మీ వద్దనున్న వాటిని (తౌరాత్/ ఇంజీల్ లను) ధృవీకరిస్తూ నేను అవతరింప జేసిన దానిని (ఈ దివ్యఖుర్ఆన్ ను) విశ్వసించండి. మరియు దీనిని తిరస్కరించే వారిలో మీరు మొట్టమొదటి వారు కాకండి. మరియు అల్పలాభాలకు నా సూచన (ఆయాత్)లను అమ్మకండి. కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి.
2:42 మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి.

బుఖారి గ్రంధము 34:425 రెండవ రాకడ వుంది
బుఖారి గ్రంధము 55:658 ఖుర్'ఆన్  ప్రకారం జీవతం గడుపుతారు

ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) పై దైవ వాణి (వహీ) 

మొట్టమొదటి దైవ వాణి ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) పై గాబ్రియెలు దూత ద్వారా వచ్చింది.

(ఖుర్'ఆన్; 96: 1-5) లో మొదటి పదం ఇఖ్రా (పఠించు) అని వస్తుంది. 

ఆయన చదువు రాని వ్యక్తి కాబట్టి "నేను చదవలేను" అన్నారు. ఈ మొదటి వాణి యషయా; 26:12లో ప్రవచించబడి ఉంది.

"మరియు నీవు దయచేసి దీనిని చదువమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును. అతడు - అక్షరములు నాకు తెలియవనును."

ప్రేరణా విధానం ప్రకారం ఖుర్'ఆన్ లో వరుస క్రమం ఉండదు. మొదటి ప్రేరణ మొదటి పేజిలో, అంతిమ ప్రేరణ అంతిమ పేజీల్లో వుండదు.  (కాని వాటికి ప్రేరణా ప్రకారం నెంబర్లు వేరుగా ఇవ్వబడి ఉంటాయి. - అ.క.)

ఈ ప్రేరణలన్నవి పరంపరలుగా వచ్చాయి. వాటిని అల్లాహ్ అనుజ్ఞ ప్రకారం ఓ క్రమంలో పెట్టడం జరిగింది. (దానిక్కూడా ఇప్పుడు నెంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. అ. క) ఇవి కూడా యషయా 28: 10-11లో ప్రవచించబడి ఉన్నాయి.

"ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట, కొంత అచ్చట. అని చెప్పుచున్నాడని వారనుకొందురు."

నిజమే. అలసినవానికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవారు నత్తివారి పెదవుల చేతను, అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నారు.

ఇక్కడ అన్య భాష అంటే హిబ్రు, అరామిక్ కాదు, కాని  అది అరబ్బీ భాష.
యావత్ ప్రపంచంలో ముస్లిములు అందరూ అరబ్బీ భాష వాడుతుంటారు. దేవుణ్ణి స్తుతించినా, ప్రార్ధించినా, హజ్ యాత్రలోనూ ఒకరినొకరు సంబోధించి శుభాకాంక్షలు ఇచ్చుకున్నా అరబ్బీ భాషలోనే. ఈ భాషాపరమైన ఐక్యతను గురించి జెఫన్యా ప్రవచనం పలికేవున్నాడు. (జెఫన్యా; 3:9)



















Saturday, October 17, 2015

వేదాలలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివ సల్లం)

అవతారం అంటే?

అవతారం  అన్న పదానికి అర్ధం భూమండలానికి రావడం. ఈశ్వరుని అవతారం అంటే అర్ధం ఒక మహాత్ముడు ప్రజలందరికీ సందేశం అందించడానికి జన్మించడం. దేవుడు సమస్తాన్ని ఆవరించి ఉన్నాడు. దేవుడు ఒక ప్రదేశంలో ఉన్నాడని చెప్పడం, లేదా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడని చెప్పడం సర్వాంతర్యామిని పరిమితం చేయడం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో దేవుని కాంతి ప్రత్యేకంగా ప్రకాశిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అది దాగి ఉండవచ్చు. సూర్యుని కాంతి కొన్ని ప్రదేశాల్లో ప్రకాశించినట్లే ఇది కూడా. దేవుడు ఉండేది ఏడవ ఆకాశంలో. ఇది మన పై ఉన్న అన్ని ఆకాశాలపైన ఉన్న ఆకాశం. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేవి ఉండవు. అక్కడ దేవుని కాంతి ముందు సుర్ర్యచంద్రనక్షత్రాల కాటులు వెలవెల బోతాయి. సూర్యుని కాంతి గ్రహాలను ప్రకాశించేలా చేస్తుంది. అలాగే దేవుని కాంతి సమస్తాన్ని ప్రకాశించేలా చేస్తుంది. దేవుని ప్రసన్నత పొందిన ఒక మహాత్ముడు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి భూమిపై జన్మిస్తాడు. ఇక్కడి ప్రజలకు జన్మిస్తాడు, జ్ఞాన సంపన్నుడై వస్తాడు, అతను దేవుని కాంతిని చూడగలుగుతాడు, విద్యాభ్యాసం లేకుండానే జ్ఞానాన్ని పొందగలుగుతాడు, ఈశ్వరుని అవతారం అన్న పడసంబందంలో 'ని' అన్న అక్షరం దేవునికి అతనికి ఉన్న సంబందాన్నితెలుపుతుంది . ఆ మహాత్ముడు దేవునికి సంబంధించిన వాడు. ఆయన దేవుని విధేయుడు. ఋగ్వేదంలో అలాంటి వ్యక్తిని 'కెన్' అని పిలవడం జరిగింది. కెన్ అన్న పదానికి అర్ధం దేవుని స్తుతించే వాడు. అరబ్బీ లో ముహమ్మద్ (స.అ.సం) అన్న పదానికి అర్ధం కూడా ఇదే. అయితే దేవుని స్తుతించే వారందరూ ముహమ్మద్ (స.అ.సం) అవుతారా? అన్న సందేహం కలుగవచ్చు. కాని అలా జరుగదు. ముహమ్మద్ (స.అ.సం) లేదా కెన్ అన్న పదం ప్రత్యేకమైనది. దేవుని ప్రత్యేకంగా స్తుతించేవారిని ఉద్దేశించినది. ఈ పదం ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఉద్దేశించినది. ఇది ఆ వ్యక్తి గుర్తింపును సూచించేది. హజ్రత్ ఆదమ్ (అ.స) కూడా దేవుని స్తుతించేవారే కాని ఆయన పేరు ముహమ్మద్ (స.అ.సం) కాదు. కాబట్టి దువునికి సంబంధించిన ప్రతి వ్యక్తి ,దేవుని స్తుతించే ప్రతి వ్యక్తి కెన్ కాలేడు. ఇక్కడ మనం  అవతారం గురించి మాట్లాడు తున్నాం. మనం ఆయన చరిత్ర గురించి చర్చించడం లేదు. లేదా మనం అవతారాల గురించి, ప్రవక్తల గురించి మాట్లాడడం లేదు. సంస్కృతంలో ఉన్న అవతార్ అన్న పదం ఇంగ్లీషులో ప్రవక్త అన్న పదం మాదిరిదే అన్న విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పదలిచాను. విభిన్న దేశాలకు భిన్న అవతారాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకే అవతారం అన్ని దేశాలకు మార్గదర్శనం చేయడం సాధ్యం కాదు. కాని చివరి అవతారం ప్రత్యేకమైనది. ఆయన అవతరించినప్పుడు ఆయన ధర్మం మిగిలిన ధర్మాల కన్నా ఉత్తమమైనదిగా మారుతుంది. ఇప్పుడు మనం చివరి అవతారం గురించిన కారణాల గురించి ఆలోచిద్దాం. (ఋగ్వేదం; 2:12:6, హిందూ ముస్లిం ఏక్తా మే సుందర్జీ పేజి; 26 -30)

అవతారాలకు కారణాలు 
  1. ప్రజలు ధర్మానికి దూరం కావడం, ప్రజలలో ధర్మం పట్ల ఆశక్తి లేకపోవడం. 
  2. స్వచ్చమైన ధర్మంలో మార్పులు చేర్పులు జరగడం. 
  3. మతం పేరుతొ మతానికి విరుద్ధంగా వ్యవహరించడం. 
  4. మతం పేరుతో మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం. 
  5. దైవదాసులను ఇబ్బందులకు, వేధింపులకు గురిచేయడం. 
  6. దౌర్జన్యాలు, పాపాలు పెరిగిపోవడం. 
  7. అరాచకం అలుముకోవడం, హింసాదౌర్జన్యాలు మితిమీరిపోవడం. 
  8. మతాన్ని వ్యక్తిగతానికి, కుటుంబానికి పరిమితం చేసుకోవడం. 
  9. దైవం ప్రసాదించిన వస్తు సంపదను దుర్వినియోగం చేయడం. 
  10. సాధువులు సంరక్షించడానికి, పాపులను తొలగించడానికి భూమిపైకి రావడం జరుగుతుంది. 
  11. మతం పతనమయ్యే పరిస్థితి తలెత్తినప్పుడు అవతారాలు భూమి పైకి రావడం జరుగింది. 
  12. హింసా, హత్యలు, దోపిడీలు అధికమైనప్పుడు అవతారాలు జన్మించడం జరిగింది. 
  13. యుగ ధర్మానికి అనుగుణంగా చోటుచేసుకొనే మార్పుల దృష్ట్యా మతంలో మార్పులకు అవతారాలు రావడం ధార్మిక నియమాలకు కొత్త రూపునివ్వడం జరిగింది. 
పైన పేర్కొన్న కారణాలు ఎదురైనప్పుడు అవతార పురుషులు జన్మించారు.

ప్రవక్త అంటే ఎవరు? 

మానవులను సృష్టించిన దేవుడు సృష్టించి వదిలి వేయక రుజుమార్గం చూపటానికి తన యొక్క ప్రవక్తల్ని ఈ మానవుల్లోనే పుట్టించాడు. వీరు తాము పుట్టిన జాతి యొక్క  భాషల్లోనే సంచరిస్తూ దేవుని యొక్క ఏకత్వమును చాటి చెప్పారు. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది న్యాయం ఏది అన్యాయం అనే విషయాలను తన జాతి ప్రజలకు తెలియ పరచారు. ఇలాంటి ప్రవక్తలను దేవుడు అన్ని జాతుల్లోనూ పుట్టించాడు. ఈ విషయాన్ని గురించి దేవుడు దివ్య ఖుర్'ఆన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు.

(ఖుర్'ఆన్ ; 35 : 24) "హెచ్చరిక చేసేవాడు రాని జాతి అంటూ ఏదీ లేదు.

(ఖుర్'ఆన్; 13 : 7) "ప్రతి యుగానికి ఒక మార్గదర్శకుడు ఉన్నాడు.

(ఖుర్'ఆన్; 13 : 38) "ప్రతి యుగానికి ఒక గ్రంధం ఉన్నది.

(ఖుర్'ఆన్; 16 : 36) "మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అల్లాహ్ ను ఆరాధించండి, ఇతర మిధ్యా దైవాలకు దూరంగా ఉండండి అని బోధ పరిచాము."

అయితే భాషా భేదం వలన జాతి భేదం వలన మనం వీరిని గ్రహించ లేక పోతున్నాము. 

ప్రవక్తలు అంటే ఒకే దేవుని గురించి బోధించే వారు. మంచి నడవడిక కలిగిన వారు. మరొకరికి సహాయ సహకారాలు అందించేవారు. ఆ దేవుని మార్గంలో ధన, మాన, ప్రాణాల నష్టానికి సిద్ధ పడేవారు. ఈ ప్రాపంచిక జీవితంలో లభించే విషయాల్ని ఆలోచించక, ఆ దేవుని మార్గంలో ఎదురయ్యే సమస్యల్ని లెక్క చెయ్యక సదా సన్మార్గం చూపుతూ శాంతి (ఇస్లాం) ను బోధించేవారు. వీరు ప్రతి జాతిలోనూ పుట్టి నాటి ఆ జాతి వేషభాషల్లో దైవ ధర్మాన్ని, దేవుని ఏకత్వాన్ని బోధించారు. భాష ఏదైనా వీరు బోధించిన ధర్మం మాత్రం ఒక్కటే. మరి ఇన్ని మతాలు ఎందుకు పుట్టుకొచ్చాయి?

ఎందుకంటే, దైవ ప్రవక్తల విషయంలో దైవానుగ్రహం వలన అనేక అద్భుతాలు ప్రవక్తల ద్వారా జరుగుతూ ఉండేవి. వీటి వలన విపరీత ఆకర్షణకు గురైన కొందరు ప్రజలు ప్రవక్తల బోధనలను విడిచి ప్రవక్తల తదనంతరం వీరినే దేవుళ్ళుగా భావించి, రాతి విగ్రహాలను మలచి షైతాన్ ప్రభావం వలన విగ్రహారాధనకు, వ్యక్తి ఆరాధనకు గురియై ప్రవక్తల బోధనలను, గ్రంధాలను తారుమారు చేసి అపమార్గానికి గురి అయ్యారు.

చివరి అవతార పురుషుని రాకకు కారణాలు 

ఈ క్రింది కారణాలను పరిశీలిద్దాం

  1. బర్బరిజం ప్రాబల్యం వహించడం, ప్రజలు వ్యక్తిగత స్వార్ధానికి ప్రాధాన్యం ఇచ్చి ఇతరుల జీవితాలకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వని దౌర్జన్యకర ధోరణి ప్రబలడం. పాలకులు, రాజుల్లో చెడు అలవాట్లు, శిస్తుల భారం పెంచడం, సత్య ధర్మ ప్రచారకులను రాళ్ళతో కొట్టి చంపడం. 
  2. చెట్లు, చేమలు వృద్ధి చెందక పోవడం, పండ్లు, ఫలాలు పుష్పాలు ఉన్నప్పటికీ అవి చాలా అరుదుగా లభ్యం కావడం. 
  3. నదీ జలాలు ఎండి పోవడం. 
  4. అన్యాయాలు ఎక్కువ కావడం, ఇతరులను చంపి వారి సంపద కాజేయడం, ఆడపిల్లలను అమ్మడం, కొనడం, వారిని సజీవంగా హతమార్చడం. 
  5. అసమానతలు పెరగడం, సమానత్వం కనుమరుగవడం. నిమ్నోన్నత భావాలు పెరగడం, అంటరాని తనం పెరగడం. 
  6. ఏక దేవుణ్ణి వదిలి ఇతరులను ఆరాధించడం, ఈ విశ్వానికి ఒక్కడే దైవం అన్న మాటలో ఎటువంటి సందేహం లేదు. కాని ఆ ఏకైక దేవుని ఆరాధనను వదిలి ఇతర దేవీ దేవతలను ఆరాధించడం. చెట్లను పుట్టలను, సూర్య చంద్ర నక్షత్రాలను, దేవుళ్ళుగా భావించడం. 
  7. చెడు మంచి రూపంలో ప్రజలను భ్రమలకు గురిచేసి చివరకు వారిని నాశనం చేయడం, ఈ దుష్ట శక్తి మానవాళికి రహస్య శత్రువు. 
  8. స్వార్ధం, కామం పెరగడం. పరస్పర సహకార భావం లోపించడం. ఒకరినొకరు శత్రువులుగా భావించడం. దేవునిపై విశ్వాసం సన్నగిల్లడం. దార్మికులుగా చెలామణి కావడానికి ప్రదర్శనాబుద్ధి పెరగడం. 
  9. న్యాయం పేరిట అన్యాయానికి పాల్పడడం. న్యాయానికి దూరమై అన్యాయాల పట్ల ఆశక్తి పెంచుకోవడం. 
  10. సాధువులు, మంచివాళ్ళను రక్షించడానికి చివరి అవతార పురుషుడు జన్మించాడు. 
  11. దైవాదేశాలను ఆచరించాలన్న స్పూర్తి ప్రజలలో కొరవడడం. వేదాల పట్ల గౌరవం తగ్గడం. ఆయా ఆదేశాలను లక్ష్య పెట్టకపోవడం, ఎప్పుడెప్పుడు ప్రపంచంలో అన్యాయం అధికమవుతుందో అప్పుడప్పుడు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అవతార పురుషుడు జన్మిస్తాడు. సత్య ధర్మ స్థాపనకు ఉపక్రమిస్తాడు. (భగవత్ పురాణం; 12 : 2 : 17) ఇప్పుడు పరిశీలించవలసినదేమిటంటే ఈ పరిస్థితులు ఈ యుగంలో గడిచి పోయాయా లేక గడుస్తున్నాయా?  అన్నది.  

మనిషి పుట్టినప్పటినుండి ఇప్పటి వరకు దాదాపు 1,24,000 మంది దైవ ప్రవక్తలు వివిధ కాలాలలో, వివిధ జాతుల వారికి దేవుడొక్కడే అనే సందేశాన్ని ఇచ్చారు. వారిలో చివరి వారే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం). ఆయన ద్వారా దేవుడు మానవాళికి అందజేసిన చివరి దైవ శాసనమే దివ్య ఖుర్'ఆన్ గ్రంధం.

చివరి అవతార పురుషుడు అని చెప్పే ఆధారాలు

పైన పేర్కొన్న వాస్తవాల వల్ల చివరి అవతార పురుషుడు గుర్రంపై ప్రయాణిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. గుర్రాలు, ఖడ్గాల కాలం నేడు గతించింది. ఇది విమానాలు, అణుబాంబుల కాలం. కాబట్టి చివరి అవతార పురుషుడు జన్మించిన కాలం గతించిన కాలమే అని తెలుస్తుంది. అలాగే ధార్మికత పతనమై హింసాదౌర్జన్యాలు ప్రబలమైన కాలంలో అవతార పురుషుడు జన్మిస్తాడని తెలుస్తుంది. కాబట్టి చివరి అవతార పురుషుడు ఎప్పుడు జన్మించి ఉంటాడో కాల నిర్ధారణ కూడా మనకు స్పష్టమైంది.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారి విశిష్టత

దేవుడు మొట్టమొదటి ప్రవక్త ఆదమ్ (అ.స) దగ్గర నుండి మహా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వరకు అనేక మంది ప్రవక్తల్ని ఈ భూమి పై పుట్టించాడు. ఇందులో ఆదమ్ (అ.స.) దగ్గరి నుండి ప్రవక్త యేసు వరకు వచ్చిన ప్రవక్తలు తమ తమ జాతుల్లో దేవుని ఏకత్వమును బోధించ వచ్చిన వారు. అంటే వీరు సర్వ మానవాళి కొరకు వచ్చిన వారు కారు. ఉదా: ప్రవక్త యేసునే తీసుకోండి ఆయన బైబిల్లో ఏం చెప్పారో చూడండి.

(మత్తయి; 15 : 24) "నేను నశించిన ఇస్రాయీలి గొర్రెల వద్దకే పంపబడితినని గాని మరి యెవని యొద్దకునూ నేను పంపబడలేదు.

మరొక చోట బైబిల్లో యేసు వారు తన శిష్యులను దైవ వాక్య పరిచయ నిమిత్తం పంపుతూ యిట్లు చెప్పెను.

యేసు వారు ఆ పండ్రెండు మందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా:

(మత్తయి; 10 : 5) "మీరు అన్య జనుల దారిలోకి వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణములో నైనను ప్రవేశింపకుడి గాని, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి."

దీన్ని బట్టి తెలిసేదేమిటంటే యేసు వారు కేవలం తన జాతి వారికి తప్ప సర్వ మానవాళికి ప్రవక్తగా పంపబడలేదు. ఇలా అన్ని కాలాల్లోను, ప్రపంచంలో అన్ని జాతుల్లోనూ దైవ ప్రవక్తలు జన్మించి ఆయా వేష భాషల్లోనే దేవుని ఏకత్వాన్ని బోధించారు.  అయితే ఈ కలియుగంలో దేవుడు సర్వ సృష్టి కొరకు ఒక ప్రవక్తను పంపిస్తాడని సర్వ ధర్మ గ్రంధాలు చెప్పాయి. ఆ పరంపరలో సర్వ సృష్టి కొరకు వచ్చిన దైవ ప్రవక్తయే "ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)" వారు. అందుకే దేవుడు దివ్య ఖుర్'ఆన్ లో ఈ విధంగా సెలవిచాడు.

(ఖుర్'ఆన్; 21 : 107) "ఓ ముహమ్మద్! మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము." 

(ఖుర్'ఆన్; 34 : 28) "ఓ ముహమ్మద్! మేము నిన్ను సమస్త మానవులకు శుభవార్తను అందజేసే వానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు."

ముహమ్మద్ (స.అ.సం) అందరి ప్రవక్త:

గత ప్రవక్తలు ఒక ప్రత్యెక కాలానికో, ప్రత్యెక జాతికో పంపబడ్డారు. కానీ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) సకల మానవ జాతికై ప్రవక్తగా చేసి పంపబడ్డారు.

(ఖుర్'ఆన్; 4 : 79) "ఓ ప్రవక్తా! మేము నిన్ను సకల మానవ జాతి కొరకు ప్రవక్తగా చేసి పంపాము. దీనికి అల్లాహ్ సాక్ష్యం చాలు.

ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) కేవలం ముస్లింల ప్రవక్త మాత్రమే కాదు. మనందరికోసం దైవ సందేశాన్ని తీసుకొచ్చిన  మనందరి దైవ ప్రవక్త. 

వివరణ: ఈ విధంగా భవిష్య వాణి ప్రకారం, వేద కాల మాస లెక్కల ప్రకారం కలియుగము 3,658 సం. నందు మహా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు జన్మించారు.

చివరి అవతార పురుషుని గుణగణాలు
  1. గుర్రపు స్వారీ: చివరి అవతార పురుషుని గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఆయన ఆశ్వారూరుఢని, ప్రయాణ సాధనంగా గుర్రాన్ని వాడారని తెలుస్తుంది. ఆయన గుర్రాన్ని స్వారీ చేస్తూ వస్తారని ప్రస్తావనల్లో కనబడుతుంది. ఆ గుర్రం పేరు 'దేవదత్' గా కూడా ప్రస్తావనలలో ఉంది. ఆ పేరుకు అర్ధం దేవదూతలు ఇచ్చిన వాహనం అని అర్ధం
  2. త్తిసాములో మేటి : చివరి అవతార పురుషుని గురించి కనబడే ప్రస్తావనలలో ఆయన కత్తి సాములో మేటి అనికూడా మనకు తెలుస్తుంది. శత్రువులు ఖడ్గ ప్రహారాలతో నిర్మూలించబడతారని ప్రస్తావనలలో ఉంది. అంతేతప్ప అణుబాంబుల వల్ల అని కాదు. అయితే ఈ విషయమై మనం ఆలోచించ వలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలం అణుయుగం అంతేగాని ఖడ్గయుద్ధాల కాలం కాదు. ఇంకా చివరి అవతార పురుషుని లక్షణాలు పరిశీలిస్తే ఆయన వస్త్ర ధారణ, ఆ కాలానికి, ప్రదేశానికి, అప్పటి సాంప్రదాయాలకు తగినట్లు ఉంటుందని తెలుస్తుంది. ఆయన తాను జన్మించిన సముదాయం వారి వ్యవహార శైలి కలిగి ఉంటారని కూడా తెలుస్తుంది. 
  3. మొత్తం ఎనిమిది గుణగణాలు కలిగి ఉండడం: పురాణాలు ఈ అవతార పురుషుని ఎనిమిది గుణగణాలు వర్ణించాయి. అవన్నీ చివరి అవతార పురుషునిలో కనబడతాయి. 
  4. ప్రపంచ పరిరక్షకుడు: జగత్ పతి అనగా ప్రపంచాన్ని రక్షించేవాడని అర్ధం. 
  5. దుర్గుణాలను అణచడం: చివరి అవతార పురుషుని గుణగణాలలో ముఖ్యమైనది ఆయన దుర్మార్గులను అణిచివేస్తాడు, మంచి వాళ్ళను రక్షిస్తాడు. 
  6. నలుగురు సహచరుల సహకారంతో పనిచేస్తాడు: భారత్ అనగా సహాయం చేసేవాడని అర్ధం. చివరి అవతార పురుషునికి నలుగురు సహాయకులు ఉంటారు. వారు ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. 
  7. దేవతల సహాయం: స్వర్గం నుంచి దేవదూతలు దిగివచ్చి ధర్మ ప్రచారానికి, దుష్టశిక్షణకు సహాయపడతారు. (కల్కిపురాణం; అధ్యాయం 2, శ్లోకం 15)
  8. కలిని నిరోధించడం: కలిని లేదా షైతాన్ ను నిరోదిస్తారు. 
  9. చివరి కాంతి: చివరి అవతార పురుషుని కాలంలో ఏ కాలంలోనూ లేనంత ప్రకాశవంతమైన కాంతి ఉంటుంది. అలాంటి ప్రకాశం మరే అవతార పురుషునికి లేదు. 
  10. రాజుల రూపంలో ఉన్న దోపిడీ దారులను నిర్మూలించడం: రాజుల రూపంలో ఉన్న దోపిడీ దారులందరినీ చివరి అవతార పురుషుడు నిర్మూలిస్తాడని భగవత్ పురాణం చెబుతుంది. (భగవత్ పురాణం; 12-2,16, ప్రపంచ పరిరక్షకుడు ఎనిమిది గుణగణాలను కలిగి ఉంటాడు. దేవతలు ఇచ్చిన శరవేగంగా వెళ్ళే గుర్రాన్ని స్వారీ చేయడం, తన కరవాలంతో దుర్మార్గులను అంతం చేయడం, రెండవ, నాల్గవ, ఐదవ గుణాలను భగవత్ పురాణం వర్ణించింది. కల్కి పురాణం అధ్యాయం, 2 శ్లోకం 5 ప్రకారం "ఓ దైవమా! నేను నలుగురు సహచరులతో కలిసి దుష్ట శక్తిని నాశనం చేస్తాను. (12-2,16)" భగవత్ పురాణం ; 12-2,20 శరవేగంగా పరుగెత్తే గుర్రంపై స్వారీ చేస్తూ ఆయన, సాటి లేని ప్రకాశం కలిగిన ఆయన రాజుల రూపంలో ఉన్న దోపిడీ గాళ్ళను నిర్మూలిస్తాడు.)
  11. శరీర సువాసన: చివరి అవతార పురుషుని శరీర సువాసన వాతావరణాన్ని అలుముకుని ప్రజల హృదయాలలో పరివర్తన తీసుకువస్తుంది. 
  12. అతి పెద్ద సమాజానికి బోధకుడు: చివరి అవతార పురుషుడు అతి పెద్ద సమాజానికి, సముదాయానికి బోధకుడుగా ఉంటారు. ధర్మానికి దూరమైన వారిని శిక్షిస్తారు. వారిని సన్మార్గానికి తీసుకు వస్తారు. 
  13. మాఘ మాసం 12వ రోజున జన్మిస్తారు: చివరి అవతార పురుషుడు మాఘ మాసం శుక్ల పక్షం 12 వ తేదీన జన్మిస్తారని  కల్కి పురాణం చెబుతోంది. 
  14. సంభల్ కు చెందిన అత్యున్నత పూజారి కుటుంబంలో జన్మిస్తారు: ఆయన జననం  శంభల్ ప్రాంతంలో విష్ణుప్రకాశం కల్గిన ఒక పెద్ద పూజారి కుటుంబంలో సంభవిస్తుంది. ఆయన  తల్లి పేరు సుమతి. ఈ లక్షణాలన్నీ చివరి అవతార పురుషునికి సరి పాలుపోతాయి. 
(1.భగవత్ పురాణం 12, అధ్యాయం, 2, శ్లోకం 21,  2. కల్కి పురాణం, అధ్యాయం దాక్తియా శ్లోకం 15, 3. భగవత్ పురాణం 12, 2- 16, 4. కల్కి అధ్యాయం 2, శ్లోకం 4, 11)

చివరి అవతార పురుషుని కాలం 

భారత దేశంలోని ధార్మిక గ్రంధాలు నాలుగు దశలుగా ఉన్నాయి.

1. సత్య యుగము: ఈ యుగ కాలం 17,28,000 సంవత్సరాలు

2. త్రేతాయుగం: సత్య  యుగం తర్వాత త్రేతా యుగం వచ్చింది ఈ యుగం 17,28,000 సంవత్సరాలు

3. ద్వాపర యుగం: ఈ యుగం 8,64,000 సంవత్సరాలు

4. కలియుగం: ఈ యుగం 4,30,000 సంవత్సరాలు

అవతార పురుషుని రాకకు పూర్వం భూమండలం, ప్రజలు దౌర్జన్యాలు, అన్యాయాలతో సతతమైపోతారు. ఆ తర్వాత అవతార పురుషుని ఆగమనం జరుగుతుంది. ఈ విషయమై భగవద్గీత ఈ విధంగా తెలియజేస్తుంది:

పాదసూచికలు : ఋగ్వేదం; 10-60-12, అధర్వణ వేదం; 16-1,6, 31-11, 3-12-5

కలియుగంలో చివరి అవతార పురుషుడు జన్మిస్తాడన్నది తధ్యం. కలియుగం 5071 సంవత్సరాల పూర్వం ప్రారంభమయ్యింది. చివరి అవతార పురుషుడు కలియుగం ప్రారంభమై కొంత కాలం గడిచిన తర్వాత జన్మిస్తాడు. అంటే పరిస్థితులు పూర్తిగా దిగజారి పోయి పట్టెడన్నం కూడా లభించని దయనీయ స్థితి నేలకోన్నప్పుడు జన్మిస్తాడు. ఇక్కడ గమనించ వలసిన మరో ముఖ్య విషయమేమిటంటే చివరి అవతార పురుషుడు యుద్ధాల్లో ఖడ్గాలు ఉపయోగిస్తున్న కాలంలో, ప్రయాణానికి గుర్రాలు ఉపయోగిస్తున్న కాలంలో జన్మిస్తాడని భగవత్ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రపంచ పరిరక్షకుడు శరవేగంగా పయనించే గుర్రంపై, దైవదత్తమైన ఖడ్గంతో, ఎనిమిది దైవిక  లక్షణాలతో శత్రువులను అంతం చేస్తాడని ఉంది. ప్రస్తుత కాలం ఖడ్గాలు, గుర్రాల కాలం కాదు. ఇది అణు బాంబులు, యుద్ధ టాంకర్ల కాలం. కాబట్టి చివరి అవతార పురుషుడు ఆ కాలంలో జన్మించి ఉండాలి. యుద్ధాల్లో ఖడ్గాలు, గుర్రాల ఉపయోగం నేటికి 1400 సంవత్సరాల క్రితం జరిగేది. ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత గన్ పౌడర్ అరేబియా లో కనుగొనడం జరిగింది. గన్ పౌడర్ ను బొగ్గు, సోడా మిశ్రమంతో తయారు చేసేవారు. ఇంకొక ముఖ్య విషయమేమిటంటే చివరి అవతార పురుషుని జననం తేదీ కూడా కల్కి పురాణం పేర్కొంటుంది. మాధవ మాసం, శుక్ల పక్షం;  12 వ తేదీగా పేర్కొంటుంది.

1. గత్ కాలి 5069 పంచాంగం 2025
2. భవత్ పురాణం; సంపుటం 12, అధ్యాయం 2, శ్లోకం 17
3. భవత్ పురాణం; సంపుటం 12,అధ్యాయం 2, శ్లోకం 19
4. కల్కి పురాణం; అధ్యాయం 2, శ్లోకం 15

కల్కి అవతారం ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఇద్దరి మధ్య పోలికలు చూస్తే:

1. గుర్రపు  స్వారీ ఖడ్గచాలనం:  భగవత్పురాణం ద్వాద్విశసిఖండం, ద్విత్య అధ్యయం 19వ శ్లోకం  ప్రకారం కల్కి అవతారం దేవతలు ఇచ్చిన గుర్రంపై స్వారీ  చేస్తారని ఉంది. ఆయన దుష్టులను ఖడ్గముతో అంతమొందిస్తారని ఉంది. దేవతలు ప్రసాదించిన ఆ గుర్రం అత్యుత్తమమైనది. ఆ గుర్రంపై స్వారీ చేస్తూ ఆయన దుష్టులను నిర్మూలిస్తారు. ప్రవక్త ముహమ్మద్ (. . సం) కు దైవికంగా లభించిన గుర్రం అది. ఆ వాహనం పేరు బుర్రాఖ్. ఆయన ఆ వాహనంపై స్వారీ చేస్తూ గగనారొహణం చేశారు. ఆ వాహనం ప్రవక్త ముహమ్మద్ (. . సం) కు ఇష్టమైన వాహనం. ఆయన వద్ద చాలా గుర్రాలుండేవి. ప్రవక్త సహచరులు హజ్రత్ అనస్ (. జి) ప్రకారం ఆయన ప్రవక్త మెడకు ఖడ్గం వేలాడుతుండగా ప్రవక్త గుర్రంపై స్వారీ చేయడాన్ని ఆయన చూశారు. ప్రవక్త ముహమ్మద్ (. . సం) వద్ద చాలా ఖడ్గాలుండేవి. అందులో ఒకటి ఆయనకు వారసత్వం లో లభించింది. రెండవ ఖడ్గం జుల్ఫికర్ మూడవ ఖడ్గం ఖలాల్ ఈ మూడు ఖడ్గాలు ఆయనకు ఇష్టమైనవి.
2   2. జగత్ గురు: భగవత్ పురాణం ప్రకారం చివరి అవతార పురుషుడు జగత్ గురుగా ప్రఖ్యాతి చెందుతారు. అంటే ప్రపంచాన్ని పరిరక్షించేవాడు. తన హితబోధల ద్వారా ఆయన పతనమౌతున్న సమాజాన్ని పరిరక్షిస్తాడు. ఇక్కడ సమాజం అంటే ఒక పరిమిత సమూదాయము కాదు. పూర్తి ప్రపంచమే ఆయన సమాజం. ప్రవక్త ముహమ్మద్ (. . సం) గురించి దివ్యఖుర్ ఆన్ఇదే విషయాన్ని చెబుతుంది. పూర్తి ప్రపంచానికి దేవుని సందేశాన్ని అందించే ప్రవక్తగా ఆయన్ను ప్రబోధించింది.
(1. ది హిస్టరీ ఆఫ్ స్ట్రగుల్ బిట్వీన్సైన్స్ఆండ్ రెలిజియన్‌, డ్రాపర్‌ (సీరతున్నబీ) నుంచి గ్రహించడం జరిగింది.
(2. భగవత్ పురాణం ద్వాదశ్ ద్వితియ్ అధ్యాయ్ శ్లొక్ 19, బుర్రాఖ్ చిత్రాన్ని ఆర్గనైజర్ పత్రిక 1969, ఫిబ్రవరి 8 తేదీన ప్రచురించింది.
(3. అసా ఉస్సియార్, పేజి 565, జమావుల్ ఫవాయిద్ సంపుటం 2, పేజి 179.
(4. బుఖారి
(5. అమ్హు సింయర్‌, పేజి 498.
(6. భగవత్ పురాణం ద్వాదశ్ ద్వితియ్ అధ్యాయ్ శ్లొక్ 19.
(7. సూరే ఆరాఫ్; ఆయత్ 158.
3.  అసాధు దమన్‌:  కల్కి గురించిన ప్రస్తావనల్లో ఆయన దుష్టులను నిర్మూలిస్తాడని ఉందిఈ ప్రస్తావన ప్రవక్త ముహమ్మద్ (.సంకు పూర్తిగా వర్తిస్తుందిదివ్య ఖుర్ఆన్‌ ప్రకారం క్రూరత్వానికి గురైన వారికి ప్రతిఘటించే అనుమతి పూర్తిగా ఉందిదేవుడు వారికి సహాయం చేయగల సమర్ధుడుదేవుడు ఒక్కడే అన్నందుకు దైవారాధకులను వారి ఇళ్ళనుండి గెంటివేయడం జరిగిందిప్రవక్త ముహమ్మద్ (సందుర్మార్గులనుదుష్టులను సంస్కరించారుఏకదైవారాధన గురించి వారికి హితబోధ చేశారుబహుదైవారాధన లోని చెడును గురించి వారికి వివరించారువిగ్రహారాధనను వ్యతిరేకించారుఇస్లాం అన్నది కొత్త మతం కాదనిదేవుని యందు విధేయత ఇస్లామని తెలియజేశారువేద్ అన్న పదానికి దేవుని స్వరం అని కూడా అర్ధం ఉన్నదిదైవాదేశాలను అమలు చేసే ధర్మం వైదిక ధర్మంఅంటే ఇస్లాం కు వైదిక ధర్మానికి పోలికలున్నాయిఈ రెంటినీ అనుసరించని వారిని నాస్తికులు లేదా అవిశ్వాసులు అని అంటారుప్రవక్త ముహమ్మద్ (సంజన్మించిన కాలంలో దోపిడీగాళ్ళుదుర్మార్గులు అధికమయ్యారుఆడపిల్లలను హత్య చేసేవారుపర్షియాకు మొదటి రాజు ఖబద్ఆయన మజ్దక్ ప్రసంగం విని చాలా ప్రభావితమయ్యాడుఆ వెంటనే సంపదఆస్తులన్నీ ఉమ్మడి సొత్తులనివ్యక్తిగతంగా ఎవరికీ సొంతం కాదని ప్రకటించాడుఈ అతివాదం చివరకు ప్రవక్త ముహమ్మద్ (సంవచ్చిన తర్వాత గాని అంతం కాలేదుప్రవక్త ముహమ్మద్ (సంఇలాంటి కుహనా అతివాదాలన్ని అంతం చేసి సత్య ధర్మం ప్రతిష్ఠించారు.
ముహమ్మద్ (. . సం) వారు కల్కి అవతారమని వేద వేదాంగాలు సాక్ష్యమిస్తున్నాయి.   
1 1.   కల్కి అవతార పురుషుని జనన కాలం:
శ్లోకం: ద్వాదశయం శుక్ల పక్షస్య మాధవే మాసి మాధవం!!
       జాతం తద్రుషతుహు: పుత్రం పేతో ద్రష్ మనశవు!!
(కల్కి పురాణం; అంశం 1, అధ్యాయం, 2, శ్లోకం 15)
అర్ధం: కల్కి అవతార పురుషుడు వైశాఖ మాసం శుక్ల పక్షములో సోమవారం తెల్లవారు ఝామున జన్మించును.
వివరణ: పై శ్లోకం వివరించిన విధంగానే మహా ప్రవక్త ముహమ్మద్ (. . సం) వారు వైశాఖ మాసం శుక్ల పక్షం సొమవారం తెల్లవారు జామున జన్మించారు.
2.   కల్కి అవతార పురుషుని తల్లి దండ్రుల నామ ధేయములు:  
శ్లోకం: తఛ్యుత్వ పుండరీకాక్షో బాహ్మణమిదమ్బ్రవీత్!
          శంభలే విష్ణుయశసోగ్రహే పాదురేభవయహం!
        సుమత్యం మతురివిభో! కన్యాయం తన్ని దేశత:
(కల్కి పురాణం అంశం 1 అధ్యాయం, 2, శ్లోకం 4)
అర్ధం: కల్కి అవతార పురుషుడు కమల నయనములు కవాడై ఆ పరబ్రహ్మ గ్నానమునకు కారణమైన వాడై, శంబల గ్రామమందు అనగా భూమి నాభి స్థానమందు విష్ణు భక్తునికి, సుమతికి జన్మించును.
వివరణ:
1.  మహా ప్రవక్త ముహమ్మద్ (. . సం) వారు కమల నయనములు కలిగి ఉంటారు.
2.  వీరు ఆ పర బ్రహ్మ అల్లాహ్ జ్ఞానం పొందినవారు.
3. వీరి తండ్రి పేరు "విష్ణుయశసో" అనగా తెలుగులో దేవుని భక్తుడు అని అర్ధం. అలాగే ముహమ్మద్ (. . సం) వారి తండ్రి పేరు 'అబ్దుల్లాహ్' అంటే తెలుగులో "దేవుని భక్తుడు" అని అర్ధం. అలాగే వీరి తల్లి పేరు "సుమతి" అని చెప్పబడింది. సుమతి అంటే తెలుగులో 'శాంతిదాయక హృదయం కల స్త్రీ' అని అర్ధం. ముహమ్మద్ (. . సం) వారి తల్లి పేరు అమీనా. అమీనా అనగా తెలుగులో 'శాంతిదాయక హృదయం కల స్త్రీ' అని అర్ధం. అరబ్బీ భాషలోని వీరి పేర్లు పురాణాల్లో సంస్కృతంలో చెప్పబడ్డాయి. భాష మార్పేగాని భావం ఒక్కటే. పై శ్లోకముల వలన కల్కి మహా పురుషుడు ముహమ్మద్ (. . సం) వారేనని సాక్ష్యాధారాలతో ఋజువగుచున్నది.


జన్మ స్థానం గురించి వివరణ:
కల్కి జన్మ స్థానం శంభల్ఆయన ఒక పూజారి ఇంట్లో జన్మిస్తారుఆ పూజారి పేరు విష్ణుయశ్ఈ పేర్లన్ని సంస్కృతంలో ఉన్నాయిఈ పేర్లు గుణవాచకాలు కావాలి లేదా అరబ్బీ నుంచి సంస్కృతంలో అనువాదం చేయబడిన పదాలు కావాలికాబట్టి ఈ పదాల అర్ధాలను తీసుకుని పరెశీలించడం ఉత్తమంశంభల్ అంటే శాంతి నిలయంమక్కా నగరానికి అరబ్బీలో (దారుల్ అమన్‌) శాంతి నిలయం అని అంటారుఇస్లాం అంటే దేవునికి విధేయత చూపడంఅంటే సంస్కృతంలో సనాతన ధర్మం లేదా ఆస్తికత్వం అని అర్ధం.
పూజారి ఇంట్లో జననం: కల్కి అవతారం ఒక పూజారి ఇంట్లో జన్మిస్తారని ఉందిప్రవక్త ముహమ్మద్ (సంకూడా ఒక పూజారి ఇంట్లో జన్మించారుకాబా గృహానికి అప్పట్లో ధర్మకర్తలుగా ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు.
తల్లి దండ్రులకు సంబంధించిన వివరణ: కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం తల్లి పేరు సుమతి. అంటే మృదుస్వభావం కలిగిన నెమ్మది కలిగిన మహిళ అని అర్ధం. తండ్రి పేరు విష్ణుయశ్. అంటే స్వఛ్చమైన దేవుని ఆరాధకుడు అని అర్ధం. ప్రవక్త ముహమ్మద్ (. . సం) తల్లి పేరు ఆమినా. తండ్రి పేరు అబ్దుల్లాహ్. ఈ పేర్ల అర్ధాలు కూదా పైన పేర్కొన్నవే.
చివరి అవతార పురుషుని అవతరణ: కల్కి అవతారం చివరి అవతారం. ప్రవక్త ముహమ్మద్ (. . సం) కూడా చివరి దైవ ప్రవక్తగా పేర్కొనబడ్డారు. అందువల్లనే ముస్లిములు ప్రవక్త ముహమ్మద్ (. . సం) తర్వాత ఏ ప్రవక్తను విశ్వసించడం జరగదు. కల్కి అన్న పదానికి నిఘంటువు అర్ధం ఏమిటంటే సీతాఫలాలు తిని మరకలను కడిగేవాడని. ప్రవక్త ముహమ్మద్ (. . సం) కూడా ఖజ్జూర ఫలాలు తినేవరు. ఆయన దైవ తిరస్కారం వంటి మరకలను కడిగేవారు.
ఉత్తరం నుండి రావడం మరియు ప్రసంగం:  
కల్కి పురాణం ప్రకారం కల్కి జన్మించిన తర్వాత ఒక కొండ దిశగా వెళతారు. అక్కడ పరుశురాముని ద్వారా విధ్యాభ్యాసం పొందుతారు. (పరశురామ్ఒక గుహలో కల్కి అవతారానికి జ్ఞాన బోధ చేశారు. ఇక్కడ పరశురామ్‌ = దైవ దూత జిబ్రాయీల్, కొండ గుహ = హిరా గుహ. (సర్వరే ఆలమ్పేజి 21, కల్కి అవతారం తన దేశంలో ఉత్తర దిశగా ప్రయాణం చేస్తారు. తర్వాత కొంత కాలానికి విజేతగా తిరిగి వస్తారు. ఇది మక్కా నగరం నుంచి వలస మదీనా నగరానికి తరలిపోవడం, తిరిగి రావడాన్ని సూచిస్తుంది.) ఆ తర్వాత ఉత్తరానికి వెళ్ళి తిరిగి వస్తారు. ప్రవక్త ముహమ్మద్ (. . సం) కూడా ఒక కొండ దిశగా వెళ్ళారు. దైవదూత జిబాయీల్ ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. ఆ తర్వాత దివ్య ఖుర్ ఆన్అవతరణ ప్రారంభమయ్యింది. ఆ తర్వాత ఆయన ఉత్తర దిశగా మదీనా నగరానికి వెళ్ళారు. ఆ పిదప ఆయన దక్షిణానికి మళ్ళీ వచ్చి తన జన్మ ప్రదేశాన్ని సందర్శించారు. పురాణాల్లోనూ ఈ సంఘటనలు ఇలాగే వర్ణించబడ్డాయి.
4. కల్కి పురుషుని జననాంగం:
పూర్వం శౌనకాదియ మహామునులు చేసిన సభకు నూతన మహర్షి విచ్చేసెను. అతనిని చూచి ఋషులందరూ తగు రీతిన ఆదరించి కుశలమడిగి అతనిని యిట్లు ప్రశ్నించిరి. "ఓ నూతన మహర్షి నీవు సకల ధర్మా ధర్మ విచారుండవు సమస్త పురాణవేత్తవు. భగవత్కౌద కాలక్షేపమున మాకు విందుకూర్పుము. త్రికాలవేదివి నీవెరుగని విషయాలు లేవు. కలియుగమునందు కల్కి మూర్తి ఎచట జన్మించును? అని ప్రశ్నించిరి.
దానికి నూతన మహర్షి యిట్లు చెప్పెను.

శ్లోకం: "ఏతస్ మిన్నతరే మ్లేశ్చ ఆచార్యేణ సమన్విత:
          మహమ్మదం ఇతిఖ్యాత శిష్యశాఖా సమన్విత:
           నృప శ్ఛైవ మహాదేవం మరుస్థల నివాసినమ్"
(భవిష్యత్ పురాణం, ప్రతిసర్గ పర్వం3, అధ్యాయం-3, శ్లోకం 5-8)

అర్ధం: అపటికి ధర్మం అస్తమించి అధర్మం క్రమ్మజొచ్చెను. యింతలో మ్లేశ్చుల (పర భాషా పరదేశీయులు) దేశమునందు ఆ పరమాత్కిక కల్కి మహా పురుషుడు "ముహమ్మద" అను నామ ధేయంతో సుప్రసిద్ధి గాంచు శిష్యులతో వేంచేయును. ఆయన ఎడారి ప్రాంతానికి చెందిన వారై ఉంటారు.
వివరణ:
1. పైన శ్లోకం ఖచ్చితంగా పరభాషా (అరబ్బీ) పరదేశము (అరేబియా) నందు కల్కి మూర్తి జన్మిస్తాడని తెలుపుతుంది.
2. కల్కి మూర్తి పేరు ముహమ్మద్ (. . సం) అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది నిజంగా సంభ్రమాశ్ఛర్యం కలిగించే విషయం.
3. ఈయన ఎడారి ప్రాంతానికి చెందినవారై ఉంటారని తెలియజేస్తుంది. ఈ విధంగా ఎడారి ప్రాంతానికి చెందిన ప్రవక్త ముహమ్మద్ (. . సం) ఒక్కరే.
4. ఈయన శిష్యులు ఖలీఫాలుగా ధర్మవేత్తలుగా ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచారు. కనుక ఆ కల్కి మహా పురుషుడు ముహమ్మద్ (. . సం) అని రూఢీ అవుతుంది.
యింకా ఆ కల్కి మహా పురుషుని శుభనామం ఏమై ఉంటుందో కూడా భవిష్యత్ త్రేత్ర ఉపనిషత్ తెలిపింది. ఓ శ్లోకంలో ఇలా ఉంది.
శ్లోకం: "ఆది అధ్యాత్ తిచ్ భూవానితస్తాదన్నం తధుచ్చతే
        అహమన్నం-మహమన్నం-అహమద్దాదో-మహమద్దాదో-అహమద్దధ:"
దీని భావమేమిటంటే  కల్కి అవతార పురుషుని శుభ నామం అహ్మద్ మహమ్మద్ అయివుండునని తెలుపుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ (. . సం) కే అహ్మద్, మహ్మద్ అని పేరు.
పుస్తకం పేరు           :      కలియుగాంతం కాల జ్ఞానం 
రచయిత                   :       డా! వేద్ వ్యాస్ IAS, Phd
ప్రచురించబడిన సం!!  :      1994
క్రీస్తు తర్వాత ప్రవక్త అయిన 'మహ్మదు' గురించి "భవిష్య పురాణం" ఏం వ్రాసిందో చూస్తే ఇంకా ఆశ్ఛర్యమేస్తుంది.  
ప్రవక్త ముహమ్మద్ (. . సం) పుట్టుక:
భవిష్య పురాణంలో  ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలలో వ్యాస మహర్షి వర్ణించినది  'ముహమ్మద్' ప్రవక్త జననాన్ని గురించి! ఆయన భవిష్యత్తును చెప్పటమే కాక ఆయన పేరు కూడా తెలిపాడు ఎంతో ఆశ్ఛర్యంగా!
"మహమ్మదం ఇతిఖ్యాత"
మ్లేచ్ఛ ఆచార్యేణ సమన్విత:" (భవిష్య పురాణం, ప్రతి సర్గ పర్వం)

అంతిమ దైవ ప్రవక్త ఈయన రాకకు పూర్వమే వేద వేదాంగాలు ఈయన వస్తారని పేరుతో సహా తెలియజేసాయి.
వేదాలలో ముహమ్మద్ (. . సం)
వేదాలలో మహనీయ ముహమ్మద్ (. . సం) గురించి అనేక చోట్ల 'నరాశంస' అనే పేరుతో ప్రస్తావించడమైనది.
శ్లోకం: "నరాశంస: యో నరౌ ప్రశస్యతే" – ఏ మానవుడైతే ప్రశంసించ బడతాడో  (సాయిణ్ భాష్య, ఋగ్వేద సంహిత: 5-5-2) ఇది కర్మ ధారయ సమాసము. దీని అర్ధం ప్రశంసించ బడే మానవుడు. ముహమ్మద్ అనే అరబ్బీ పదం యొక్క అర్ధం కూడా ఇదే
(ఋగ్వేదం; 1 మండలం - 13 సూక్తం3 మంత్రం.
2 మండలం3 సూక్తం2 మంత్రం.
5 మండలం5 సూక్తం2 మంత్రం.
7 మండలం2 సూక్తం2 మంత్రం.
10 మండలం64 సూక్తం3 మంత్రం.
నాలుగు ఉప వేదాలలో ఒకటైన సామ వేదం కల్కి మహా పురుషుని గురించి ఈ విధంగా తెలియజేసింది.

శ్లోకం: "అహమది పితుహు పరిమేధామృతస్య
           జాగ్రాణి అహం సూర్యో ఇవాజన:
            (సామవేదం; ప్రతిసర్గపర్వం, అధ్యాయం 6, మంత్రం 8)
అర్ధం: అహమద్ అనే అతను సర్వ ప్రవక్తలకు పితామహుని లాంటివాడు మరియు సూర్యుని వంటి వాడు.
అలాగే కలియుగమున వచ్చే ఈ కల్కి అవతార పురుషుని నామం ఎలా తెల్సు కోవాలో వేద వ్యాస మహర్షి తన ఉపనిషత్తులో ఓ శ్లోకాన్ని వివరించి దానిలోని పదాల్లో ఆ కల్కి మహా పురుషుని నామం వస్తుందని తెలిపారు. ఆ శ్లోకమేమిటంటే
"కారో అఖండస్య కారో హన్నారే మతి
కారో మాయా బ్రహ్మండందకారం దయాంతిశౌ"
దీని భావం సర్వానికి జీవన ముక్తిని ప్రసాదించేవాడని అర్ధం. దీనిలోని శ్లోక వాక్యాల్లోని మొదటి పదాలు కలిపితే "అహమద్" అని వస్తుంది.
యిక వేదాల్లోని నాలగవ ఉప వేదమైన అధర్వణవేదంలో కల్కి మహా పురుషుడైన మహా ప్రవక్త ముహమ్మద్ (. . సం) వారి గురించి చాలా స్పష్టంగా ఇలా ఉంది.

శ్లోకం: "ఇదం జనా ఉపశృత నరాశం నస్తవిష్యతే 
          షష్టిం సహస్రానవతిం చకారుమ్ఆరుశమేఘ దజ్మహే
          ఉష్టాయస్య ప్రవహీణో వధూమంతోద్విర్దశ
           వర్షమా రధస్యని జహీడతే దివ ఈషమాణా ఉపశ్పృశ:
           ఏషకృషయ్ మామహేశతం నిష్కాన్దశస్రజ:
           తీణీ శతన్యర్వతాం సహస్రా దశగోనామ్"
(అధర్వణ వేదం; 20 కాండం, 127 సూక్తం, 1-3 మంత్రం)
అర్ధం: ఓ భక్తులారా! ఈ ప్రబోధకుని మాటలు వినండి. ప్రశంసనీయుడు, ప్రశంసింపబడిన వాడు అయిన ఆ మహర్షి 60, 090 మంది మనుష్యుల మధ్య జననమొందును. ఆయన ఇరవై ఆడ, మగ ఒంటెలపై సవారీ చేస్తారు. అమోఘమైన వారి కీర్తి స్వర్గ లోకం వరకు పాకుతుంది. ఈ మహర్షి వంద బంగారు నాణెములు కలిగి ఉంటారు. పది ముత్యాల హారాలు, మూడు వందల అరబ్బీ గుర్రాలు పదివేల పశుసంపద ఉంటాయి. 
  1. ముహమ్మద్ (స.అ.సం) అనే అరబ్బీ పదానికి అర్ధం ప్రశంసనీయుడు, ఆదరనీయుడు అనే తెలుగు అర్ధాలు వస్తాయి. 
  2. పైన వివరించినట్లుగానే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు జన్మించేనాటికి మక్కా జనాభా 60 వేల 90  ఉంటుంది. 
  3. ప్రవక్తలలో ఒంటెలపై ప్రయాణం చేసిన వారు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు ఒక్కరే. 
  4. ఇక వంద బగారు నాణేలను గురించి చెప్పాలంటే అరేబియా వదిలి ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) ఆజ్ఞ మేరకు అబీసీనియా వలస వెళ్ళిన వంద మంది శిష్యులు  అని అర్ధం. 
  5. పది ముత్యాల హారాలు అంటే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారిచే స్వర్గ లోక వాసులుగా ప్రకటించబడ్డ ఆయన 10 మంది శిష్యులు అని అర్ధం. 
  6. ఇక పదివేల పశు సంపద ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారి 10 వేల మంది శిష్యులు అని అర్ధం. 
ఇక వేదాల్లో మొదటిది అయిన రిగ్వేదం ఏం చెబుతుందో చూద్దాం:

"అనస్వన్తా సత్పతిర్ మామహే మేగావా చేతిష్టో అసురోమ ఘోనః 
(ఋగ్వేదం; మండలం 5, సూక్తం - 27, మంత్రం - 1

పై శ్లోకానికి భావమేమిటంటే ఈ ప్రపంచాన్ని రక్షించ వచ్చిన వారే ముహమ్మద్ (స.అ.సం). 

వారి మాట తీరు, జాతి, గుణ గణాలు  ఆచార వ్యవహారాలు వీటి గురించి ఇలా ఉంది

"లింగచ్చేది శిఖా హీనః శశ్రుధారి సదూషకః 
 ఉచ్ఛలాపి సర్వ భక్షి భవిష్యతి జనోమమ"
(భవిష్య పురాణం కాండం 3, అధ్యాయం 3 శ్లోకం - 25-27) 

అర్ధం: ఆయన పుట్టుకతో లింగచ్చేది (సున్నతి వడుగులు) అయివుంటారు. తలపైన ముడి ఉండదు. గడ్డం పెంచు కుని ఉంటారు. మాంసాహారి అయివుంటారు. బిగ్గరగా గొంతెత్తి మాట్లాడుతారు. ముసలై (అరబ్బీలో ముస్లిం అని అర్ధం) అని పరిచయం చేయబడతారు.

వివరణ :
1.     లింగచ్చేది అంటే మర్మాంగం సున్నతి చేసే ఆచారం. ఈ ఆచారం భారత దేశంలో లేదు. ఇది ముహమ్మద్ (స.అ.సం) గురించి చెప్పబడింది. ఎందుకంటే ఈయన తల్లి గర్భం నుండే వడుగులు (సున్నతి) అయి జన్మిస్తారు. 
2.     శిఖా హీనః తక్కువ జుట్టు కలిగి ఉండడం లేదా శిరో ముండనం చేయించుకోవడం. ప్రవక్తలలో ఇలా చేయించుకున్నవారు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు ఒక్కరే. 
3.     అలాగే ముసలై అనే సంస్కృత పదానికి అరబ్బీలో ముస్లిం అనే అర్ధం  వస్తుంది. 
4.     ఈయన బిగ్గరగా గొంతెత్తి మాట్లాడతారు.
ఇలా ఎన్నో విషయాలు ఈయన గురించి చెప్పబడ్డాయి. యింకా భవిష్య పురాణం ఏం తెలుపుతుందంటే ఈ కల్కి అవతార పురుషునికి చతుర్విధావస్థలు ఉంటాయని తెలుపుతుంది. అవి 1.  ఓంకార అవస్థ 2. వనవాస అవస్థ 

3. అజ్ఞాత అవస్థ 4. యుద్ధ రంగ అవస్థ. ఇవి దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారి జీవితంలో సంభవించినవి. అవి ఏమిటో గమనిద్దాం :
1.  ఓంకార అవస్థ:  ఈ అవస్థ యందు ఈ అవతార పురుషుడు తపస్సునందు నిమగ్నమై దైవ సందేశమును పొందును. 
వివరణ: ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు 40 సంవత్సరాల వయస్సుకు ముందు ఏకాంతవాస ప్రియులై కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న హీరా గుహలో రేయింబవళ్ళు దైవ ధ్యాన నిమగ్నులై ఉండేవారు. అక్కడ వారికి తేజస్సు కనబడుతూ నిజమైన కలలు కలుగుతూ ఉండేవి. ఏ కల అయితే ఆయన చూశారో మరుసటి రోజు అది సంభవిస్తూ ఉండేది. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారి 40 సంవత్సరాల వయస్సు తర్వాత దైవ దూత జిబ్రయీల్ ప్రత్యక్షమై సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సందేశమును ముహమ్మద్ (స.అ.సం) వారికి వినిపించారు. వేదాల్లో చెప్పబడిన ఓంకారం తెచ్చే దైవదూత జిబ్రాయీల్ (అ.స) వారే. 

 2. వన వాస అవస్థ: ఈ అవస్థ యందు అవతారిక పురుషుడు తన అవతార ప్రకటన చేస్తారు. వెంటనే ప్రజలు విశ్వసించరు. వీరి వనవాస కాలంలో ప్రజలు ఒకరినొకరు విశ్వసించి వారికి శిష్యులవుతారు. 

వివరణ: దైవ సందేశం అందిన తర్వాత మహా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు తాను దైవ ప్రవక్త అని తెలియ జేశారు. ముందుగా విశ్వాసుల తల్లి ఖదీజా (రజి) మరియు హజ్రత్ అబూబకర్ (రజి) ఇద్దరు విశ్వసించారు.
క్రమక్రమంగా  ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు తిరస్కారుల బహిష్కరణకు గురై వనవాసము నందు 3 సంవత్సరాలు గడపవలసి వచ్చింది. 

3. అజ్ఞాత అవస్థ: ఈ అవస్థలో అవతార పురుషుని గురించి కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. 
వివరణ: ఈ అవస్థ యందు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు మక్కా నుండి మదీనా కు వెళ్ళారు. ఈ సందర్భము నందు ప్రవక్త ముహామాద్ (స.అ.సం) వారు అజ్ఞాతంలోకి వెళ్ళారని తిరస్కారులు భావించారు.  ఈ మధ్య కాలం అజ్ఞాతవాసంగా గుర్తించబడింది. 

4. యుద్ధ రంగ అవస్థ : అధర్మమునకు వ్యతిరేకంగా ఈ కల్కి అవతార పురుషుడు యుద్ధం చేస్తారు.

వివరణ: దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు ధర్మం పై యుద్ధ ప్రకటన గావించిన తర్వాత దైవ తిరస్కారులతో బదర్ యుద్ధం చేశారు. ఈ బదర్ యుద్ధం గురించి కల్కి పురాణంలో చెప్పబడింది. 

"యూత్ యామం భువం దేవాః స్వంషవతరణో రతః" (కల్కి పురాణం - అధ్యాయం - 2 శ్లోకం - 7)

అర్ధం:  దేవతలు రణరంగంలో కల్కి మహా పురుషునికి సహాయం చేస్తారు. 

వివరణ: బదర్ యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) అనుచరులు కేవలం 313 మంది మాత్రమే. కాని అవతలి పక్షం వాళ్ళు 1200 మంది. ఈ యుద్ధమునందు దేవుని యొక్క దూతల సహాయంతో విజయం ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారిని వరిస్తుంది. 

ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారికి చతుర్విధ అవస్థలు సంభవించినవి. 

కలిని నలుగురు సోదరులతో ఓడించడం: కల్కి పురాణం ప్రకారం కల్కి తన నలుగురు సోదరులతో కలిసి కాళీ సాతానును ఓడిస్తారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) తన నలుగురు సోదరులతో అంటే హజ్రత్ అబుబకర్ (రజి) హజ్రత్ ఉమర్ (రజి), హజ్రత్ ఉస్మాన్ (రజి) మరియు హజ్రత్ అలీ (రజి) లతో కలిసి దుష్ట శక్తులను ఓడించారు. ఏక దైవారాధక ధర్మాన్నిబోధించారు. 

సంపూర్ణ ప్రకాశం: కల్కి అవతారం గురించి ఎమున్నదంటే ఆయన సంపూర్ణ కాంతి కలిగి ఉంటారు. ఆయన చాలా అందంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) కూడా మానవాళిలో అత్యంత అందమైన వ్యక్తి. అందరికన్నా ఆదర్శవంతుడు. అన్నింటికి మించి గొప్ప యోధుడు. 

శరీర సువాసన: శ్రీ మద్ భగవత్ పురాణం ప్రకారం కల్కి అవతారం శరీర సువాసన హృదయాలను పరిశుభ్రపరుస్తుంది. 
ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి శరీర సువాసన ప్రఖ్యాతి గాంచింది. ఆయనతో ఎవరైనా కరచాలనం చేస్తే ఆ వ్యక్తి చేయి ఆరోజంతా సువాసనతో ఉండేది. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి పనివాడి మాటల ప్రకారం ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ ఆయన శరీర గంధము వ్యాపించేది. 

ఒకసారి ఉమ్మె సులేమాన్ ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి చెమటను సేకరించారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) ఆమెతో "దాంతో ఏంచేస్తారని" అడిగితె ఆమె దానిని సువాసన  ద్రవ్యాల్లో కలుపుతానని, ఎందుకంటే ఇది అన్ని సువాసనల కన్నా మేలైనది అని చెప్పారు. 


  1. (ఖుర్'ఆన్ సూరే అహ్జాబ్; ఆయత్ 9 
  2. భగవత్ పురాణం అధ్యాయం 12, పేరా 32, శ్లోకం 20 
  3. జమావుల్ ఫవాయిద్ పేజి నెం: 279 బుఖారి గ్రంధం 
  4. కల్కి పురాణం పేరా 2 శ్లోకం 4 
  5. ఆషావుస్సియాద్ పేజి 48 
  6. భగవత్ పురాణం అధ్యాయం 12, పేరా 32 శ్లోకం 21
  7. షిమాయిలె తిర్మిజీ 
  8. అనస్ (రజి) గారి పనివాడి వ్యాఖ్య "మేము ఎల్లప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) గారి రాకను వారి శరీరం  వచ్చే ఫిర్దౌస్ సువాసను బట్టి గుర్తించే వారము. విలియం మూర్ వ్రాసిన ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) జీవిత చరిత్ర నుంచి. 

కల్కి మహాపురుషుని శిష్య బృందం గురించి: కలియుగాన జన్మించే కల్కి అవతార పురుషుడు చతుర్భుజుడు అని చెప్పబడింది. చతుర్భుజుడు అంటే అందరు ఏమనుకుంటున్నారంటే నాలుగు చేతులు కలవాడని భావిస్తున్నారు. కాని అదికాదు. వాస్తవం ఏమిటంటే నాలుగు భుజాల వంటి శిష్యులు కలిగి ఉంటారని అర్ధం. 

శ్లోకం: "చతుర్ధి భ్రాతృర్బి ర్రేవ కలిష్యామి కలిక్షయమ్"  
(కల్కి పురాణం- అధ్యాయం - 2, శ్లోకం - 5) 

అర్ధం: సహోదరుల వంటి నాలుగు భుజాలతో ధర్మ సంస్థాపన చేస్తాడు. 

వివరణ: ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారికి నాలుగు భుజాల వలె పని చేసి నేటి ఇస్లాం స్థితికి నాలుగు స్థంబాలు గా నిలబడిన వారు 1. హజ్రత్ అబుబకర్ (రజి) 2. హజ్రత్ ఉమర్ (రజి), 3. హజ్రత్ ఉస్మాన్ (రజి) మరియు 4. హజ్రత్ అలీ (రజి) వీరి గురించే కల్కి పురాణం నాలుగు భుజాలుగా అభివర్ణించింది. వారి సహకారం వల్లనే ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారు ధర్మ సంస్థాపన చేశారు. 

దేవుని ద్వారా గుర్రం బహుకరణ: కల్కి మహాపురుషునికి  దేవుడు ఒక గుర్రాన్ని బహుకరిస్తాడు. ఆ గుర్రం మహిమాన్వితమైనది. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)కు దేవుడు ఒక వాహనాన్ని బహుకరిస్తాడు. ఆ వాహనం పేరు బుర్రాఖ్, అది మహిమాన్వితమైనది. 

కల్కిపురుషుని ఆత్మిక వాహనం బుర్రాఖ్ గురించి: 

శ్లోకం:  "ఆశ్వమాసుగగ్  యూరుహ్మ దేవదత్తం జగత్పతి: 
             అసినా సాదు దమన మష్టై యిశ్వర గుణాన్వితః"
(భగవత్ పురాణం - స్కంధం 12, అధ్యాయం - 2, శ్లోకం - 19)

అర్ధం: అష్ట ఐశ్వరముల వంటి గుణ సంపన్నుడైన కల్కి మహాపురుషుడు దైవదత్తమైన అశ్వాన్ని అధిరోహించి ఖడ్గముతో దుష్టులను సంహరిస్తాడు.

వివరణ: ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారు అష్ట ఐశ్వర్యములవంటి గుణ సంపత్తి గలవారు. ఈ విషయాన్ని ఈయన తిరస్కారులు సైతం అంగీకరించేవారు. వీరు దైవ దత్త మైన అశ్వాన్ని అధిరోహిస్తారని ఉంది. ఓ సారి దైవదూతలు వచ్చి దైవాజ్ఞ మేరకు దైవ దత్తమైన అశ్వం పై ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)వారిని అధిరోహింపజేస్తారు . యిదియే బుర్రాఖ్ అని చెప్పబడింది. యిది పూర్తిగా అశ్వం కాదు, అశ్వా కారంలో ఉంటుంది. సర్వ వాహన ప్రతీకగా ఉంటుంది. దీనిపై దైవదూతలు ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)వారిని దేవుని యొద్దకు తీసుకు వెళ్తారు. వీరు అచట నుండియే నమాజ్ ను (మానసిక ప్రార్ధన) ఈ లోకమునకు తీసుకు వచ్చి లక్షలాది, కోట్లాది మందిని తన "ఇస్లాం" అనే ఖడ్గముతో వారిలోని దుష్టత్వాన్ని తొలగించి ఈ కలియుగాన విశ్వాసుల్లా మార్చి ధర్మ సంస్థాపన చేయడం జరిగింది. ఈ బుర్రాఖ్ యొక్క చిత్రం ఎల్లోరా గుహ యందు చెక్కబడి ఉంది. నేటి ది హిందూ దిన పత్రికలో పై భాగమున కూడా బుర్రాఖ్ చిత్రముంటుంది. ఇంతటి ఘనమైన దైవదత్తమైన వాహనాన్ని ఏ ప్రవక్తలు అధిరోహించి ఉండలేదు. దేవుడు ఇది ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారికి మాత్రమే ఇచ్చాడు. ఇంతటి ప్రాధాన్యం ఉంది కావునే ఈ వాహనం గురించి ఓ శ్లోకంలో ఇలా వివరించ బడింది. 

"త్వగారుడ మిత్ చాశం కమగ బహురూపేనాం 
 శుక్ మేనజ్జ్య సర్వజ్ఞ మయాదత్త గ్రుహణ్భో" 
భావం: హరుని వాహనమెద్దు - హరికి తెల్లని గద్ద 
నెమలి సరస్వతి వాహనమందు - ఆశ్వవాహనంబు 
శ్రీ పరశునాధునిదే ఇటుల వేరు వేరు వారి వాహనముల 
సకల వాహనముల ఏక వాహనం కల్కి వాహనం 

ఇలా ఆత్మిక వాహనమైన "బుర్రాఖ్" ను అధిరోహించిన ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి గురించి వారి దేవదత్తమైన అశ్వం గురించి వేద వేదాంగాలు వర్ణించాయి. 
అలాగే వీరి స్థూల దేహ వాహనముల గురించి కూడా కల్కి పురాణం ఏం చెప్పిందంటే అవి 1. గుర్రం 2. ఒంటె అయి ఉంటాయని తెలిపింది. ఈ రెండు వాహనములు ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)వారు అధిరోహించి ఉన్నారు. కనుక ఈ కల్కి మహా పురుషుడు వీరేనన్న సంగతి ఆలోచనా జ్ఞానమున్న ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. 

శంబల అంటే నేటి మక్కాయేనా? 

కలియుగంలో పాపం హెచ్చుమీరి నప్పుడు కల్కి అవతార పురుషుడు శంబల అనే పట్టణంలో జన్మిస్తాడని వేదాలు పురాణాల్లోనూ చెప్పబడింది. అయితే ఈ శంబల అనే ప్రదేశం ఎక్కడ ఉంది? అది ఏది? అనే విషయం అనేక మంది మన మేధావులకు తొలుస్తున్న విషయం. ఈ క్రమంలో మన హిందూ దేశంలో పరిశోధన జరగక మునుపే రష్యా, చైనా, టిబెట్ వంటి దేశాల నుండి ఏంతో మంది మేధావులు ఈ సంబల అనే  ప్రదేశాన్ని కనిపెట్టడానికి నానా కష్టాలు పడ్డారు. ఇలా పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు రష్యాకు చెందిన అలేగ్జాందర్ నికోలస్ రోరిక్, ప్రొఫెస్సర్ గ్రుమ్వెడల్ ప్రముఖులు. ఈ శంబల గ్రామాన్నే 'తాషీలామా' అనే టిబెట్ గురువు కూడా తన "ఆధ్యాత్మిక రహస్యాలు" అనే పురాతన గ్రంధంలో వివరించాడు. వీరందరి పరిశోధనా ఫలితంగా వీరు చెప్పేదేమిటంటే శంభల భూమి నాభి స్థానంలో ఉంటుందని అది నేటి మక్కాయే నని వీరి అభిప్రాయం. భూగోళ, ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం కూడా ఇదే.

ఇంకా 'ఖమ్రాన్' గుహలో లభించిన అత్యంత పురాతన తాళ పాత్ర గ్రంధాలను సుదీర్గంగా పరిశీలించిన తర్వాత వీరికి ఓ అద్భుత విషయం తెలిసింది. అదేమంటే 'స్వర్గలోకపుశిల' . ఇది కల్కి మహా పురుషుడు శంభలలో జన్మించిన తదుపరి శంభల చేరుతుందని వ్రాయబడి యున్నది. అన్ని పురాతన గ్రంధాలు మక్కాయే శంభల అని నిరూపించి నప్పుడు మరి ఈ శిల సంగతేమిటి? అని పరిశీలించినప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి బాల్య జీవితంలో ఓ సంఘటన చదివి ఆశ్చర్యచకితులయ్యారు. అడిమిటంటే ఓ స్వర్గలోకపు శిల అక్కడి మక్కాలోని ఖురైషులకు లభించగా దానిని ఏ తెగవారు కాబా గృహ గోడనందు అమర్చవలెననే విషయం మీద  జరుగుతుంది. అప్పుడు చిన్న పిల్లవాడైన ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)వారు అన్ని తేగల సర్దారులచే దుప్పటి పట్టించి శిలను అందులో పెట్టి స్వయంగా తన చేతులతో ఈ శిలను కాబా గోడ నందు అమరుస్తారు. ఈ స్వర్గలోకపు శిల కాబా గృహాన్ని సందర్శించినప్పుడు ఇప్పటికీ కనిపిస్తుంది. అంతే గాని అంతకు మించి దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఈ శిలే తాటాకు గ్రంధాలలో చెప్పబడ్డ శిలయని వీరు నిర్ధారించి కలియుగాన వచ్చిన ఆ కల్కి మహాపురుషుడు  మహాప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారేనని నిర్ధారించుకొని అల్లాహ్ ను దైవ ప్రవక్తను విశ్వసించారు. 

అల్లాహ్ ఆ ఎడారి నందు ఓ నీటి బుగ్గను పుట్టిస్తాడు. ఆ నాటి బుగ్గనుండి  వచ్చే నీరే జమ్ జమ్ నీరు. అది ఆనాటి నుండి ఈనాటి వరకు అరేబియా ప్రాంతం మొత్తం వినియోగిస్తూ, హజ్ యాత్ర నిమిత్తం వచ్చే లక్షలాది హజ్ యాత్రికులు తమ తమ ప్రదేశాలకు తీసుకు వెళ్తున్నా ఈ నీటి బుగ్గ ఎండి పోలేదు. ఇది కూడా అల్లాహ్ యొక్క ప్రత్యక్ష మేలుకు నిదర్శనం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్త సృష్టిలోని ప్రతి విషయం కూడా అల్లాహ్ యొక్క మహత్తుకు నిదర్శనాలు. కళ్ళున్న ప్రతీ వారు దీన్ని చూడగలరు. చెవులున్న ప్రతీ వారు దీన్ని వినగలరు. జ్ఞానమున్న ప్రతీ వారు దీనిని తెలుసుకోగలరు.
వేదాలలో చెప్పబడ్డ కలియుగ మహా మంత్రం నేడు ముస్లిములు పఠించే కల్మా
"లా ఇలాహ ఇల్లల్లాహు ముహమాదుర్ రసూలులుల్లాహ్"
అర్ధం: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు ఎవరూ లేరు ముహమ్మద్ (. . సం) అల్లాహ్ యొక్క ప్రవక్త (సందేశహరుడు)

ఈ మహా మంత్రాన్ని పఠించి, విశ్వసించి మోక్షం నొందవలసినదిగా కలియుగ మానవులకు మహాఋషులు బోధించారు. వేదాలు కూడా చెబుతున్నాయి. అయితే భాష వేరు కావడం వలన ఇది ముస్లిములకు చెందినది అని మనం అనుకుంటున్నాము. కాని ఇది సర్వ మానవులు ఖచ్చితంగా పఠించి, విశ్వసించి, ఆచరించవలసిన ముక్తిదాయక మహా మంత్రం. కనుకనే ప్రఖ్యాత భక్తి ఉద్యమ ఋషి తులసీదాస్ తన "సంగ్రామ్పురాణ్" లో ఈ విధంగా చెప్పారు
"లా యిలాహ హరణేపాపం యిల్లల్లాహు పరమ పదం
 జన్మ వైకుంఠప్రాప్నోతి తూజపేనామే మొహమ్మదం"
అర్ధం: ఏమానవుని సర్వపాపములైనను హరించవలెనన్న, పవిత్రమైన, ఉత్తమమైన స్థానం  పొందవలెనన్న దేవుడు ఒక్కడని ఆయన తప్ప ఆరాధ్యుడు లేడని ముహమ్మద్ (. . సం) ఆయన ప్రవక్త యని విశ్వసించాలి.
ఇంకా తులసీ దాస్ తన హిందీ 'సంగ్రామ్పురాణ్' లో యిలా చెప్పాడు.
"జబ్ సంగ్రామ్కేదిన్హువేబినా ముహమ్మద్ కేనయ్యా పార్నహోవే"
అర్ధం: ఎప్పుడైతే ప్రళయకాలమెర్పడుతుందో ముహమ్మద్ (. . సం) వారితో తప్ప యితర ప్రవక్తలతో ఆకాలాన్ని దాటలేము.

కల్మా అంతటి మహత్తరమైన వచనంకాబట్టే సిక్కు గురువు గురునానక్ఈ కల్మా పఠించి ముస్లింగా మారి మక్కా యాత్ర చేసి కాబా ఆలయాన్ని సందర్శించారు.
యింకా భారతదేశంలో మలబార్ హిందూ రాజు శ్రీ "చెరమాన్పెరమాళ్" అందరికంటే ముందు స్వయంగా మహా ప్రవక్త ముహమ్మద్ (. . సం) వారిని దర్శించి ఆయన సమక్షంలో ఈ కల్మా పఠించి ముస్లిం (దైవ విధేయుడు) గా మారారు. అదెలాగంటే ఓ సందర్భంలో రాజు "చెరమాన్పెరమాళ్" ఆకాశంలో ఓ వింత దృశ్యం చూశారు. ఈ వింత ఇప్పటికీ ఖగోళ శాస్త్ర రికార్డులలో నమోదై ఉంది. ముఖ్యంగా బ్రిటీష్ శాస్త్ర రికార్డ్స్ లో నేటికినీ ఉన్నది. ఈ వింత రికార్డ్ అయిన తేదీని పరిశీలిస్తే ఇది మహా ప్రవక్త ముహమ్మద్ (. . సం) కాలంలో జరిగిందని తెలుస్తుంది. చంద్రుని పై అడుగుపెట్టిన హ్యోమోగాములు తీసుకు వచ్చిన కొన్ని రాళ్ళను బట్టి యూరప్ సైంటిఫిక్ లేబరేటరీ అనేక పరిశోధనలు చేసినప్పుడు చంద్రుడు కుదుపుకు గురియై చీలి కలిసినట్లు నిర్ధారించారు.
అసలు చంద్రునికి సంబంధించిన ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే విగ్రహారాధమూకలు జగత్ ప్రవక్త ముహమ్మద్ (. . సం) వారి దగ్గరికొచ్చి నిజంగా నీవు దైవప్రవక్తవే అయితే మాకు ఏదైనా ఒక అద్భుతం చేసి చూపించు అని వేధించేవారు. అప్పుడు ప్రవక్త (. . సం) మహనీయులు అన్ని మహిమలకు ఆధారభూతుడు సర్వసృషిటికర్తయైన అల్లాహ్ యే నని తన వద్ద ఎటువంటి మహిమలు లేవని పలికారు. అప్పుడు వారు ఏదీ నీ దేవుని ప్రార్ధించి ఆ చంద్రుని రెండుగా చీల్చి చూపమన్నారు. ప్రవక్త ముహమ్మద్ (. . సం) వారు దేవుని ప్రార్ధించి చంద్రునివైపు వేలెత్తి చూపించారు. చంద్రునిలో పెనుమార్పు జరిగి చంద్రుడు రెండుగా చీలి మళ్ళీ కలిసెను. ఈ సంఘటననే మన హిందూ దేశంలో కేరళ (మలబార్) రాజు చెరమా్న్పెరమాళ్ చూశారు. ఈ అద్భుత సంఘటనకు ఆస్ఛర్యచకితుడై, రాజు తన రాజ్యంలోని పండితులను, జ్యోతిష్యులను ఈ విషయం పై చర్చించగా అందులోని జ్ఞాన  సంపత్తి కలిగిన వారు ఏమని సెలవిచ్చారంటే ఓ రాజా! ఒక మహాపురుషుడు, దైవాంశ వలన జన్మించిన ఓ మహా ప్రవక్త అవతరించి ఈ కార్యము చేసి ఉన్నారని చెపారు. ప్రపంచమున ఉద్భవించిన ఆ మహా ప్రవక్త ఎవరైయుందురని రాజు పలువురితో సంప్రదించగా వ్యాపార నిమిత్తం వచ్చియున్న అరబ్బు వర్తకులు రాజుతో కల్సి ఓ రాజా! మా దేశమందు ఓ మహాప్రవక్త ఉద్భవించి యున్నారని తెలిపారు. ప్రవక్త (. . సం) వారి గుణగణాలు, మహిమాన్వితమైన జీవితమును గురించి వివరించారు. అంతట రాజు తనకు మోక్షం నిచ్చుటకే దేవుడు ఈ సంఘటన చూపెనని తలచి కొంతమంది పండితోత్తములను వెంట బెట్టుకొని అరేబియా వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ (. . సం) వారిని దర్శించి ఆయన  చేతుల మీదుగా "లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్" అని "కల్మా" పఠించి విశ్వాసియై భారత దేశము నకు తిరిగి వచ్చెను. ఈ విధంగా తొట్ట తొలిసారిగా భారతదేశంలో ఇస్లాం ప్రవేశించెను.
ఈ కల్మా ముక్తిదాయక మహా మంత్రమును భారత దేశంలో అనేక మంది హిందూ రాజులు, సాధువులు పుణ్యఫలాపేక్షతో అనేక చోట్ల చెక్కించారు. నేటికినీ అనేక దేవాలయాలలో, మఠాలలో ఈ కల్మా అరబ్బీ భాషలో చెక్కి ఉండడం మనం గమనిచవచ్చు. అందులో కొన్నిటి పేరు ఏమంటే:

  1. శ్రీ కాశీ విశ్వనాధ మందిరం బనారస్ యు. పి. 
  2. శ్రీ బాబా నానక్ గారి గురుద్వారా డేరే బాబా నానక్ 
  3. శ్రీ రామేశ్వర మందిరం దక్షిణ భారత దేశం 
  4. శ్రీ కొడెక్కల్ శ్రీ బసవప్పమఠము, కర్నాటక 
  5. తింతని మానేశ్వర మఠము గుల్బర్గా కట్నాటక 
  6. కొప్పాల్ శిరస్సా మఠము కర్నాటక 
  7. కడగంచి మరులారై సంప్రదాయ మఠము కర్నాటక 
  8. శిర్హట్టి ఫకీర్ స్వామి మఠము, కర్నాటక
  9. వర్వీ మౌనేశ్వర స్వామీ మఠము కర్నాటక
  10. శిద్వారుడ్ శ్రీ శంకరాచార్య మఠము, కర్నాటక
  11. శృంగేరి శ్రీ శంకరాచార్య మఠం కర్నాటక  
  ముస్లిములు చేసే నమాజ్ (మానసిక ప్రార్ధన) గురించి వేదవేదాంగాలు ఏమి చెప్పాయి?

అన్నింటి కంటే మరో ఆశ్చర్యకరమైన అద్భుత విషయం, భారత దేశంలో అన్ని వర్గాల వారు ఆలోచించవలసిన విషయం, మేధావులు దృష్టిని కేంద్రీకరించాల్సిన విషయమేమిటంటే ముస్లిములు ఆచరించే నమాజ్ అంటే ఏమిటి? కలియుగంలో వచ్చిన ఈ ప్రార్ధనా విధానం గురించి వేదాలు ముందే ఎందుకు చెప్పాయి? అన్ని ప్రార్ధనల కన్నా మానసిక ప్రార్ధన ఉత్తమమైనదని మనకు వేదాలు చెబుతున్నాయి. కలియుగంలో వచ్చే కల్కి మహా పురుషుడు చేసే ప్రార్ధన మానసిక ప్రార్ధన యని చెప్పబడింది. ఈ ప్రార్ధనా విధానాన్నే ప్రతి మానవుడు ఆచరించి మోక్షం పొందవలెనని వేద వేదాంగాలలోను, పురాణాలలోను తెలుపబడింది. నేడు ముస్లిములు ఆచరించే నమాజ్ (మానసిక ప్రార్ధన) గురించే యివన్నీ చెప్పబడ్డాయి.

ఈ నమాజ్ గురించి శ్రీ రామ తత్వబోధామృతంలో యిలా చెప్పబడింది.

శ్లోకం: "ప్రధమం తారకం చైవ ద్వితీయం దండముచ్చ్యతే 
         తృతీయం కుండలాకారం, చతుర్ధం అర్ధచంద్రకం 
         పంచమం బిందు సంయుక్తం ఓం నిత్య జ్యోతి రూపకం"

శ్లోకం: "అష్టాంగం చతుష్ట్ పాదం, త్రిస్థానం పంచదేహకం 
           ఓం నిత్యానే జాయతే బ్రాహ్మణోన భవేత్ సహి"

అర్ధం: ప్రధమం తారకం చైవ : సృష్టిలోని పక్షులను చూడుము అవి నిలబడి ఉన్నాయి. అగ్ని కూడా ఇదే స్థితిలో రగులును. ఇవి తారకం స్థితిలో నిలబడి ఉన్నవి. కనుక నీవు అదే స్థితిలో ధ్యానిన్చుము.

వివరణ: ముస్లిములు కూడా తాము చేసే నమాజ్ ప్రధమంగా ఇదే స్థితిలో నిలబడతారు.

ద్వితీయం దండముచ్చ్యతే : ఈ భూమి పై ప్రాకే జీవరాసులను చూడుము. అవి అష్టాంగా నమస్కార స్థితిలో ఉన్నవి.  నీవును అదే స్థితిలో ధ్యానించుము.

వివరణ:  ముస్లిముల యొక్క నమాజ్ నందు రెండవ స్థితి యిదే విధంగా ఉంటుంది.

తృతీయం కుండలాకారం : ఈ పర్వతములను చూడుము. ఇవన్నీయును కూర్చుని ఉన్నవి. భూమి కూడా కుండలాకారం స్థితిలో ఉన్నది. కనుక నీవు కూడా కుండలాకార స్థితిలో ధ్యానించుము.  

వివరణ:  ముస్లిముల యొక్క నమాజ్ నందు మూడవ స్థితి యిదే విధంగా ఉంటుంది.

కలియుగం నందు వస్తుందని చెప్పబడ్డ వరుణో వేదమే పవిత్ర గ్రంధం 
ఖుర్'ఆన్

వేదాలు మొత్తం ఐదు. అందు నాలుగు వేదాలు కలియుగం కంటే ముందే వెలువడ్డాయి. అవి ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణవేదము, సామ వేదము. యిక ఐదో వేదము, వరుణోవేదముగా చెప్పబడింది. యిది కలియుగము నందు వస్తుందని చెప్పబడింది. పవిత్రమైన హృదయంతో నిస్పక్షిపాత దృష్టితో పరిశీలించిన నేటి దైవ గ్రంధం ప్రపంచంలో అత్యధికంగా పఠించబడుతూ, అత్యంత గౌరవించబడుతున్న దివ్య గ్రంధం ఖుర్'ఆన్ పంచమ వేదమని ఇదియే వరుణోవేదమని సాక్ష్యాధారాలతో తేట తెల్లమగుచున్నది. దీనికే బీజగ్రంధమని ప్రణవ వేదమని కూడా పేర్లు కలవు.

ఖుర్'ఆన్ అరబ్బీలో ఉన్న కారణంగా యిది మనది కాదు ముస్లిములది అని హిందూ సోదరులు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు ముస్లిములు కూడా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ యిది మనదే అనుకుంటున్నారు. కాని అసలు విషయం అది కాదు. పవిత్ర ఖుర్'ఆన్ సర్వ మానవాళికి రుజుమార్గం చూపడానికి ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) పై అవతరించినటువంటి చివరి గ్రంధం. స్వయంగా ఈ దివ్య గ్రంధం ఏమంటుందో గమనించగలరు :

(ఖుర్'ఆన్; 14: 52) "ఇదొక సందేశం, వారిని హెచ్చరించాలని, యదార్ధంగా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది (ఖుర్'ఆన్) పంపబడింది."

దీనిని గురించి కపిల గీతలో ఇలా చెప్పబడింది.

"తారకం చైనా ఋగ్వేదో,యజుర్వేదోహి దండకం కుండల్యం సామవేదం అర్ధ చంద్రోరధర్వేదన, బిందుత్స సూక్ష్మవోదయం, తరుణో వేదకం బీజకం"

అర్ధం: ఇప్పటివరకు నాలుగు వేదాలు వచ్చినవి. ఇది అందరికి తెలిసిన విషయమే . మరి కలియుగ ప్రణవ వేదమై ఎల్లప్పుడూ చదవ బడే దైవ సర్వ వేద సారాంశమైన వరుణోవేదమే బీజ గ్రంధం. ఇంతటి మహిమాన్వితమైన పవిత్ర గ్రంధం కనుకనే వేద వ్యాస మహర్షివారు తన వ్యాస ఉపనిషత్ లో కలియుగ మానవులకు ఈ విధంగా తెలియజేశారు.

శ్లోకం: "ఇతిహాస పురాణం చందాన నరాశ్యాషి 
            ఇంజీలం జబ్బూరం తౌరేతాని సర్వంనే 
            సత్యహః తద్ ఖురానాం నామకం గ్రంధం సాగచ్చాతి" 

అర్ధం:  ఇతిహాసాలు, వేదాలు, పురాణాలు, ఇంజీల్, జబ్బూరు, తౌరాతు ఈ సర్వ గ్రంధములన్నియు సత్యమే. కాని ఖుర్'ఆన్ నామము గల గ్రంధం సర్వ గ్రంధ సారం కనుక దీనిని ఆచరింపుడు. ఇక్కడ మనకు అత్యంత ఆశ్చర్య పరచే విషయమేమిటంటే పైన చెప్పబడిన అన్ని గ్రంధములు దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) రాకడను తెలియపరిచాయి. కల్కి మహా పురుషుడైన దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారిపై అవతరించిన గ్రంధాన్ని అనుసరిస్తే ముక్తి దొరుకుతుందని కూడా చెబుతున్నాయి.

దీనిని గురించి కల్కి పురాణం ఏం చెబుతుందో గమనిద్దాం:

శ్లోకం: "సంకల్పసిద్ధం శ్లోకే: షట్ సహస్త్ర శతాధికమ్ 
           సర్వ శాస్త్రార్ద తత్వానాం సారం శ్రుతి మనోహరమ్"
(కల్కి పురాణం ; అంశం 3, అధ్యాయం 31, శ్లోకం 28)

అర్ధం: సంకల్పం సిద్ధించు 6వేల శతాధిక శ్లోకములతో సర్వ ప్రవక్తల ఓంకారములు కేంద్రీకరణమై శ్రుతి మనోహర రూపం దాల్చి ఈ గ్రంధం అవతరిస్తుంది.

వివరణ: పై శ్లోకం వివరించునట్లుగానే ఖుర్'ఆన్ షరీఫ్ ఆరువేల శతాధిక శ్లోకములతో అవతరించింది. సర్వ గ్రంధాల సారం ఇందులో ఇమిడి ఉంది. ఇది మానవునికి ఇహ, పరలోక సంబంధమైన విషయాలలోనూ మార్గం చూపిస్తుంది. ఒక వ్యక్తా? సమాజమా? దేశమా? ప్రపంచమా? సామాజికంగా ఎలా ఉండాలి? నైతికంగా ఎలా ఉండాలి? పరిపాలనా పరంగా ఎలా ఉండాలి? ఆర్ధికంగా ఎలా ఉండాలి? అనే విషయాలను బోధిస్తుంది.

ఎనిమిది దైవిక లక్షణాలు:  భగవత్ పురాణం అధ్యాయం 12 ప్రకారం కల్కి అవతారం 8 దైవిక లక్షణాలు కల్గి ఉంటారు. అవేమిటంటే అగోచర జ్ఞానం, ఉన్నత వంశం, ఆత్మనిగ్రహం, శారీరక బలం, తక్కువగా మాట్లాడడం, పరోపకారం, కృతజ్ఞత.

ప్రవక్త భవిష్యవాణి : ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) కు భవిష్య వాణి తెలిపారు.

ఉదాహరణకు రోమన్లు పర్షియన్లకు మధ్య యుద్ధం జరుగుతున్నప్ప్పుడు రోమన్లు పరాజయం పాలయ్యారు. అప్పుడు ప్రవక్త (స.అ. సం) దైవికంగా ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే తన సహచరులకు తెలిపారు. అయితే ఖురేషీయులు ప్రవక్త (స.అ.సం) సహచరుల ద్వారా ఈ విషయాన్నీ తెల్సుకొని రోమన్లు ఓడిపోయారని తెగ సంబర పడి పోయారు. కాని 9 సంవత్సరాల తర్వాత పర్షియన్లు ఓడిపోతారని ప్రవక్త (స.అ. సం) భవిష్యవాణి తెలిపారు. ఆయన చెప్పినట్లే క్రీ. శ 627 లో జరిగిన యుద్ధంలో రోమన్లు గెలిచారు. ఈ సందర్భంగా సూరే రోమ్ అవతరించింది. అలాగే ప్రవక్త (స.అ.సం) దైవిక జ్ఞానం ద్వారా చెప్పిన అనేక సంఘటనలు చరిత్రలో నమోదయ్యాయి.

ఉన్నత వంశం: కల్కి అవతారం ఉన్నత వంశంలో జన్మిస్తుందని ఉంది. ప్రవక్త (స.అ.సం) కూడా ఉన్నత పూజారి ఇంట్లోజన్మించారు. ఆయన వంశం  కాబాగృహం ధర్మ కర్తల వంశం. ప్రవక్త (స.అ.సం) క్రీ.స. 571 లో జన్మించారు. ఖురైషియుల్లోని హాషిం వంశంలో పుట్టారు. ఈ  వంశానికి అరబ్బులలో గొప్ప గౌరవ ప్రతిష్టలు ఉండేవి.

1. మహా భారతం 2. ఆయన క్రీ. శ. 571లో జన్మించారు. ఉన్నత పూజారి ఇంట్లో జన్మించారు.  ఆ వంశం సుదీర్ఘ కాలంగా కాబా గృహానికి ధర్మకర్తలుగా ఉన్న వంశం, ఇంట్రోడక్షన్ సెర్మన్స్ ఆఫ్ ముహమ్మద్ (స.అ.సం), లేన్ పూల్ పబ్లిషర్స్, లండన్. 3. ఆయన హాషిం కుటుంబంలో జన్మించారు. అరబ్బులలో ఆ కుటుంబానికి అత్యంత గౌరవమర్యాదలు ఉండేవి. ఆ కుటుంబం  మక్కా నగరానికి కులీన కుటుంబం వంటిది. వారసత్వంగా కాబా గృహానికి పూజారులుగా ఉంటున్న కుటుంబం. (డిక్లైన్ అండ్ ఫాల్ అఫ్ రోమన్ ఎంపైర్, ఎడ్వర్డ్ గిబ్బన్, పేజి 229, వాల్యుమ్ 5)

దైవవాణి:  ఇది ఎనిమిది లక్షణాల్లో నాల్గవ లక్షణం. దైవవాణి  దేవుని హితబోధ ఒక సందేశహరుని ద్వారా అందడం. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారికి దైవ వాణి అవతరించేది. సర్ విలియం మూర్ కూడా ఈ విషయాన్ని వివరిస్తూ ప్రవక్త (స.అ.సం) ను దేవుని ప్రతినిధిగా అభివర్ణించాడు. దీన్ని బట్టి ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం), కల్కి అవతారం ఒకటే అని అర్ధం అవుతుంది. (లైఫ్ ఆఫ్ ముహమ్మద్, సర్ విలియం మూర్) 

భౌతిక శక్తి: ఎనిమిది లక్షణాల్లో ఇది ఐదవ లక్షణం. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)కు అందరికన్నా ఎక్కువగా శారీరక బలం ఉండేది. రుక్కానా అనే పహల్వాను ఒక హుగలో ఉండేవాడు. అతను ఖురైష్ వంశానికి చెందినవాడు. ప్రవక్త (. . సం) అతనితో దైవాన్ని ఎందుకు విశ్వసించడం లేదు? ఎందుకు దేవునికి భయపడడం లేదు? అని ప్రశ్నించారు. ఆ పహిల్వాను ఏవేవో వివరణలు అడిగాడు. ప్రవక్త (. . సం) అతనితో నీవు చాలా బలవంతుడివి, నేను కనక నిన్ను కుస్తీలో ఓడిస్తే నువ్వు దేవుని విశ్వసించడం ప్రారభిస్తావా? అని ప్రశ్నించారు. అతను అంగీకరించాడు. ప్రవక్త (. . సం) అతడిని సునాయాసంగా కుస్తీలో ఓడించారు. ఒకసారి కాదు రెండు సార్లు, కాని అతను మాత్రం ఆయన్ను ప్రవక్తగా అంగీకరించడానికి, దేవుని విశ్వసించడానికి సిద్ధపడలేదు.

తక్కువగా మాట్లాడడం:
గొప్పవారి గొప్ప లక్షణాల్లో తక్కువగా మాట్లాడడం కూడా ఒకటి. ప్రవక్త ముహమ్మద్ (. . సం) చాలా తక్కువగా మాట్లాడేవారు. కేవలం చర్చలు, సంవాదాల్లో మాత్రమే మాట్లాడేవారు. అరేబియా ప్రజలు ఆయన మాట్లాడుతుంటే మంత్రముగ్ధులై చూస్తూ వినేవారు.
పరోపకారం: మతంలో పరోపకారం అనేది చాలా ముఖ్యమైనది. ఎనిమిది లక్షణాల్లో ఏడవ లక్షణం పరోపకారానికి సంబంధించినది. పురాణాల్లో ఈ ఎనిమిది లక్షణాల వివరాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (. . సం) ఎల్లప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఇంటి ముందు బీదవారు ఎల్లప్పుడు ఉండేది. ఆయన ఎవరినీ నిరుత్సాహ పరచేవారు కాదు. సర్ విలియం మూర్ ప్రకారం చాలా అందమైన వ్యక్తి. ఆరోగ్యం, శారీరక దరుఢ్యంతో పాటు పరోపకారం కలిగిన వ్యక్తి.
1.   అసాహుస్సియార్ పేజి 79, లైఫ్ ఆఫ్ ముహమ్మద్, పేజి 523.
2.   ఆయన చాలా క్లుప్తంగా, సమగ్రంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడిన మాటలు ధృఢంగా, స్పష్టంగా ఉండేవి. ఆ మాటలను ఎవరూ మరిచిపోలేని విధంగా ఉండేవి. (ఇంట్రొడక్షన్ఆఫ్ ది స్పీచెస్ ఆఫ్ ముహమ్మద్, లైన్పూల్)
3.   సహచరులతో కూర్చున్నప్పుడు ఆయన మౌనంగానే ఉండేవారు. అయితే ఏదైనా విషయమై మాట్లాడవలసి ఉన్నప్పుడు చాలా స్పష్టంగా, వాగ్ధాటితో చెప్పేవారు. భాషా పరంగా పటిష్టమైన శైలిలో సామెతలు, పలుకుబళ్ళు ఉపయోగిస్తూ అందరినీ ఆకట్టుకునేలా మాటలాడేవారు.     
(ముహమ్మద్ సాహెబ్ ఆండ్ ముహమ్మడనిజమ్‌, బోస్ వర్త్ పేజి 110)
4.   నిజానికి ప్రవక్త (. . సం) ఇంటి ముందు ఒక అరుగు ఉండేది. అక్కడ ఎల్లప్పుడు బీదవారుండేవారు. ఆయన చేసే దానధర్మాల వల్ల జీవించేవారు. వారిని అందుకే అరుగు వాళ్ళు అని కూడా జనం పిలిచేవారు. (లైఫ్ ఆఫ్ ముహమ్మద్, విలియం మూర్ పేజి 523).
కృతజ్ఞతా భావం:  ఇది ఎనిదవ లక్షణం. పురాణాల్లో పేర్కొన్న ఎనిమిది లక్షణాల్లో ఇది చివరి లక్షణం. ఇంతకు ముందు మనం ఏడు లక్షణాల గురించి వివరణ ఇచ్చాము. ప్రవక్త ముహమ్మద్ (. . సం) లో కృతజ్ఞతా భావం ఏ స్థాయిలో ఉండేదో చరిత్ర కారుడు కూడా కాదనలేడు. అంసార్ల గురించి ఆయన చెప్పిన మాటలే అందుకు నిదర్శనాలు.
దైవ వాణి ఆధారంగా హితబోధ: కల్కి అవతారం స్థాపించే మతం వైదిక మతమని అందరికి తెలిసిన వాస్తవం. అలాగే ప్రవక్త ముహమ్మద్ (. . సం) ద్వారా అవతరించిన దివ్య ఖుర్ ఆన్దేవుని వాణి. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించక పోయినా ఇది వాస్తవం. అందువల్ల ఈ మత స్థాపన, లక్షణాలు, ప్రేమ, గౌరవాదరాలు అన్నీ దైవ ప్రేరితాలే. ఇవే బోధనలు మనకు వేదాల్లోను కనబడతాయి. ఖుర్ ఆన్లో విగ్రహారాధనను తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఖుర్ ఆన్బోధనల ప్రకారం ముస్లిములు రోజుకు ఐదు పూటల నమాజ్లు చేస్తారు. బ్రాహ్మణుల్లోనూ పూజారులు రోజుకు మూడు సార్లు సంధ్యావందనం చేస్తారు. ఇప్పుడు మనం ఖుర్ ఆన్‌, వేదాల్లో మౌలిక బోధనల్లో సారూప్యాలను చూద్దాం